అన్వేషించండి

Amarnath Yatra 2024: జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర - రిజిస్ట్రేషన్లు ప్రారంభం, ఎలా రిజిస్టర్ అవ్వాలంటే?

Amarnath Yatra 2024: ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూన్ 29 నుంచి ప్రారంభం కానుండగా.. యాత్రకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. యాత్రికులు ఆన్ లైన్, ఆఫ్ లైన్ లోనూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

Amarnath Yatra Registration Started: పవిత్ర అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) ఈ ఏడాది జూన్ 29 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ బోర్డు ఆదివారం ప్రకటించింది. దాదాపు 52 రోజుల పాటు సాగనున్న ఈ యాత్ర ఆగస్ట్ 19తో ముగుస్తుంది. యాత్రకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం (ఏప్రిల్ 15) ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. యాత్రికులు వెబ్ సైట్ తో పాటు మొబైల్ యాప్, వాట్పాస్ నెంబర్, టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఆలయ బోర్డు వివరించింది. దక్షిణ కాశ్మీర్ లోని హిమాలయ పర్వత ప్రాంతంలో 3,800 మీటర్ల ఎత్తులో ఉండే ఈ పుణ్యక్షేత్రాన్ని ఏటా భారీ సంఖ్యలో భక్తులు సందర్శిస్తారు. యాత్రికులు www.jaksasb.nic.in సైట్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చెయ్యొచ్చు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లోనూ రిజిస్ట్రేషన్ చెయ్యొచ్చు. అనంత్ నాగ్ జిల్లా పహల్లామ్, గండర్ బాల్ జిల్లా బల్టాల్ మార్గాల్లో అమర్నాథ్ యాత్ర సాగుతుంది. 13 నుంచి 70 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వారే ఈ యాత్రకు అనుమతిస్తారు. ఈ ఏడాది కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అమర్నాథ్ దేవస్థానం బోర్డు అంచనా వేస్తోంది. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది.

భారీ భద్రత

జాతీయ విపత్తు నిర్వహణ దళం (NDRF), రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం (SDRF) సభ్యులు.. అమర్నాథ్ యాత్ర 2024 భద్రతను పర్యవేక్షిస్తారు. ఇందుకోసం వీరు ప్రత్యేక శిక్షణ పొందుతారు. అమర్నాథ్ ఆలయానికి వెళ్లే మార్గాల్లో దళాలు భారీగా మోహరిస్తాయి. భక్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భద్రతా బృందాలు చర్యలు చేపడతాయని యాత్ర నిర్వాహకులు తెలిపారు.

ఆ ఆలయాల సందర్శనకు రిజిస్ట్రేషన్

అలాగే, కేదార్ నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి సందర్శించే భక్తులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఈసారి చార్ ధామ్ యాత ప్రారంభానికి 25 రోజుల ముందు నుంచే యాత్రికులకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు. యాత్రికులకు ప్రయాణ ప్రణాళికలు సులభతరం చేసేలా ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చారు. రిజిస్ట్రేషన్ కోసం యాత్రికులు తమ వివరాలతో పాటు మొబైల్ నెంబర్, చిరునామా జత చేయాలి. పర్యాటక శాఖ వెబ్ సైట్ registrationandtouristcare.uk.gov.in కు లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే, వాట్సాప్ నెంబర్ 8394833833 నెంబర్ కు యాత్ర అని రాసి సందేశం పంపించడం ద్వారా కూడా పేరు నమోదు చేసుకోవచ్చు. వెబ్ సైట్ లో పేర్ల నమోదుకు అవకాశం లేని ప్రయాణికులు పర్యాటక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 01351364 కు కాల్ చేసి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. కాగా, గతేడాది 74 లక్షల మంది చార్ ధామ్ యాత్రకు తమ పేర్లు నమోదు చేసుకోగా..  56 లక్షల మంది సందర్శించారు. ఈసారి కూడా భక్తుల సంఖ్య అధికంగా ఉండొచ్చని పర్యాటక శాఖ అంచనా వేస్తోంది. మే 10 నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభం కానుందని తెలిపింది.

Also Read: Iran Israel War: ఇజ్రాయేల్ ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్, ఇండియాలో పెట్రోల్ ధరల బాదుడు!

టాప్ హెడ్ లైన్స్

ఇంటి పూజా మందిరంలో ఎన్ని అగరబత్తులు వెలిగించాలి? సరైన నియమాలేంటి?
ఇంటి పూజా మందిరంలో ఎన్ని అగరబత్తులు వెలిగించాలి? సరైన నియమాలేంటి?
కుజ సంచారం 2026: మిథునంలోకి అంగారకుడు.. మీ రాశికి శుభమా, అశుభమా?
కుజ సంచారం 2026: మిథునంలోకి అంగారకుడు.. మీ రాశికి శుభమా, అశుభమా?
24-07-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
24-07-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
గోరింట పుట్టుక వెనుకున్నపురాణకథ! ఆషాఢంలోనే దీనికెందుకంత ప్రత్యేకత!
గోరింట పుట్టుక వెనుకున్నపురాణకథ! ఆషాఢంలోనే దీనికెందుకంత ప్రత్యేకత!

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Embed widget