అన్వేషించండి

Vijayasai Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొందర్లోనే కూలిపోతుంది: విజయసాయిరెడ్డి జోస్యం

YSRCP MP Vijayasai Reddy: కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని, తొందర్లోనే ఆ ప్రభుత్వం కూలిపోతుందని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు.

Vijayasai Reddy In Rajya Sabha: న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి, రాష్ట్ర విభజనతో రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని ఆ పార్టీ ప్లాన్ చేసిందని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. కానీ ఏపీతో పాటు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కుట్రలు తెలిసి, ఆ పార్టీకి 10 ఏళ్ల పాటు ఎన్నికల్లో బుద్ధి చెప్పారని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. రెండు ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్, అతికష్టమ్మీద మూడో ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని జోస్యం చెప్పారు. 

విభజన చట్టంలో హోదా అంశాన్ని ఎందుకు చేర్చలేదు!
ఇప్పుడు కూడా ఎన్నో అబద్ధాలు చెప్పి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని, కొన్ని రోజులు వేచి చూస్తే చాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినా.. విభజన చట్టంలో ఆ అంశాన్ని చేర్చకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతగానో నష్టపోయారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాన్ని విభజించింది, కానీ ఏపీకి మాత్రం కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని, ప్రత్యేక రాకపోవడానికి కారణం ఆ పార్టీ పెద్దలే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌తో ఏపీకి తీరని నష్టం.. 
 ఏపీ విభజన అసంబద్ధంగా, అసంపూర్తిగా జరిగిందని.. దాంతో తమ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.  కాంగ్రెస్ పార్టీ ఏపీకి కోలుకోలేని నష్టం చేసిందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేశారను కనుక.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరని చెప్పారు. రాహుల్ గాంధీ ఏ ఎన్నికల్లోనూ గెలవరని జోస్యం చెప్పారు. 2029 నాటికి కాంగ్రెస్ ముక్త్ భారత్ గా దేశం మారుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ ఉన్నంతకాలం దేశం వెనుకబాటుతో కుంగిపోయిందని, అభివృద్ధి జరగదని విమర్శించారు.               

కాంగ్రెస్ పార్టీ ఏపీకి చేసిన నష్టం కారణంగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందన్నారు. గత ఏపీ ఎన్నికల్లో నోటా కంటే  తక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయన్నారు. ఏపీకి చేసిన మోసానికి కాంగ్రెస్ కు శిక్షలు పడుతూనే ఉంటాయని, రాష్ట్ర ప్రజలు ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ఓట్లు వేసే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ దుష్పరిపాలనకు ఏపీ పెద్ద బాధిత రాష్ట్రమని, విభజన చట్టం హామీలలో ప్రత్యేక హోదా చేర్చకపోవడంతో రాష్ట్రం ఎంతో వెనక్కి వెళ్లిందన్నారు. ఏపీలో అదృశ్యమైన కాంగ్రెస్ పార్టీ, త్వరలోనే జాతీయ స్థాయిలో కూడా కనుమరుగు కావడం ఖాయమన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో నెగ్గిన 40 సీట్లకు మించి గెలవదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పిన విషయాలను విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.                    
      

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
BRS YSRCP Silent on BJP Centre: జాతీయ అంశాలపై రీజినల్ పార్టీల సైలెంట్ రాజకీయం! BRS, YSRCP మౌనం వెనుక మర్మమేంటి?
జాతీయ అంశాలపై రీజినల్ పార్టీల సైలెంట్ రాజకీయం! BRS, YSRCP మౌనం వెనుక మర్మమేంటి?
Telangana Delimitation 2026: తెలంగాణలో డిలిమిటేషన్ ధమాకా - గ్రేటర్ హైదరాబాద్ కేంద్రంగా మారబోతున్న రాష్ట్ర రాజకీయం?
తెలంగాణలో డిలిమిటేషన్ ధమాకా - గ్రేటర్ హైదరాబాద్ కేంద్రంగా మారబోతున్న రాష్ట్ర రాజకీయం?
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
Brezza Facelift: మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
Ravneet Singh Bittu Resign: ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
Embed widget