అన్వేషించండి

Pitru Paksham 2024: సెప్టెంబర్ 18న పితృ పక్షం ప్రారంభం .. కర్ణుడు స్వర్గం నుంచి భూమ్మీదకు వచ్చిన ఈ 15 రోజులు ఎందుకంత ప్రత్యేకం!

Pitru Paksha 2024: సెప్టెంబరు 18 నుంచి పితృ పక్షాలు ప్రారంభమై..అక్టోబరు 02 మహాలయ అమావాస్యతో పూర్తవుతాయి. వీటినే మహాలయ పక్షాలు అని కూడా అంటారు. పితృపక్షం ఎందుకంత ముఖ్యం...

 Mahalaya Paksham 2024: భాద్రపద మాసం పౌర్ణమి తర్వాత పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకూ ఉండే 15 రోజులను పితృపక్షం అంటారు.. ఈ ఏడాది సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 02 వరకు పితృ పక్షం.

పితృ పక్షం అంటే ఏంటి.. ఎందుకు ఈ 15 రోజులు అత్యంత ముఖ్యమైనవి...
 
శరీపాన్ని విడిచిన ప్రాణం...‘ఆత్మ’ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన కర్మను అనుసరించి భూమ్మీదకు జీవాత్మగా వస్తుంది. అన్నాన్ని ఆశ్రయించి పురుషుడి దేహంలోకి ప్రవేశించి..శుక్ల కణంగా మారి..తన కర్మ ఫలానుసారం స్త్రీ గర్భంలోకి ప్రవేశించి..ఆ తర్వాత శిశువుగా మారి భూమ్మీదకు తిరిగి వస్తుంది. 

మరణించిన పితృదేవతలకు మోక్షం కలగాలంటే పూర్వ కర్మలన్నీ పూర్తి కావాలి. ఆ కర్మలను పూర్తిగా అనుభవించాలంటే దేహధారణ చేసి మళ్లీ ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నం అందించాలి... అది కేవలం రక్తం పంచుకు పుట్టిన పుత్రులు మాత్రమే ఇవ్వాలి.అప్పుడు పితృరుణం తీరుతుంది.

పితృ రుణం తీర్చుకోవడం పుత్రుల ధర్మం..అప్పుడే పెద్దల ఆత్మకు శాంతి, మోక్షం లభిస్తుంది. ఈ రుణం తీర్చుకునేందుకు సూచించినవే పితృపక్షాలు. ఈ 15 రోజులు అత్యంత ప్రధానమైనవి

Also Read: మలయాళీలకు స్వర్ణయుగం - రాక్షసరాజుకు ఘన స్వాగతం!

బహుళ పక్షం అత్యంత ప్రధానం

భాద్రపదమాసంలో పౌర్ణమి ముందు వచ్చే 15 రోజులు దేవతాపూజకు అత్యంత విశిష్టమైనవి అయితే.. పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజులు పితృదేవతల పూజకు అంత్యంత శ్రేష్ఠమైమది. పితృదేవతల రుణం తీరర్చుకునే ఈ 15 రోజులను పితృపక్షం అంటారు. ఈ రెండు వారాలు తర్పణ, శ్రాద్ధ విధులు నిర్వర్తించాలి. 

నిత్యం కుదరదు అనుకున్న వారు..తమ పెద్దలు ఏ తిథిలో మృతి చెందారో ఆ తిథి రోజు విధులు నిర్వర్తించాలి..లేదంటే చివరి రోజైనా మహాలయ అమావాస్య రోజు అయినా తర్పణాలు విడిస్తే ఆ కుటుంబానికి మంచి జరుగుతుంది..
 
పితృ పక్షాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయో వివరిస్తూ ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది. దాన కర్ణుడు మరణానంతరం స్వర్గానికి వెళుతుండగా దారి మధ్యలో ఆకలి, దాహం వేసింది. ఓ పండ్ల చెట్టును చూసి అక్కడకు వెళ్లి తెంపుకునేందుకు ప్రయత్నిస్తే అది బంగారంలా మారిపోయింది. ఆ తర్వాత నీళ్లు తాగుదామనుకున్నా అదే జరిగింది. అర్థంకాని కర్ణుడు..ఎందుకిలా జరుగుతోందని ఆలోచించాడు. అప్పుడు అశరీరవాణి నుంచి కొన్ని మాటలు వినిపించాయి

" కర్ణా ! దానశీలిగా పేరొందావు..చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం , వెండి , డబ్బు రూపంలో ఇచ్చావు కానీ ఒక్కరి ఆకలి కూడా తీర్చలేదు అందుకే ఇప్పుడు నీకీ దుస్థితి" అని పలికింది అశరీరవాణి...

ఆ మాటలు విన్న తర్వాత కర్ణుడు నేరుగా సూర్యుడి దగ్గరకు వెళ్లి..తండ్రి గారూ నేను ఇప్పుడు ఏం చేయాలని అడిగాడు. అప్పుడు సూర్యుడు సూచించిన 15 రోజులే పితృపక్షం. 

వెంటనే భూలోకానికి వెళ్లి అక్కడున్న అన్నార్తులందరికీ అన్న పెట్టి..తల్లిదండ్రులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మని చెప్పాడు సూర్యుడు. తండ్రి సూర్యభగవానుడి సూచనల మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి రోజు భూలోకంలోకి వచ్చి..15 రోజుల పాటు అన్న సంతర్పణలు నిర్వహించి , పితృదేవతలకు తర్పణాలు విడిచి స్వర్గలోకానికి పయనమయ్యాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు నిర్వహించాడో అప్పుడే తనకి ఆకలి, దప్పికలు తీరిపోయాయి. 

Also Read: మూడు అడుగులతో ముల్లోకాలను చుట్టేసిన త్రివిక్రముడి జయంతి!

కర్ణుడు భూలోకంలో అన్న సంతర్పణలు నిర్వహించి, పితృ తర్పణాలు విడిచిన 15 రోజులనే మహాలయ పక్షాలు అని పిలుస్తారు. చివరి రోజైన అమావాస్య ను మహాలయ అమావాస్య అంటారు..
 
కేవలం తల్లిదండ్రులకు మాత్రమే కాదు..మృతి చెందిన రక్త సంబంధీకులు అందర్నీ తలుచుకుని తర్పణాలు విడుస్తారు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Bondi Beach Shooting: తండ్రి చనిపోయినా రాలేదు.. తెలంగాణతో సంబంధం లేదు-  ఆస్ట్రేలియా కాల్పుల నిందితుడు సాజిద్ అక్రమ్‌పై తెలంగాణ పోలీసుల అప్డేట్‌
తండ్రి చనిపోయినా రాలేదు.. తెలంగాణతో సంబంధం లేదు-  ఆస్ట్రేలియా కాల్పుల నిందితుడు సాజిద్ అక్రమ్‌పై తెలంగాణ పోలీసుల అప్డేట్‌
Gujarat News: ప్రేమించుకున్నాం పారిపోయి పెళ్లి చేసుకుంటామంటే కుదరదు! వివాహ చట్టంలో సంచలన మార్పులు చేస్తున్న గుజరాత్‌ ప్రభుత్వం
ప్రేమించుకున్నాం పారిపోయి పెళ్లి చేసుకుంటామంటే కుదరదు! వివాహ చట్టంలో సంచలన మార్పులు!
Karimnagar Cricketer Aman Rao : రాజస్థాన్ రాయల్స్‌లో చోటు దక్కించుకున్న కరీంనగర్‌ కుర్రాడు! 30 లక్షలకు కొనుగోలు 
రాజస్థాన్ రాయల్స్‌లో చోటు దక్కించుకున్న కరీంనగర్‌ కుర్రాడు! 30 లక్షలకు కొనుగోలు 

వీడియోలు

అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?
Prashant Veer Kartik Sharma CSK IPL 2026 Auction | ఎవరీ ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Bondi Beach Shooting: తండ్రి చనిపోయినా రాలేదు.. తెలంగాణతో సంబంధం లేదు-  ఆస్ట్రేలియా కాల్పుల నిందితుడు సాజిద్ అక్రమ్‌పై తెలంగాణ పోలీసుల అప్డేట్‌
తండ్రి చనిపోయినా రాలేదు.. తెలంగాణతో సంబంధం లేదు-  ఆస్ట్రేలియా కాల్పుల నిందితుడు సాజిద్ అక్రమ్‌పై తెలంగాణ పోలీసుల అప్డేట్‌
Gujarat News: ప్రేమించుకున్నాం పారిపోయి పెళ్లి చేసుకుంటామంటే కుదరదు! వివాహ చట్టంలో సంచలన మార్పులు చేస్తున్న గుజరాత్‌ ప్రభుత్వం
ప్రేమించుకున్నాం పారిపోయి పెళ్లి చేసుకుంటామంటే కుదరదు! వివాహ చట్టంలో సంచలన మార్పులు!
Karimnagar Cricketer Aman Rao : రాజస్థాన్ రాయల్స్‌లో చోటు దక్కించుకున్న కరీంనగర్‌ కుర్రాడు! 30 లక్షలకు కొనుగోలు 
రాజస్థాన్ రాయల్స్‌లో చోటు దక్కించుకున్న కరీంనగర్‌ కుర్రాడు! 30 లక్షలకు కొనుగోలు 
Director Kiran Kumar Death: తెలుగు చిత్రసీమలో విషాదం... నాగార్జున 'కేడీ' దర్శకుడు మృతి
తెలుగు చిత్రసీమలో విషాదం... నాగార్జున 'కేడీ' దర్శకుడు మృతి
Telangana Latest News: పోలవరం-బనకచర్ల, నల్లమలసాగర్‌పై సుప్రీంకోర్టుకు తెలంగాణ- ఏపీతోపాటు కేంద్ర సంస్థలను ఆపాలని రిక్వస్ట్‌ 
పోలవరం-బనకచర్ల, నల్లమలసాగర్‌పై సుప్రీంకోర్టుకు తెలంగాణ- ఏపీతోపాటు కేంద్ర సంస్థలను ఆపాలని రిక్వస్ట్‌ 
Nagarjuna: ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన
ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన
Rishikonda Palace: పర్యాటకశాఖ చేతుల్లోకే రిషి కొండ ప్యాలెస్- ప్రజలకు ఉపయోగపడేలా, ఆదాయం తెచ్చేలా కీలక నిర్ణయం!
పర్యాటకశాఖ చేతుల్లోకే రిషి కొండ ప్యాలెస్- ప్రజలకు ఉపయోగపడేలా, ఆదాయం తెచ్చేలా కీలక నిర్ణయం!
Embed widget