అన్వేషించండి

IND vs WI: కోహ్లీ పనైపోయింది - ఫ్యాబ్ 4 నుంచి అతడ్ని తప్పించాలి : ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు

రన్ మిషీన్ విరాట్ కోహ్లీపై భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ ఇంక ఎంతమాత్రమూ డేంజర్ కాదని వ్యాఖ్యానించాడు.

IND vs WI: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ  పనైపోయిందని, టెస్టు క్రికెట్‌లో అతడు ఇక ఎంతమాత్రమూ   ప్రమాదకర బ్యాటర్ కాదని  మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆధునిక క్రికెట్‌లో ‘ఫ్యాబ్ 4’గా పిలుచుకునే  స్టీవ్ స్మిత్,  కేన్ విలియమ్సన్, జో రూట్, విరాట్ కోహ్లీలలో.. మిగిలిన ముగ్గురూ  మెరుగ్గా ఆడుతున్నా  రన్ మిషీన్  మాత్రం వెనుబడిపోయాడని,  అతడిని ఫ్యాబ్ 4  జాబితా నుంచి తప్పిస్తే బెటర్ అన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. 

తన యూట్యూబ్ ఛానెల్‌లో  ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ..‘ఫ్యాబ్ 4 ఇక ఎంతమాత్రమూ  ఉనికిలో లేదు.  ఇక దానిని ఫ్యాబ్ 3 అని పిలుచుకోవడమే బెటర్. ఒకానొక టైమ్‌లో కోహ్లీ, రూట్, స్మిత్, కేన్ విలియమ్సన్‌లను  మనం ఫ్యాబ్ 4గా పిలిచేవాళ్లం.  ఒకదశలో డేవిడ్ వార్నర్ కూడా ఈ జాబితాలో చేరేందుకు  తీవ్రంగా పోటీపడ్డాడు.కానీ టెస్టు క్రికెట్‌లో  కోహ్లీ, వార్నర్‌ల ప్రభావం దారుణంగా తగ్గింది.  2014 నుంచి 2019 వరకు మాత్రమే ఫ్యాబ్ 4 ఉనికిలో ఉంది.  

టెస్టులలో కోహ్లీ గణాంకాల  గురించి మనం మాట్లాడుకుంటే .. 2014 నుంచి 2019 మధ్య కాలంలో అతడు పీక్స్ చూశాడు.  ఆ ఐదేండ్ల కాలంలో కోహ్లీ.. 62 టెస్టులలో 58.71 సగటుతో ఏకంగా 5,695 పరుగులు చేశాడు. ఇందులో 22 శతకాలు కూడా ఉన్నాయి.  అప్పుడు కోహ్లీ అన్‌స్టాపబుల్‌గా ఉన్నాడు. స్వదేశంలో ఏకంగా నాలుగు డబుల్ సెంచరీలు చేసి సంచలనాలు సృష్టించాడు. 

కానీ  ఇప్పుడు ఆ మ్యాజిక్ లేదు.  2020 తర్వాత  టెస్టులలో కోహ్లీ గణాంకాలు దారుణంగా పడిపోయాయి. మూడేండ్లు ఫామ్ లేమితో తంటాలు పడ్డ కోహ్లీ... ఈ మూడేండ్ల కాలంలో 25 మ్యాచ్‌లు ఆడి  1,277 పరుగులు మాత్రమే చేశాడు.  ఈ క్రమంలో సగటు 29,69 గా ఉండగా ఒక్కటంటే ఒక్కటే సెంచరీ నమోదైంది. అది కూడా ఈ ఏడాది అహ్మదాబాద్ వేదికగా  ఆస్ట్రేలియాతో ముగిసిన  నాలుగో టెస్టులో..  ఓవరాల్‌గా కోహ్లీ  ప్రదర్శన టెస్టులలో నానాటికీ తగ్గుతూ వస్తోంది. ఈ ఫార్మాట్‌లో అతడు ఇంకెంతమాత్రమూ  ప్రమాదకర బ్యాటర్ అయితే కాదు..’ అని వ్యాఖ్యానించాడు.   

 

2011లో   వెస్టిండీస్‌తో మ్యాచ్ ద్వారా టెస్టులలోకి ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ.. ఇంతవరకూ 109 టెస్టులు ఆడి 8,479 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఏడాది క్రితం వరకూ కోహ్లీ సగటు 50 కి పైనే ఉండేది. కానీ  ఫామ్ కోల్పోవడంతో సగటు 48.72కు పడిపోయింది. టెస్టులలో కోహ్లీకి 28 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలున్నాయి. ఇదే క్రమంలో  గడిచిన మూడేండ్లలో  జో రూట్  టెస్టు క్రికెట్ లో పరుగుల ప్రవాహాన్ని సృష్టిస్తున్నాడు.  స్మిత్ తన నిలకడను కొనసాగిస్తుండగా మధ్యలో కొంత తడబడినా కేన్ మామ కూడా  సెట్ అయ్యాడు. ఎటొచ్చి ఈ నలుగురిలో టెస్టులలో అత్యంత చెత్తగా ఆడుతున్న ఆటగాడు కోహ్లీనే కావడం గమనార్హం.  టెస్టులలో యువ రక్తాన్ని ఎక్కించే పనిలో ఉన్న  భారత జట్టు.. ఈనెల 12 నుంచి వెస్టిండీస్ వేదికగా జరుగబోయే రెండు టెస్టుల సిరీస్‌పై ప్రత్యేక దృష్టి సారించనున్న నేపథ్యంలో కోహ్లీ ప్రదర్శన మీద కూడా   సెలక్టర్లు ఓ కన్ను వేయనున్నారు.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pastor Praveen case: పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
Chandra Babu Latest News: అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
Hyderabad Metro Latest Timings: మారిన హైదరాబాద్‌ మెట్రో టైమింగ్స్‌- ఏప్రిల్‌ 1 నుంచి అమలు!
మారిన హైదరాబాద్‌ మెట్రో టైమింగ్స్‌- ఏప్రిల్‌ 1 నుంచి అమలు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Fastest Stumping vs RCB | వరుసగా రెండో మ్యాచ్ లోనూ ధోని మెరుపు స్టంపింగ్ | ABP DesamMS Dhoni Sixers vs RCB IPL 2025 | యధావిథిగా ధోనీ ఆడాడు..CSK ఓడింది | ABP DesamCSK vs RCB Match Highlights IPL 2025 | 17ఏళ్ల తర్వాత చెన్నైలో ఆర్సీబీపై ఓటమి | ABP DesamMyanmar Bangkok Earthquake | మయన్మార్, బ్యాంకాక్ లను కుదిపేసిన భారీ భూకంపం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pastor Praveen case: పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
Chandra Babu Latest News: అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
Hyderabad Metro Latest Timings: మారిన హైదరాబాద్‌ మెట్రో టైమింగ్స్‌- ఏప్రిల్‌ 1 నుంచి అమలు!
మారిన హైదరాబాద్‌ మెట్రో టైమింగ్స్‌- ఏప్రిల్‌ 1 నుంచి అమలు!
Viral Video: రోహిత్, సూర్య‌, తిల‌క్ ల తుంట‌రి ప‌ని.. పాపం టీమ్ అడ్మిన్ పై ప్ర‌తాపం.. సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్
రోహిత్, సూర్య‌, తిల‌క్ ల తుంట‌రి ప‌ని.. పాపం టీమ్ అడ్మిన్ పై ప్ర‌తాపం.. సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్
RS Praveen Kumar: తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Andhra Pradesh Weather: ఏపీలో 22 జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు- ఆదివారం తీవ్ర వడగాల్పులు
ఏపీలో 22 జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు- ఆదివారం తీవ్ర వడగాల్పులు
Viral News : అటు భూ ప్రకంపనలు- ఇటు పురిటినొప్పులు- మహిళకు రోడ్డుపైనే ప్రసవం చేసిన వైద్యులు
అటు భూ ప్రకంపనలు- ఇటు పురిటినొప్పులు- మహిళకు రోడ్డుపైనే ప్రసవం చేసిన వైద్యులు
Embed widget