అన్వేషించండి

AP Governer : ఏపీ సర్కార్ పనితీరుపై గవర్నర్ నజర్ - ప్రతీ నెలా అన్ని ప్రోగ్రెస్ రిపోర్టులు ఇవ్వాలని ఆదేశం !

ప్రభుత్వ శాఖల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించారు. ఇలా అడగడంతో ఏపీ ప్రభుత్వంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

 

AP Governer :    ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వ పాలనపై గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ దృష్టిసారించా రు.  ఇటీవల ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఓ సమాచారం పంపారు. ప్రతీ నెలా తనకు ప్రోగ్రెస్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వంలోని ప్రతి శాఖకు సంబంధించి ప్రతి నెలా జరిగిన పరిణామాలపై నివేదిక ఇవ్వాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే నివేదికల ఆధారంగానే తాను రిపోర్టులు తయారు చేసి కేంద్రానికి పంపే అవకాశం ఉంది.  ప్రతీ నెలా రిపోర్టులు అడుగుతున్నందున… అన్ని అంశాలపై గవర్నర్‌కు స్పష్టత ఇవ్వాల్సిందేనని అధికారవర్గాలు భావిస్తున్నాయి.  

ప్రభుత్వం నుంచి  ప్రతి నెలా రిపోర్టు కావాలంటున్న ఏపీ గవర్నర్

మొన్నటి వరకూ ఉన్న గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నెలవారీ నివేదికలు అడగలేదు.   గత నెల 29న గవర్నర్‌ కార్యాలయం నుంచి పాలనాపరమైన అంశాలపై ప్రతినెలా నివేదిక పంపాలంటూ సాధారణ పరిపాలన శాఖకు లేఖ అందింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రికి నివేదిక పంపాల్సి ఉన్నందున ప్రతి నెలా 3లోగా ఆయా అంశాలపై నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. మరో రెండు రోజులు అదనపు సమయం తీసుకోవచ్చు తప్ప అంతకు మించి జాప్యం చేయవద్దంటూ రాజ్ భవన్ నుంచి స్పష్టమైన సంకేతాలు వెళ్లాయంటున్నారు. గవర్నర్‌ కార్యాలయం నుంచి ఈ తరహా ఆదేశాలు రావడం అధికారవర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. 

అన్ని శాఖల నుంచి సమగ్ర సమాచారం ! 

రాష్ట్రంలోని పరిస్థితులు, ప్రజల స్థితిగతులు, కీలక రంగాల్లో అభివృద్ధి వంటి అంశాపై గవర్నర్‌ కార్యాలయం నివేదిక కోరింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ ప్రాథాన్యతా స్కీముల వివరాలు అడిగారు. రాష్ట్రంలో నిత్యావసర ధరలు, ప్రజలపై ప్రభావం వంటి అంశాలను పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగాల్లో సాధించిన వృద్ధిపై నివేదిక కోరారు. నీటి పారుదల రంగంలో పరిస్థితులు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమంతో పాటు వైద్య సేవలు, సామాజిక ఫెన్షన్లు, నిత్యావసర సరుకుల పంపినీ, విద్యుత్‌ సరఫరా, ఇంధన రంగం వృద్ధి, వ్యవసాయ రంగంలో సంస్కరణలు, స్వచ్ఛ భారత్‌, స్వచ్ఛాంధ్రప్రదేశ్‌, ఎస్సీ, ఎస్టీల కేసుల నమోదు వంటి పలు అంశాలపై గవర్నర్‌ కార్యాలయం నివేదిక కోరింది. రాష్ట్రంలో పేదలకు గృహ నిర్మాణం, పేదరిక నిర్మూలన చర్యలు, పిల్లలు, మహిళల సంక్షేమ పథకాలు, బాలికా విద్య, వికలాంగుల సంక్షేమం, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి చేపట్టిన చర్యలను ఆ నివేదికలో పొందుపరచాలని గవర్నర్ ఆదేశించారు. 

గవర్నర్ ఇలాంటి నివేదికలు ఎందుకు కోరారు ? 

రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, ప్రాథాన్యతలు, పాలనాపరమైన అంశాలపై గవర్నర్‌ కార్యాలయం నెలవారీ నివేదిక కోరడంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది సాధారణ వ్యవహారంగానే కొందరు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై గవర్నర్‌ నివేదిక ఇవ్వడమనేది పాలనాపరమైన అంశంలో భాగమేనని చెపుతున్నారు. అయితే వివిధ రాజకీయ పార్టీల నుంచి ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో పథకాలు దుర్వినియోగం కాకుండా కట్టడి చేయడంలో భాగమని భావిస్తున్నారు. మరో వైపు పొరుగు రాష్ట్రాల్లో తరుచూ ప్రభుత్వం, గవర్నర్ల మధ్య పేచీలు తలెత్తుతున్నందున ఈ తరహా ఘటనలకు ఆస్కారం లేకుండా కేంద్రం తగిన చర్యలు తీసుకోవడంలో భాగమై ఉండొచ్చంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన సహా అన్ని పార్టీలు వేలెత్తి చూపుతున్నాయి. కొందరు కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ క్రమంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం నిశితంగా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో గవర్నర్‌ కార్యాలయం స్పందించడం కీలకంగా చెప్పొచ్చు. 

గవర్నర్ కీలక నిర్ణయాలు తీసుకుంటే వివాదం ఏర్పడుతుందా ?  

నిజానికి బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్లు చాలా యాక్టివ్ గా ఉంటారు. ఉదాహరణకు తెలంగాణను తీసుకుంటేనే ..  అక్కడ ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య ఉన్న వివాదం ఇంకా తేలలేదు. సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. కానీ ఏపీ ప్రభుత్వం కేంద్రంతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకుంది. అందుకే గత గవర్నర్ నుంచి ఎలాంటి సమస్యలూ రాలేదు. ప్రస్తుత గవర్నర్ నుంచి కూడా రావని అడిగిన సమాచారం ఇస్తే ఇబ్బందేమీ ఉండదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Bangladesh squad for T20 world cup: టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
Embed widget