అన్వేషించండి

AP Politics : పోటీ పడి మరీ బీజేపీ అభ్యర్థికి మద్దతు ! ఏపీ రాజకీయ పార్టీలు రాష్ట్రానికి ఏం సాధించాయి ?

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వడం ద్వారా ఏపీ రాజకీయ పార్టీలు రాష్ట్రానికి ఏమీ సాధించలేదు. కనీసం డిమాండ్ కూడా పెట్టలేదు. దీంతో అన్ని రాజకీయ పార్టీలపై విమర్శలు వినిపిస్తున్నాయి.

AP Politics :  రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా నిలబడిన ద్రౌపది ముర్ము ఏపీకి వచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా భావించిన వైఎస్ఆర్‌సీపీ ముందుగానే మద్దతు ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ ఒక రోజు ముందుగా మద్దతు ఇచ్చింది. ఆమె ఒకే రోజు రెండు పార్టీలకు చెందిన ఓటర్లతో సమావేశం అయ్యారు. ఇక జనసేన పార్టీ కూడా వ్యతిరేకించలేదు. ఆ పార్టీకి ఓట్లు లేకపోవడంతో  రాష్ట్రపతి అభ్యర్థి కలవలేదనుకోవచ్చు. అయితే ఇప్పుడు అందరికీ వస్తున్న సందేహం ఒక్కటే. ఇంత కీలకమైన ఎన్నికల్లో పోటీ పడి మరీ బీజేపీకి మద్దతిచ్చి ఏం సాధిస్తున్నారు ? రాష్ట్రానికి ఏమైనా ప్రయజనాలు అడిగారా? కనీసం ఓ మాట చెప్పారా? అనే. కానీ ఏ ఒక్క పార్టీ కూడా మేము మద్దతిస్తున్నామనో..మద్దతిస్తామనో చెప్పి మా రాష్ట్రానికి ఫలానా మేలు చేయండి  అని అడిగలేదు. ఈ అంశమే ఇప్పుడు ప్రజల్ని కూడా ఆశ్చర్య పరుస్తోంది. 

వైఎస్ఆర్‌సీపీ మద్దతు కీలకం - ఒక్క డిమాండ్ పెట్టకపోవడంపై విమర్శలు !

వైఎస్ఆర్‌సీపీకి రాష్ట్రపతి ఎన్నిక కోసం ఓట్లు ఉన్న ఎలక్టోరల్ కాలేజీలో ఆరు శాతం ఓట్లు ఉన్నాయి. ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించాలంటే ఆ ఆరు శాతం ఓట్లు కీలకం. ఆ విషయం ఆ పార్టీ నేతలు కూడా ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ కీలకమని విజయసాయిరెడ్డి కూడా పలుమార్లు ప్రకటించారు. వారి ప్రకటనలు చూసి చాలా మంది సామాన్యులు ఏపీకి రావాల్సిన వాటి కోసం పట్టుబట్టి మద్దతు ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ ఎలాంటి డిమాండ్స్ పెట్టలేదు. ప్రత్యేకహోదాను అడగడానికి ఇదేమంచి తరుణం అని చాలా మంది తటస్థులు కూడా సూచించారు. అయితే ఏపీ పాలకులు మాత్రం పట్టించుకోలేదు. చివరికి తాము మద్దతు అడగకుండానే ప్రకటించారని బీజేపీ నేతలు కూడా విమర్శలు గుప్పించారు. అయితే బీజేపీ హైకమాండ్ తర్వాత తాము మద్దతు అడిగామని ప్రకటించి.. కాస్త ఊరటనిచ్చారు. అయితే గట్టిగా షరతులు పెట్టే  బలమున్నా... వైఎస్ఆర్‌సీపీ నేతలు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఒక్క విజ్ఞప్తి కూడా ఎందుకు చేయలేదో ఎవరికీ అర్థం కాని విషయం. 

చివరి క్షణంలో టీడీపీ మద్దతు - ఆ పార్టీదీ అదే తీరు..! 

తెలుగుదేశం పార్టీకి ముగ్గురు ఎంపీలు, ఇరవై మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఎలక్టోరల్ కాలేజీలో వీరికి ఉన్న ఓట్లు దాదాపు అరశాతమే. ఏ మాత్రం ప్రభావం చూపలేని ఓట్లు. అందుకే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి గుంభనంగాఉంది. విపక్ష పార్టీల నేతలు నిర్వహిస్తున్న సమావేశాలకు కూడా  ఆ పార్టీకి ఆహ్వానం అందలేదు. అయితే చివరి క్షణంలో సామాజిక న్యాయం పేరు చెప్పి బీజేపీ అభ్యర్థికే మద్దతు తెలిపారు. ఏపీకి ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ద్రౌపది ముర్ముతో ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్రప్రజలు ఇచ్చిన అరకొర బలంతో అయినా రాష్ట్రం కోసం ఫలానా మేలు చేయమని బీజేపీని అడగలేకపోయారు. నిర్ణయాత్మక శక్తి...  పాలనలో ఉన్న వైఎస్ఆర్‌సీపీనే అడగలేదు. తామెంత అన్నట్లుగా బీజేపీ నేతలు వ్యవహరించారు. 

బీజేపీ గుడ్ లుక్స్‌లో ఉంటే చాలనుకకుంటున్నారా ?

భారతీయ జనతాపార్టీకి ఏపీలో బలం లేదు. అయితే  ఆ పార్టీ  విషయంలో ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ అణిగిమణిగి ఉంటున్నాయి. తమ జోలికి రాకపోతే చాలు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తామన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.  తమ రాష్ట్రానికి ఏ మేలు చేసినా చేయకపోయినా పట్టించుకోవడం లేదు. పొత్తులో ఉన్న జనసేన పార్టీది అదే పరిస్థితి. అందుకే ఏపీలో ఏ పార్టీ గెలిచినా బీజేపీ గెలిచినట్లే అని కొంత మంది విశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Embed widget