అన్వేషించండి

Vijayasai Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొందర్లోనే కూలిపోతుంది: విజయసాయిరెడ్డి జోస్యం

YSRCP MP Vijayasai Reddy: కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని, తొందర్లోనే ఆ ప్రభుత్వం కూలిపోతుందని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు.

Vijayasai Reddy In Rajya Sabha: న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి, రాష్ట్ర విభజనతో రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని ఆ పార్టీ ప్లాన్ చేసిందని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. కానీ ఏపీతో పాటు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కుట్రలు తెలిసి, ఆ పార్టీకి 10 ఏళ్ల పాటు ఎన్నికల్లో బుద్ధి చెప్పారని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. రెండు ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్, అతికష్టమ్మీద మూడో ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని జోస్యం చెప్పారు. 

విభజన చట్టంలో హోదా అంశాన్ని ఎందుకు చేర్చలేదు!
ఇప్పుడు కూడా ఎన్నో అబద్ధాలు చెప్పి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని, కొన్ని రోజులు వేచి చూస్తే చాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినా.. విభజన చట్టంలో ఆ అంశాన్ని చేర్చకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతగానో నష్టపోయారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాన్ని విభజించింది, కానీ ఏపీకి మాత్రం కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని, ప్రత్యేక రాకపోవడానికి కారణం ఆ పార్టీ పెద్దలే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌తో ఏపీకి తీరని నష్టం.. 
 ఏపీ విభజన అసంబద్ధంగా, అసంపూర్తిగా జరిగిందని.. దాంతో తమ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.  కాంగ్రెస్ పార్టీ ఏపీకి కోలుకోలేని నష్టం చేసిందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేశారను కనుక.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరని చెప్పారు. రాహుల్ గాంధీ ఏ ఎన్నికల్లోనూ గెలవరని జోస్యం చెప్పారు. 2029 నాటికి కాంగ్రెస్ ముక్త్ భారత్ గా దేశం మారుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ ఉన్నంతకాలం దేశం వెనుకబాటుతో కుంగిపోయిందని, అభివృద్ధి జరగదని విమర్శించారు.               

కాంగ్రెస్ పార్టీ ఏపీకి చేసిన నష్టం కారణంగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందన్నారు. గత ఏపీ ఎన్నికల్లో నోటా కంటే  తక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయన్నారు. ఏపీకి చేసిన మోసానికి కాంగ్రెస్ కు శిక్షలు పడుతూనే ఉంటాయని, రాష్ట్ర ప్రజలు ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ఓట్లు వేసే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ దుష్పరిపాలనకు ఏపీ పెద్ద బాధిత రాష్ట్రమని, విభజన చట్టం హామీలలో ప్రత్యేక హోదా చేర్చకపోవడంతో రాష్ట్రం ఎంతో వెనక్కి వెళ్లిందన్నారు. ఏపీలో అదృశ్యమైన కాంగ్రెస్ పార్టీ, త్వరలోనే జాతీయ స్థాయిలో కూడా కనుమరుగు కావడం ఖాయమన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో నెగ్గిన 40 సీట్లకు మించి గెలవదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పిన విషయాలను విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.                    
      

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telugu Desam Party:'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
TVK Chief Vijay: CSK మ్యాచ్‌లు పోతున్నా... విజయ్‌కి మాత్రం కలిసి వస్తుంది! స్టేడియం అంతా విజిల్ సౌండ్సే! ఇదో రకం పబ్లిసిటీ!
CSK మ్యాచ్‌లు పోతున్నా... విజయ్‌కి మాత్రం కలిసి వస్తుంది! స్టేడియం అంతా విజిల్ సౌండ్సే! ఇదో రకం పబ్లిసిటీ!
Telangana Congress: కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తికి అదే కారణమా? త్వరలోనే తీపి కబురు వింటారా?
కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తికి అదే కారణమా? త్వరలోనే తీపి కబురు వింటారా?
Bengal Assembly Elections: బెంగాల్ రాజకీయాల్లో ముస్లిం కూటమి - మమతకు ముప్పు తప్పదా?
బెంగాల్ రాజకీయాల్లో ముస్లిం కూటమి - మమతకు ముప్పు తప్పదా?

వీడియోలు

TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam
Priyansh Arya 39 vs CSK IPL 2026 | పవర్ ప్లే లో రఫ్పాడించి మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పేశాడు | ABP Desam
Sanju Samson Failures CSK IPL 2026 | తొలి రెండు మ్యాచుల్లోనూ సంజూ విఫలం | ABP Desam
CSK vs PBKS Match Highlights IPL 2026 | సీఎస్కేపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 DC Vs MI Result Update: ఢిల్లీకి వ‌రుస‌గా రెండో విజ‌యం.. ముంబైని చిత్తు చేసిన క్యాపిట‌ల్స్, రాణించిన రిజ్వి, నిస్సాంక‌, MI కి నిరాశ‌
ఢిల్లీకి వ‌రుస‌గా రెండో విజ‌యం.. ముంబైని చిత్తు చేసిన క్యాపిట‌ల్స్, రాణించిన రిజ్వి, నిస్సాంక‌, MI కి నిరాశ‌
Basra Development: బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
Tiger In Polavaram: వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
Tyson Naidu OTT : టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
Telugu Desam Party:'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
Gajwel Attack: రేవంత్ ఫోటో లేదని గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై ఎటాక్ - రౌడీ రాజ్యమని బీఆర్ఎస్ ఆగ్రహం
రేవంత్ ఫోటో లేదని గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై ఎటాక్ - రౌడీ రాజ్యమని బీఆర్ఎస్ ఆగ్రహం
VitalID: ఇక పాస్‌వర్డ్‌లు అవసరం లేదు! కదిలితే చాలు గుర్తిస్తుంది - సరికొత్త టెక్నాలజీ ఇదీ
ఇక పాస్‌వర్డ్‌లు అవసరం లేదు! కదిలితే చాలు గుర్తిస్తుంది - సరికొత్త టెక్నాలజీ ఇదీ
Kyathanpally and Ibragimpatnam: ఇబ్రహీంపట్నం, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల్లో నాటకీయ పరిణామాలు! రెండింటిని కైవశం చేసుకున్న బీఆర్‌ఎస్‌!
ఇబ్రహీంపట్నం, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల్లో నాటకీయ పరిణామాలు! రెండింటిని కైవశం చేసుకున్న బీఆర్‌ఎస్‌!
Embed widget