అన్వేషించండి

AP PM Kisan Funds : ఏపీలో రైతుల్ని తగ్గించేస్తున్న కేంద్రం -ఇక వాళ్లందరికీ పీఎం కిసాన్ డబ్బులు రానట్లే !

పీఎం కిసాన్ సాయం పొందుతున్న రైతుల సంఖ్యను ఏపీలో భారీగా తగ్గించేస్తున్నారు. కొత్త నిబంధనలతో లక్షల్లో లబ్దిదారులు తగ్గిపోతున్నారు. దీని వల్ల రైతు భరోసాపైనా ప్రభావం పడుతోంది.

AP PM Kisan Funds :  రైతులకు పెట్టుబడి సాయం చేసేందుకు కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం లబ్దిదారులు ఎప్పటికప్పుడు తగ్గిపోతూ వస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో సాయం అందుకునే రైతుల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతూ వస్తోంది. ఈ పథకం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసాకు లింక్ పథకం కావడంతో...  రైతుల్లో గందరగోళం ఏర్పడుతోంది. ప్రభుత్వం చెబుతున్న రూ. 13500 మొత్తం అందుకుంటున్న వారు రాను రాను తగ్గిపోతున్నారు. 

పీఎం కిసాన్ పేరుతో కేంద్రం రూ. ఆరు వేలు - రైతు భరోసా  పేరుతో రాష్ట్రం రూ. ఏడున్నర వేలు!

పీఎం కిసాన్ పేరుతో రైతులకు ఏటా మూడు సార్లు ఒక్కో సారి రూ.రెండు వేల చొప్పున   రూ.ఆరు వేలు రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే ఈ పథకం లబ్దిదారులు ఎప్పటికప్పుడు తగ్గిపోతున్నారు. కేంద్రం ప్రభుత్వం విధిస్తున్న కొత్త కొత్త నిబంధనల వలన అన్నదాతలు చిన్నపాటి సర్కారీ సాయానికీ దూరమవుతున్నారు. సంవత్సరంలో నాలుగు మాసాలను ఒక పిరియడ్‌గా పేర్కొని ఒక్కో పిరియడ్‌కు రూ.రెండు వేల వంతున నగదు బదిలీ చేస్తున్నారు. ఏప్రిల్‌-జులై, ఆగస్టు-నవంబర్‌, డిసెంబర్‌-మార్చి ల్లో ఇస్తున్నారు.   

ఏపీలో అంతకంతకూ తగ్గిపోతున్న లబ్దిదారులు !

2021-22 చివరన డిసెంబర్‌-మార్చి కాలానికి ఆంధ్రప్రదేశ్‌లో 47,64,482 మందికి రూ.రెండు వేల చొప్పున ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం 2022-23 తొలి కిస్తు ఏప్రిల్‌-జులై కి 46,62,768 మందికి  మాత్రమే లబ్దిదారులయ్యారు. అంటే లక్ష మందికిపైగా రైతులు పథకానికి దూరమయ్యారు. రెండు నెలల కిందట జమ చేసిన రెండో విడత నగదు కేవలం 42 లక్షల మందికే వచ్చింది.అంటే మరో  మరో  4 లక్షల  60 వేల మంది  లబ్ధి దారులు తగ్గిపోయారు. ఈ సారి ఈ కేవైసీ నిబంధన  పెట్టడంతో ఇంకా తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఏపీలో మొత్తం అర్హులైన రైతులు 60 లక్షల మంది పైనే ! 

ఆంధ్రప్రదేశ్‌లో పీఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతులు  60 లక్షల మందికిపైనే ఉన్నారు.  దాదాపు 10-15 లక్షల మందికి అందట్లేదు.  కేవలం స్వంత భూమి కలిగిన రైతులకే సాయం చేస్తున్నారు.  రోజుకో షరతు పెట్టడంతోపాటు సాంకేతిక సమస్యల కారణంగా లక్షల మంది రైతులు లబ్ధి పొందలేకపోతున్నారని బ్యాంకర్లు చెబుతున్నారు. 
 
 రైతు భరోసా లబ్దిదారులకు చిక్కులు !

'వైఎస్‌ఆర్‌ రైతు భరోసా' పేరిట ప్రభుత్వం రూ. పదమూడున్నరవేలు ఇస్తున్నట్లుగా కేంద్రం నిధఉలతో కలిసి ప్రచారం చేసుకుంటోంది.   కేంద్రం రూ.6 వేలు, రాష్ట్రం రూ.7,500 కలిపి మొత్తం రూ.13,500 . కేంద్ర నిబంధనల వలన పిఎం కిసాన్‌ లబ్ధి లక్షలాది మంది రైతులకు అందట్లేదు. రాష్ట్రం ఇచ్చే రూ.7,500 మాత్రమే జమ అవుతున్నాయి. మిగిలిన మొత్తం .. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వకపోతూండటంతో రైతులు నష్టపోతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Budget 2025 Income Tax:బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
Araku Airport: అరకు, పాడేరుకు బడ్జెట్‌లో కీలక ప్రకటన - ఉడాన్ పథకాన్ని సవరించిన కేంద్ర ప్రభుత్వం
అరకు, పాడేరుకు బడ్జెట్‌లో కీలక ప్రకటన - ఉడాన్ పథకాన్ని సవరించిన కేంద్ర ప్రభుత్వం
Budget 2025 : ఏటికొప్పాక బొమ్మలకు మహర్దశ - కేంద్ర బడ్జెట్‌లో కీలక ప్రకటన చేసిన ఆర్థిక మంత్రి
ఏటికొప్పాక బొమ్మలకు మహర్దశ - కేంద్ర బడ్జెట్‌లో కీలక ప్రకటన చేసిన ఆర్థిక మంత్రి
Budget 2025: బడ్జెట్‌తో ధరలు పెరిగే వస్తువులేంటీ? రేట్లు తగ్గే గూడ్స్ ఏంటీ?
బడ్జెట్‌తో ధరలు పెరిగే వస్తువులేంటీ? రేట్లు తగ్గే గూడ్స్ ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nirmala Sitharaman Budget Day Saree | నిర్మలా సీతారామన్ కట్టుకున్న చీరకు ఇంత హిస్టరీ ఉంది | ABP DesamMEIL Director Sudha Reddy on Budget 2025 | మధ్యతరగతి మహిళ పారిశ్రామిక వేత్తగా ఎదగాలంటే.? | ABP DesamMEIL Director Sudha Reddy on Budget 2025 | నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో మహిళలను పట్టించుకుంటున్నారా..!? | ABP DesamUnion Budget 2025 PM Modi Lakshmi Japam | బడ్జెట్ కి ముందు లక్ష్మీ జపం చేసిన మోదీ..రీజన్ ఏంటో.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Budget 2025 Income Tax:బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
Araku Airport: అరకు, పాడేరుకు బడ్జెట్‌లో కీలక ప్రకటన - ఉడాన్ పథకాన్ని సవరించిన కేంద్ర ప్రభుత్వం
అరకు, పాడేరుకు బడ్జెట్‌లో కీలక ప్రకటన - ఉడాన్ పథకాన్ని సవరించిన కేంద్ర ప్రభుత్వం
Budget 2025 : ఏటికొప్పాక బొమ్మలకు మహర్దశ - కేంద్ర బడ్జెట్‌లో కీలక ప్రకటన చేసిన ఆర్థిక మంత్రి
ఏటికొప్పాక బొమ్మలకు మహర్దశ - కేంద్ర బడ్జెట్‌లో కీలక ప్రకటన చేసిన ఆర్థిక మంత్రి
Budget 2025: బడ్జెట్‌తో ధరలు పెరిగే వస్తువులేంటీ? రేట్లు తగ్గే గూడ్స్ ఏంటీ?
బడ్జెట్‌తో ధరలు పెరిగే వస్తువులేంటీ? రేట్లు తగ్గే గూడ్స్ ఏంటీ?
Budget 2025 MSME and Startups: ఎంఎస్‌ఈలు, స్టార్టప్‌‌లకు అదిరిపోయే న్యూస్ - ఏకంగా రూ.20 కోట్ల వరకు రుణాలు
Budget 2025 MSME and Startups: ఎంఎస్‌ఈలు, స్టార్టప్‌‌లకు అదిరిపోయే న్యూస్ - ఏకంగా రూ.20 కోట్ల వరకు రుణాలు
Budget 2025 Updates: దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో క్యాన్సర్‌ డే కేర్ సెంటర్‌- బడ్జెట్‌లో నిర్మల కీలక ప్రకటన
దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో క్యాన్సర్‌ డే కేర్ సెంటర్‌- బడ్జెట్‌లో నిర్మల కీలక ప్రకటన
Hardik Pandya Record: అరుదైన జాబితాలో పాండ్యా.. ఇప్పటివరకు కేవలం ముగ్గురికి మాత్రమ సాధ్యమైన ఘనత.. నాలుగో టీ20లో ఫిఫ్టీతో..
అరుదైన జాబితాలో పాండ్యా.. ఇప్పటివరకు కేవలం ముగ్గురికి మాత్రమ సాధ్యమైన ఘనత.. నాలుగో టీ20లో ఫిఫ్టీతో..
Telangana News: తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది - ఫామ్‌హౌస్‌లో పది మంది ఎమ్మెల్యేల భేటీతో కలకలం
తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది - ఫామ్‌హౌస్‌లో పది మంది ఎమ్మెల్యేల భేటీతో కలకలం
Embed widget