అన్వేషించండి

Visiting Temple: రోజూ గుడికి వెళితే మీ జీవితంలో వచ్చే మార్పులు ఇవే - మీరు అస్సలు ఊహించలేరు

Benefits Of Visiting Temples: కొందరు ప్రతిరోజూ దేవాల‌యానికి వెళుతుంటారు. మరికొందరు ప‌ర్వ‌దినాల్లో మాత్రమే ఆలయాన్ని సందర్శిస్తారు. రోజూ ఆలయాన్ని ఎందుకు సందర్శించాలి? ఆలయ దర్శనంతో కలిగే ప్రయోజనాలు ఇవే.

Benefits Of Visiting Temples: సనాతన ధర్మంలో దేవాల‌యానికి వెళ్లడానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. రోజువారీ ఆలయ సందర్శనల చాలా మంది వ్యక్తుల దినచర్యలో భాగంగా ఉంటుంది. గుడికి వెళ్లడం వల్ల భగవంతుని అనుగ్రహం కలగడమే కాకుండా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. శాస్త్రం ప్రకారం, ప్రతిరోజూ ఆలయాన్ని సందర్శించడం వల్ల ఆరోగ్యం, శ్రేయస్సు లభిస్తుంది. రోజూ ఉదయాన్నే గుడికి వెళితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. హిందూ విశ్వాసం ప్రకారం, బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసిన తర్వాత ఆలయాన్ని సందర్శించడం ద్వారా బ్రహ్మ జ్ఞానం లభిస్తుంది. దీని కారణంగా, వ్యక్తి  మానసిక అభివృద్ధితో ఏకాగ్రత పెరుగుతుంది. నిత్యం ఆలయానికి వెళితే ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని చాలా మంది విశ్వాసం. రోజూ ఉదయాన్నే ఆలయ దర్శనం చేస్తే లాభమేంటి..?

క్రమశిక్షణ, సంయమనం
రోజువారీ ఆలయ సందర్శన మనకు క్రమశిక్షణ, స్వీయ నిగ్రహాన్ని నేర్పుతుంది. మీరు ఆలయాన్ని సందర్శించడానికి ఒక నిర్దిష్ట స‌మ‌యం లేదా రోజును కేటాయించినప్పుడు అది మీ జీవితంలో క్రమశిక్షణ పాఠంగా మారుతుంది. దేవాలయానికి వెళ్ళేటప్పుడు పేదలకు, అభాగ్యుల‌కు అన్నదానం చేయడంతో పాటు ఆల‌యంలో భ‌గ‌వంతుని విగ్రహం ముందు నమస్కరించడం, వ్యక్తిలోని అహంకారాన్ని నాశనం చేస్తుంది.

వాగ్దానాన్ని నెరవేర్చడం
నావికుడు లేని పడవ లాంటిది మన జీవితం. మనమే భగవంతునిపై మన జీవిత భారం వేసి నావికుడిగా మారాలి తప్ప ఇందులో మరెవరూ నావికులు కాలేరు. దేవుడు మనతో ఉన్నాడని, ఆయన మన పట్ల శ్రద్ధ వహిస్తాడని విశ్వసించడం, మన వంతు కృషి చేయడానికి, ముందుకు సాగడానికి మనకు ఆశతో పాటు ధైర్యాన్ని ఇస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం, ఒక భక్తుడు తన కర్మ ఫలాన్ని అనుభవించడానికి తన కర్మ ఫలంపై దృష్టి పెట్టాలి. కర్మ ఫలాలను భగవంతునికే వదిలేయాలి.

మంచి పనులు చేయడానికి ప్రేరణ
దేవాలయానికి వెళ్లడం అనేది దేవుడు మిమ్మల్ని చూస్తాడు మీ మాట వింటాడు అనే విశ్వాసానికి ఆధారమ‌ని మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. మనసులో ఈ అనుభూతిని పొందే వ్యక్తి భగవంతుని పట్ల భయాన్ని కూడా పొందుతాడు. మీరు మంచి పనులు చేయడానికి ప్రేరణ పొందుతారు, ప్రతి ప‌నిని ధర్మ మార్గంలో చేస్తారు. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు కాబట్టి మీరు తప్పులు చేయడానికి వెనుకంజ వేస్తారు.

దేవుడు- మనిషి మధ్య పరస్పర చర్యకు కారణం
దేవుని గదిలో లేదా గుడిలో ఉన్న దేవుని విగ్రహం మనిషికి భగవంతునితో సంభాషించడానికి మంచి మాధ్యమం అవుతుంది. మనిషి మనస్సులో భగవంతుని పట్ల ఉన్న భక్తిని విగ్రహం ముందు చూపుతారు. ఇలా చేయడం వల్ల చాలా మందిలో సానుకూల దృక్ప‌థం పెరుగుతుంది. విగ్రహం ద్వారా భక్తులు భగవంతుని అనుగ్రహాన్ని, దైవిక శక్తి ప్రకంపనలను పొందుతారు.

మనశ్శాంతి
మనం గుడికి వెళ్లినప్పుడు, నేలపై కూర్చొని, మౌనంగా ధ్యానం చేయడం, గ్రంధాలను చదవడం, భగవంతుడిని పూజించే ఆచారాలలో నిమగ్నమై ఉండటం చాలా మంది వ్యక్తులపై వినయపూర్వకమైన, ప్రశాంతమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఒక వ్యక్తిలో శాంతి భావనను సృష్టిస్తుంది.

Also Read : దేవాలయాల్లో ఈ దానం చేస్తే పదితరాలకు మంచి జరుగుతుంది!

సానుకూలత
దేవాలయం అంటే చాలా మంది వచ్చి తమ కుటుంబాల కోసం తమ శ్రేయస్సు కోసం ప్రార్థించే ప్రదేశం. ఏ వ్యక్తి అయినా దేవుని ముందు నిలబడి తన బాధలు చెప్పుకొని ప్రార్థనను ప్రారంభిస్తాడు. కొంత సమయం తరువాత, వ్యక్తి ఆలయంలో సానుకూల ప్రకంపనలను అనుభవిస్తాడు. దీని ద్వారా వ్యక్తి తన బాధలన్నింటినీ మెల్లమెల్లగా మరచిపోతాడు. ఇది వారిలో పాజిటివ్ వైబ్రేషన్‌లను పెంచుతుంది.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sushil Modi Passes Away: బిహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ కన్నుమూత, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
బిహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ కన్నుమూత, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
IPL GT vs KKR: వర్షం కారణంగా గుజరాత్, కోల్ కత్తా మ్యాచ్ రద్దు- ప్లే ఆఫ్ రేస్ నుంచి GT ఔట్
వర్షం కారణంగా గుజరాత్, కోల్ కత్తా మ్యాచ్ రద్దు- ప్లే ఆఫ్ రేస్ నుంచి GT ఔట్
Madhavi Latha: రాక్షస రాజ్యానికి అంతం లేదా? తలుపులు మూసివేసి రిగ్గింగ్: మాధవీ లత ఆరోపణలు
రాక్షస రాజ్యానికి అంతం లేదా? తలుపులు మూసివేసి రిగ్గింగ్: మాధవీ లత ఆరోపణలు
High Tension in Jammalamadugu: కడప జిల్లాలో కొనసాగుతున్న హైటెన్షన్- రాళ్ల దాడిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలకు గాయం
కడప జిల్లాలో కొనసాగుతున్న హైటెన్షన్- రాళ్ల దాడిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలకు గాయం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YSRCP Jammalamadugu MLA Sudheer Babu Attacked | జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై దాడి | ABP DesamYSRCP TDP Members Fight With Bombs | బాంబులు విసురుకున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు | ABP DesamMadhavi Latha vs Asaduddin Owaisi |Elections 2024| ఎదురుపడిన ఒవైసీ-మాధవి లత.. ఆ తరువాత ఏం జరిగింది.?Madhavi Latha | Old city Elections 2024 | పాతబస్తీలో హై టెన్షన్ వాతావరణంలో పోలింగ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sushil Modi Passes Away: బిహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ కన్నుమూత, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
బిహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ కన్నుమూత, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
IPL GT vs KKR: వర్షం కారణంగా గుజరాత్, కోల్ కత్తా మ్యాచ్ రద్దు- ప్లే ఆఫ్ రేస్ నుంచి GT ఔట్
వర్షం కారణంగా గుజరాత్, కోల్ కత్తా మ్యాచ్ రద్దు- ప్లే ఆఫ్ రేస్ నుంచి GT ఔట్
Madhavi Latha: రాక్షస రాజ్యానికి అంతం లేదా? తలుపులు మూసివేసి రిగ్గింగ్: మాధవీ లత ఆరోపణలు
రాక్షస రాజ్యానికి అంతం లేదా? తలుపులు మూసివేసి రిగ్గింగ్: మాధవీ లత ఆరోపణలు
High Tension in Jammalamadugu: కడప జిల్లాలో కొనసాగుతున్న హైటెన్షన్- రాళ్ల దాడిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలకు గాయం
కడప జిల్లాలో కొనసాగుతున్న హైటెన్షన్- రాళ్ల దాడిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలకు గాయం
Vijayawada Hyderabad Highway: ఏపీ ఓటర్లు తిరుగు ప్రయాణం, విజయవాడ - హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ జామ్
Vijayawada Hyderabad Highway: ఏపీ ఓటర్లు తిరుగు ప్రయాణం, విజయవాడ - హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ జామ్
Nara Lokesh Comments: ఏపీ ప్రజల తెగువకు పాదాభివందనం: నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్
ఏపీ ప్రజల తెగువకు పాదాభివందనం: నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్
Telangana CEO Vikas Raj: నేడు తెలంగాణలో 38 కేసులు నమోదు, భారీ బందోబస్తుతో స్ట్రాంగ్ రూమ్స్‌కు ఈవీఎంలు: వికాస్ రాజ్
నేడు తెలంగాణలో 38 కేసులు నమోదు, భారీ బందోబస్తుతో స్ట్రాంగ్ రూమ్స్‌కు ఈవీఎంలు: వికాస్ రాజ్
AP Election 2024 Polling Percentage: ఏపీలో ముగిసిన పోలింగ్, ఉద్రిక్త ఘటనలు 120కి పైనే! ఓటింగ్ శాతం ఎంతంటే
ఏపీలో ముగిసిన పోలింగ్, ఉద్రిక్త ఘటనలు 120కి పైనే! ఓటింగ్ శాతం ఎంతంటే
Embed widget