Visiting Temple: రోజూ గుడికి వెళితే మీ జీవితంలో వచ్చే మార్పులు ఇవే - మీరు అస్సలు ఊహించలేరు
Benefits Of Visiting Temples: కొందరు ప్రతిరోజూ దేవాలయానికి వెళుతుంటారు. మరికొందరు పర్వదినాల్లో మాత్రమే ఆలయాన్ని సందర్శిస్తారు. రోజూ ఆలయాన్ని ఎందుకు సందర్శించాలి? ఆలయ దర్శనంతో కలిగే ప్రయోజనాలు ఇవే.
Benefits Of Visiting Temples: సనాతన ధర్మంలో దేవాలయానికి వెళ్లడానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. రోజువారీ ఆలయ సందర్శనల చాలా మంది వ్యక్తుల దినచర్యలో భాగంగా ఉంటుంది. గుడికి వెళ్లడం వల్ల భగవంతుని అనుగ్రహం కలగడమే కాకుండా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. శాస్త్రం ప్రకారం, ప్రతిరోజూ ఆలయాన్ని సందర్శించడం వల్ల ఆరోగ్యం, శ్రేయస్సు లభిస్తుంది. రోజూ ఉదయాన్నే గుడికి వెళితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. హిందూ విశ్వాసం ప్రకారం, బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసిన తర్వాత ఆలయాన్ని సందర్శించడం ద్వారా బ్రహ్మ జ్ఞానం లభిస్తుంది. దీని కారణంగా, వ్యక్తి మానసిక అభివృద్ధితో ఏకాగ్రత పెరుగుతుంది. నిత్యం ఆలయానికి వెళితే ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని చాలా మంది విశ్వాసం. రోజూ ఉదయాన్నే ఆలయ దర్శనం చేస్తే లాభమేంటి..?
క్రమశిక్షణ, సంయమనం
రోజువారీ ఆలయ సందర్శన మనకు క్రమశిక్షణ, స్వీయ నిగ్రహాన్ని నేర్పుతుంది. మీరు ఆలయాన్ని సందర్శించడానికి ఒక నిర్దిష్ట సమయం లేదా రోజును కేటాయించినప్పుడు అది మీ జీవితంలో క్రమశిక్షణ పాఠంగా మారుతుంది. దేవాలయానికి వెళ్ళేటప్పుడు పేదలకు, అభాగ్యులకు అన్నదానం చేయడంతో పాటు ఆలయంలో భగవంతుని విగ్రహం ముందు నమస్కరించడం, వ్యక్తిలోని అహంకారాన్ని నాశనం చేస్తుంది.
వాగ్దానాన్ని నెరవేర్చడం
నావికుడు లేని పడవ లాంటిది మన జీవితం. మనమే భగవంతునిపై మన జీవిత భారం వేసి నావికుడిగా మారాలి తప్ప ఇందులో మరెవరూ నావికులు కాలేరు. దేవుడు మనతో ఉన్నాడని, ఆయన మన పట్ల శ్రద్ధ వహిస్తాడని విశ్వసించడం, మన వంతు కృషి చేయడానికి, ముందుకు సాగడానికి మనకు ఆశతో పాటు ధైర్యాన్ని ఇస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం, ఒక భక్తుడు తన కర్మ ఫలాన్ని అనుభవించడానికి తన కర్మ ఫలంపై దృష్టి పెట్టాలి. కర్మ ఫలాలను భగవంతునికే వదిలేయాలి.
మంచి పనులు చేయడానికి ప్రేరణ
దేవాలయానికి వెళ్లడం అనేది దేవుడు మిమ్మల్ని చూస్తాడు మీ మాట వింటాడు అనే విశ్వాసానికి ఆధారమని మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. మనసులో ఈ అనుభూతిని పొందే వ్యక్తి భగవంతుని పట్ల భయాన్ని కూడా పొందుతాడు. మీరు మంచి పనులు చేయడానికి ప్రేరణ పొందుతారు, ప్రతి పనిని ధర్మ మార్గంలో చేస్తారు. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు కాబట్టి మీరు తప్పులు చేయడానికి వెనుకంజ వేస్తారు.
దేవుడు- మనిషి మధ్య పరస్పర చర్యకు కారణం
దేవుని గదిలో లేదా గుడిలో ఉన్న దేవుని విగ్రహం మనిషికి భగవంతునితో సంభాషించడానికి మంచి మాధ్యమం అవుతుంది. మనిషి మనస్సులో భగవంతుని పట్ల ఉన్న భక్తిని విగ్రహం ముందు చూపుతారు. ఇలా చేయడం వల్ల చాలా మందిలో సానుకూల దృక్పథం పెరుగుతుంది. విగ్రహం ద్వారా భక్తులు భగవంతుని అనుగ్రహాన్ని, దైవిక శక్తి ప్రకంపనలను పొందుతారు.
మనశ్శాంతి
మనం గుడికి వెళ్లినప్పుడు, నేలపై కూర్చొని, మౌనంగా ధ్యానం చేయడం, గ్రంధాలను చదవడం, భగవంతుడిని పూజించే ఆచారాలలో నిమగ్నమై ఉండటం చాలా మంది వ్యక్తులపై వినయపూర్వకమైన, ప్రశాంతమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఒక వ్యక్తిలో శాంతి భావనను సృష్టిస్తుంది.
Also Read : దేవాలయాల్లో ఈ దానం చేస్తే పదితరాలకు మంచి జరుగుతుంది!
సానుకూలత
దేవాలయం అంటే చాలా మంది వచ్చి తమ కుటుంబాల కోసం తమ శ్రేయస్సు కోసం ప్రార్థించే ప్రదేశం. ఏ వ్యక్తి అయినా దేవుని ముందు నిలబడి తన బాధలు చెప్పుకొని ప్రార్థనను ప్రారంభిస్తాడు. కొంత సమయం తరువాత, వ్యక్తి ఆలయంలో సానుకూల ప్రకంపనలను అనుభవిస్తాడు. దీని ద్వారా వ్యక్తి తన బాధలన్నింటినీ మెల్లమెల్లగా మరచిపోతాడు. ఇది వారిలో పాజిటివ్ వైబ్రేషన్లను పెంచుతుంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets