అన్వేషించండి

YSRCP MLCs : టిడిపిలో చేరేందుకు వైసిపి ఎమ్మెల్సీల మొగ్గు.. మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు 

Telugu Desam: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు తమకు తెలిసిన నేతల ద్వారా ప్రయత్నాలను సాగిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

Andhra Pradesh: రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో పూర్తిస్థాయి మెజారిటీతో కొనసాగుతోంది. శాసనసభలో ఏ బిల్లు అయినా సులభంగా పాస్ చేసుకునే బలం కూటమికి ఉంది. గత ఐదేళ్లు అధికారాన్ని అనుభవించిన వైసీపీ దారుణ పరాభవంతో 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అయితే, వైసీపీకి శాసనమండలిలో మాత్రం బలం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా కీలక బిల్లులను పాస్ చేయించుకోవాలంటే శాసన మండలిలో కూడా ఆమోదం తప్పనిసరి. ప్రస్తుత పరిస్థితుల్లో శాసనమండలిలో వైసీపీకి బలం ఉండడంతో అధికార కూటమి ప్రభుత్వానికి కొంత ఇబ్బంది తప్పదు అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కూటమి నేతలు శాసనమండలలోనూ బలం పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న పలువురు ఎమ్మెల్సీలపై టిడిపి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గడిచిన ఐదేళ్లు అధికారం ఉన్నప్పటికీ తమను కనీసం పట్టించుకోలేదన్న భావన చాలా మంది ఎమ్మెల్సీలలో ఉంది. అటువంటి వారంతా ఇప్పుడు అధికార తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అటువంటి వారిపైన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి చేర్చుకునేందుకు ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. 

మంత్రుల ద్వారా రాయబారం నెరపుతున్న ఎమ్మెల్సీలు.. 

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీలుగా ఉన్నప్పటికీ కనీసం గౌరవం, గుర్తింపు దక్కకపోవడం పట్ల అవమాన భారంతో ఉన్న పలువురు ఎమ్మెల్సీలు ప్రస్తుత అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సంసిద్ధులవుతున్నారు. ఈ క్రమంలోనే తమకు సన్నిహితంగా ఉండే మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా టిడిపిలో చేరేందుకు రాయబారాలను పంపుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులను కలిసి తమ ఆలోచనలను వారికి తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు, మంత్రులను కలిసి మాట్లాడినట్లు చెబుతున్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం బుధవారం రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అధికారంలో ఉన్న ఐదేళ్లు తమకు ప్రాధాన్యం ఇవ్వలేదని, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ఉద్ధరించామన్నట్టుగా చూశారని ఓ ఎమ్మెల్సీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. అధికారంలో ఉన్నంతకాలం జగన్ తమతో ఒక్కసారి కూడా ప్రత్యేకంగా కూర్చుని మాట్లాడిన దాఖలాలు లేవని అసంతృప్త ఎమ్మెల్సీలు ప్రస్తావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత మాత్రమే జగన్ తమతో ప్రత్యేకంగా మాట్లాడినట్లు పలువురు పేర్కొంటున్నారు. ఇప్పుడు కూడా తమ అవసరం వచ్చింది కాబట్టి పిలిచారని, అది కూడా తమ గురించి కాకుండా మండలిలో తన కోసం నిలబడాలని చెప్పినట్లు పలువురు ఎమ్మెల్సీలు వ్యాఖ్యానిస్తున్నారు. 

అదే బాటలో మరింత మంది ఎమ్మెల్సీలు 

ప్రస్తుతం ఐదుగురు ఎమ్మెల్సీలు తమకు తెలిసిన మంత్రుల ద్వారా టిడిపిలో చేరేందుకు రాయబారాలు నెరపుతున్నారు. ఇదే ఆలోచనలో మరింత మంది ఎమ్మెల్సీలు ఉన్నట్లు చెబుతున్నారు. కొంతమంది టిడిపి మంత్రుల ద్వారా పార్టీలో చేరేందుకు అవకాశం కల్పించాలంటూ కోరుతున్నారు. మరి కొంతమంది వచ్చి కలుస్తామంటూ మంత్రులకు వర్తమానాన్ని పంపిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ మద్దతుతో గెలిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీల్లో కూడా ఇద్దరూ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో టచ్ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. అయితే, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకునే విషయంలో తెలుగుదేశం పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. గడిచిన ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించిన, ఇబ్బందులకు గురి చేసిన వారి విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ కఠినంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అటువంటి నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు చంద్రబాబు కూడా ఆసక్తి చూపించడం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా వైసీపీలో ఎమ్మెల్సీలుగా ఎన్నికై ఎన్నికల సమయంలో ఆయా స్థానాలకు రాజీనామా చేసి పలువురు టిడిపిలో చేరారు. వీటిలో రెండు స్థానాలకు కొద్ది రోజుల కిందట అధికారులు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే, వైసీపీ నుంచి అభ్యర్థులెవరు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో టిడిపి నుంచి సి రామచంద్రయ్య, జనసేన నుంచి హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget