By: ABP Desam | Updated at : 03 Oct 2023 12:50 PM (IST)
Edited By: Pavan
పురుషుల కనోయ్ డబుల్లో భారత్కు కాంస్యం ( Image Source : ABP Gujarati )
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు దూసుకుపోతున్నారు. తాజాగా మరో పతకం సాధించారు. పురుషుల డబుల్ కనోయ్ 1000 మీటర్ల ఫైనల్ లో భారత క్రీడాకారులు కాంస్య పతకం సాధించారు. అర్జున్ సింగ్, సునీల్ సింగ్ తో కూడిన భారత జట్టు బ్రాంజ్ మెడల్ సాధించింది. భారత జట్టు 3.53.329 సెకన్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇక 3.43.796 సెకన్లతో ఉజ్జెకిస్థాన్ గోల్డ్ సొంతం చేసుకుంది. 3.49.991 సెకన్లతో రెండో ప్లేస్ లో నిలిచిన కజకిస్థాన్ రజతం గెలుచుకుంది. అయితే.. పురుషుల కనోయ్ 1000 మీటర్ల విభాగంలో భారత దేశానికి పతకం రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.
పతకాల పట్టికలో భారత్ 61 మెడల్స్ తో భారత్ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. ఇందులో 13 స్వర్ణాలు, 24 కాంస్యాలు, 24 రజత పతకాలు ఉన్నాయి. 9వ రోజు 3 రజతాలు, 4 కాంస్య పతకాలను భారత ఆటగాళ్లు గెలుపొందారు. ఇదే జోరు సాగిస్తే 100 పతకాలు సాధించడం ఏమంత కష్టం కాదని క్రీడారంగ నిపుణులు అంటున్నారు.
🥉🚣♂️ Medal Alert 🚣♂️🥉
— SAI Media (@Media_SAI) October 3, 2023
Huge cheers for Arjun Singh and Sunil Singh Salam! 🙌🇮🇳.
The duo has clinched a well-deserved Bronze in the Men's Canoe Double 1000m event with a timing of 3.53.329 at the #AsianGames2022! 🚣♂️
🇮🇳 Let's cheer out loud for our champs🥳#Cheer4India… pic.twitter.com/sYMxuCqHLL
ఆసియా క్రీడలు 2023లో చివరి పూల్ మ్యాచ్ లో భారత మహిళల హాకీ జట్టు హాంకాంగ్ ను ఓడించింది. టీమ్ ఇండియా ఇప్పటికే సెమీ ఫైనల్ లోకి ప్రవేశించినప్పటికీ, ఈ విజయం జట్టులో మనోధైర్యాన్ని మరింత పెంచుతుంది. హాంకాంగ్ పై భారత జట్టు 13-0 తో విజయం సాధించింది. అంతేకాకుండా మహిళల ఆర్చరీ సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ కు చెందిన జ్యోతి సురేఖ, అదితి గోపీచంద్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో జ్యోతి 149-146 స్కోరుతో అదితిపై జ్యోతి సురేఖ విజయం సాధించింది. ఈ విజయంతో జ్యోతి ఫైనల్స్ లోకి ప్రవేశించింది. ఇక అదితి కాంస్య పతకం కోసం పోటీ పడనుంది.
ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్టు శుభారంభం చేసింది. భారత జట్టు తన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను 55-18 తో ఓడించింది. కబడ్డీలో భారత్ విజయంతో శుభారంభం చేసింది. భారత పురుషుల కబడ్డీ జట్టు తన తొలి పూల్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను ఘోరంగా ఓడించి 37 పాయింట్లు సాధించింది.
ఈ మ్యాచ్ లో భారత కబడ్డీ జట్టు మొదటి నుంచి బంగ్లాదేశ్ పై ఒత్తిడి పెంచింది. భారత ఆటగాళ్లు దూకుడుగా దాడి చేశారు. నవీన్, అర్జున్ దేస్వాల్ చాలా దూకుడుగా ఆడారు. వీరిద్దరూ ఒకరి తర్వాత ఒకరు బంగ్లాదేశ్ డిఫెన్స్ ను పూర్తిగా బద్దలు కొట్టారు. మరోవైపు డిఫెన్స్ లో కూడా బంగ్లాదేశ్ రైడర్ లను భారత జట్టు తెలివిగా ఎదుర్కొంది.
Narendra Modi Stadium: వరల్డ్కప్ ఫైనల్ పిచ్ యావరేజ్ అట, భారత్లో పిచ్లకు ఐసీసీ రేటింగ్
నాకు ముందుకు సాగడమే తెలుసు , మిచెల్ జాన్సన్ విమర్శలపై వార్నర్
Sreesanth vs Gambhir: ముదురుతున్న గంభీర్- శ్రీశాంత్ వివాదం, శ్రీశాంత్కు లీగల్ నోటీసులు జారీ
T20 World Cup 2024 logo: టీ 20 ప్రపంచకప్ ఏర్పాట్లు షురూ, ఆకట్టుకుంటున్న లోగోలు
sreesanth vs gambhir : శ్రీశాంత్-గంభీర్ మాటల యుద్ధం, షాక్ అయ్యానన్న శ్రీశాంత్ భార్య
KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం
Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే
Extra Ordinary Man Review - ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?
BRS MLA Marri Rajashekar Reddy: బీఆర్ఎస్ నేతలకు బెదిరింపు ఫోన్ కాల్స్, సీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే
/body>