అన్వేషించండి

IND Vs SL, 1st ODI : తొలి వన్డేలో శ్రీలంకపై భారత్ ఘన విజయం, సెంచరీతో పోరాడిన శనక

IND Vs SL, 1st ODI : శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 67 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది.

IND Vs SL 1st ODI : శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్ లో భారత్ 1-0 తో లీడ్ లో నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చాటిన భారత్ శ్రీలంకను 67 పరుగుల తేడాతో ఓడించింది. సెంచరీతో రాణించిన విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. శ్రీలంకతో తొలి వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ లు అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు 143 పరుగుల రికార్డు భాగస్వామ్యం అందించారు. రోహిత్ శర్మ (83), శుభ్ మన్ గిల్ (70) రాణించారు. విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ (87 బంతుల్లో 113 పరుగులు)తో శ్రీలంక ముందు 373 లక్ష్యం ఉంచింది భారత్. భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంక బ్యాట్స్ మెన్ భారత్ పేసర్ల దాటికి క్రీజ్ లో నిలవలేకపోయారు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3 వికెట్లు, మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు, మహమ్మద్ షమీ, హార్థిక్ పాండ్యా, చాహల్ చెరో వికెట్ తీశారు.   

374 భారీ లక్ష్యాన్ని చేజింగ్ చేయడంలో తడబడిన శ్రీలంక వరుసగా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ దసున్ శనక సెంచరీతో(88 బంతుల్లో 108 పరుగులు) అజేయంగా నిలవడంతో నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయిన శ్రీలంక 306 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాట్స్ మెన్ లో పాతుమ్ నిస్సాంక(80 బంతుల్లో 72 పరుగులు), ధనంజయ డి సిల్వా(40 బంతుల్లో 47 పరుగులు) రాణించారు.  శ్రీలంక బౌలర్లలో కసున్ రజిత 3 వికెట్ల పడగొట్టగా, దిల్షన్ మధుశంక, చమిక కరుణరత్నే, దసున్ షనక, ధనంజయ డి సిల్వా చెరో వికెట్ తీశారు.  

కోహ్లీ, శనక సెంచరీలు 

గౌహతిలోని బర్సపరా స్టేడియంలో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, దసున్ శనక సెంచరీలతో ఆకట్టుకున్నారు. విరాట్ కోహ్లీ 87 బంతుల్లో 113 పరుగులు చేశాడు. కోహ్లీకి ఇది 73వ అంతర్జాతీయ సెంచరీ. శ్రీలంక కెప్టెన్ దసున్ శనక 88 బంతుల్లో అజేయంగా 108 పరుగులు చేయడంతో 50 ఓవర్ల కోటా పూర్తైన సరికి శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 306 వద్ద ఆట ముగించింది. శ్రీలంక కెప్టెన్ దసున్ శనక టాస్ గెలిచి ఆతిథ్య జట్టును మొదట బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ముందు బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది.  రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70) 143 పరుగుల ఓపెనింగ్ స్టాండ్‌తో భారీ స్కోర్ కు బాటవేశారు. లంక బౌలర్లలో కసున్ రజిత మూడు వికెట్లు తీశాడు. అయితే అతను తన 10 ఓవర్ల స్పెల్‌లో 88 పరుగులను ఇచ్చాడు. శ్రీలంక ఛేజింగ్‌లో దసున్ షనక(108), పథౌమ్ నిస్సాంక (72), ధనంజయ డి సిల్వా (47) రాణించారు.  భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 57 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget