అన్వేషించండి

Chiru Congress : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్‌గా చిరంజీవి - ఐడీ కార్డు జారీ !

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికల్లో చిరంజీవి ఓటర్‌గా నమోదయ్యారు. ఈ మేరకు కార్డు వెలుగులోకి వచ్చింది.


Chiru Congress :   రాజకీయానికి నేను దూరం అయినా రాజకీయాలు మాత్రం తనకు దూరం కాలేదని చిరంజీవి డైలాగ్ చెప్పి ఒక్క రోజు గడవక ముందే కాంగ్రెస్ పార్టీలో ఆయనకు గుర్తింపు కార్డు జారీ అయింది. 2027 వరకూ చెల్లుబాటు అయ్యేలా పీసీసీ డెలిగేట్‌గా కార్డును ఏఐసీసీ జారీ చేసింది. ఈ కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ జరుగుతోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఓటర్ల జాబితాను రెడీ చేసింది. ఆ ఓటర్ల జాబితాలో చిరంజీవి కూడా ఉన్నారు. అందుకే కార్డు జారీ అయినట్లుగా తెలుస్తోంది. చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడు, కేంద్రమంత్రిగా పని చేశారు. 
Chiru Congress : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్‌గా చిరంజీవి - ఐడీ కార్డు జారీ !

ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి

2014లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కొంత కాలం క్రియాశీలకంగా ఉన్నప్పటికీ తర్వాత చిరంజీవి  పూర్తిగా రాజకీయాలకు దూరం అయ్యారు. రాజ్యసభ సభ్యునిగా సమావేశాలకూ వెళ్లలేదు. ఇందు కోసం అప్పట్లో రాజ్యసభ చైర్మన్ అనుమతిని తీసుకున్నారు. పదవి కాలం పూర్తయ్యే రోజు కూడా సభకు వెళ్లలేదు. తాను ప్రత్యక్ష రాజకీయాలను వదిలేశానని ఇటీవలే చిరంజీవి బహిరంగంగా ప్రకటించారు. అయితే గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ పొలిటికల్ డైలాగ్‌ను వదలడం.. అది వైరల్ అయిన మరుసటి రోజే ఏఐసిసి నుంచి డెలిగేట్ కార్డు మీడియాకు విడుదల కావడం యాధృచ్చికం కాదన్న వాదన వినిపిస్తోంది. 

వరుసగా సినిమాలు చేస్తున్న చిరు 

ప్రజారాజ్యం  పార్టీ పెట్టి రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకున్న  చిరంజీవికి.. పరిస్థితులు కలిసి రాలేదు. ఎన్నికల్లో భారీ విజయం లభించకపోవడంతో ఆయన వేగంగానే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. తర్వాత కేంద్రమంత్రి అయ్యారు. కానీ ఏపీ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిణామాలు.  రాష్ట్ర విభజన, జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకోవడం వంటి కారణఆలతో కాంగ్రెస్ పార్టీ పూర్తి బలహీనం అయిపోయింది . దీంతో చిరంజీవి కూడా కాపాడలేని పరిస్థితి.  ఆ సమయంలో  చిరంజీవి మళ్లీ తనకు అచ్చి వచ్చిన సినీ రంగంలోకి వెళ్లిపోయారు. వరుసగా సినిమాలు చేసుకుంటున్నారు. 

కాంగ్రెస్ పార్టీ ఐడీ కార్డు జారీ చేయడంపై స్పందిస్తారా !?

పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ పెట్టడం.., ఆయనకు చెక్ పెట్టేందుకు ఇతర పార్టీలు చిరంజీవిని తమకో కలుపుకోవాలని ప్రయత్నిస్తూండటంతో చిరంజీవి రాజకీయ అడుగులపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. చిరంజీవి రాజకీయాల నుంచి విరమించుకున్నానని ప్రకటించారు కానీ.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు. అలా చేసినట్లుగా ఎప్పుడూ ప్రకటించలేదు. ఈ కారణంగానే తమ పార్టీలో ఉన్న ప్రస్తు. మాజీ ఎంపీలు.. కేంద్రమంత్రులు అందరికీ ఆయా రాష్ట్రాల వారీగా పీసీసీ డెలిగేట్ కార్డులు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై చిరంజీవి ఎలా స్పందిస్తారో తేలాల్సి ఉంది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటేస్తారో లేదో చూడాల్సి ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget