అన్వేషించండి

Breaking News Telugu Live Updates: జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద ఉద్రిక్తత, బాలికకు న్యాయం చేయాలని బీజేపీ నేతలు ఆందోళన

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

LIVE

Key Events
Breaking News Telugu Live Updates: జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద ఉద్రిక్తత, బాలికకు న్యాయం చేయాలని బీజేపీ నేతలు ఆందోళన

Background

ఈ ఏడాది నాలుగైదు రోజుల ముందే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ప్రస్తుతం నైరుతు రుతువనాలు చురుకుగా కదులుతున్నాయి. పశ్చిమ బెంగాల్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతం వరకు సముద్రమట్టంపై 0.9 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని చోట్ల, మిజోరం, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల వైపు నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఉత్తర, సెంట్రల్ బెంగల్, ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయాలు, పశ్చిమ బెంగాల్, సిక్కింలను మరో రెండు రోజుల్లో తాకనున్నాయి. వ్యవసాయరంగానికి కీలకమైన నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని ఐఎండీ ఇటీవల ప్రకటించింది.  దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. మరోవైపు కొన్నిచోట్ల 2 నుంచి 4 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని సూచించారు. 

ప్రముఖ రచయిత, గోదారోళ్ల కితకితల పేరుతో ఫేస్‌బుక్ గ్రూప్ సృష్టించి చాలా మందికి స్ఫూర్తిగా మారిన ఈదర వీర వెంకట సత్యనారాయణ గుండెపోటుతో మృతి చెందారు. గురవారం రాత్రి 11.30 గంటలకు గుండెపోటు వచ్చింది. హుటాహుటిన 108 కాల్ చేసి ఆసుపత్రికి తరలించేందు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అంబులెన్స్ వచ్చేసరికే ఆయన తుది శ్వాస విడిచినట్టు  బంధువులు చెప్పారు.

పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. నిన్న స్వల్పంగా తగ్గిన  బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనించి భారీగా పుంజుకుంది. రూ.110 మేర పెరగడంతో  తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,930కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,600 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు వెండి ధర నిన్నటి ధర వద్ద నిలకడగా ఉంది. హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.67,600 అయింది.

ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరగడంతో  విజయవాడలో 24 క్యారెట్ల బంగారం  10 గ్రాముల ధర రూ.51,930 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,600 కు ఎగబాకింది. విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.67,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం, తిరుపతిలో రూ.100 మేర పెరగడంతో నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,930 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,600 అయింది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో నేడు 1 కేజీ వెండి ధర రూ.67,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. 

హైదరాబాద్‌లో ఇంధన ధరలు వరుసగా మూడోరోజు నిలకడగా ఉన్నాయి. నేడు హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82 వద్ద స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 వద్ద స్థిరంగా ఉన్నాయి. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర 19 పైసలు తగ్గింది. పెట్రోల్ లీటర్ ధర రూ.109.16 కాగా, 17 పైసలు తగ్గడంతో డీజిల్‌‌ లీటర్ ధర రూ.97.35 అయింది. వరంగల్ రూరల్ జిల్లాలో 18 పైసలు తగ్గడంతో పెట్రోల్‌ లీటర్ ధర రూ.109.21 కాగా, 16 పైసలు తగ్గడంతో డీజిల్‌‌‌ లీటర్ ధర రూ.97.40 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి

 

19:47 PM (IST)  •  03 Jun 2022

జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో ఎమ్మెల్యే, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారులు అరెస్టు 

జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో అరెస్టుల పర్వం మొదలైంది. ఎమ్మెల్యే కుమారుడితో పాటు వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ శివారులో వారిని అరెస్టు చేసినట్లు సమాచారం. 

18:56 PM (IST)  •  03 Jun 2022

జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద ఉద్రిక్తత, బాలికకు న్యాయం చేయాలని బీజేపీ నేతలు ఆందోళన

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అత్యాచారానికి గురైన బాలికకు న్యాయం చెయ్యాలని బీజేపీ ఆందోళన చేపట్టింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ బీజేపీ నేతలు ముట్టడించారు.  నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 

15:09 PM (IST)  •  03 Jun 2022

Case Filed Against R Krishnaiah: వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్ కృష్ణయ్యపై నాన్ బెయిలబుల్ కేసు

Case Filed Against R Krishnaiah: వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్ కృష్ణయ్యపై కేసు నమోదు
రౌడీలు గూండాలతో భూ కబ్జాతో పాటు హత్యాయత్నం చేస్తూ తనను బెదిరిస్తున్నారంటూ రవీందర్ రెడ్డి ఫిర్యాదు
రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో నాన్ బెయిలబుల్ కేసు
447, 427, 506, 384 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

13:53 PM (IST)  •  03 Jun 2022

అచ్యుతాపురం బ్రాండిక్స్ ఎస్‌ఈజెడ్‌లో ప్రమాదం - అమ్మోనియం లీక్‌తో ఉద్యోగలకు అస్వస్థత

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బ్రాండిక్స్ ఎస్‌ఈజెడ్‌లో ప్రమాదం 
సీడ్స్ యూనిట్‌లో అమ్మోనియం లీక్‌.
వాయువు లీక్‌తో ఉద్యోగులకు అస్వస్థత
వాంతులు, తల తిరుగుడుతో ఇబ్బండి పడ్డ ఉద్యోగులు 
నలుగురు మహిళలకు ఎస్ఈజెడ్‌ లో చికిత్స 

12:52 PM (IST)  •  03 Jun 2022

Jubilee Hills Pub: బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోక్సో సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు

Jubilee Hills Pub: జుబ్లీహిల్స్ పబ్ మైనర్ గర్ల్ కేసులో ఎఫ్ఆర్ లోని వివరాలు ఇవే.

జుబ్లీహిల్స్ మైనర్ బాలిక లైంగిక దాడి కేసులో కొనసాగుతున్న దర్యాప్తు . బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోక్సో సెక్షన్ కిందా ఎఫ్ఐఆర్ రిజస్టర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలిక తండ్రి , మైనర్ గర్ల్ వివరాలు సీల్డ్ కవర్లో ఉంచిన పోలీసులు. గత నెల 28 న జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ కు పార్టీకి వెళ్లిందని ఫిర్యాదులో పేర్కొన్న తండ్రి. మైనర్ అమ్మాయిని రెడ్ కలర్ మెర్సిడెజ్ బెంచ్, ఇన్నోవా కారులో తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. TS09FL6460 నెంబర్ తో మెర్సిడెజ్ బెంచ్ కారు, మరో కార్ కు టీఆర్ నెంబర్ ఉంది.

కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించి మెడపై గాయం చేశారని.. ఘటన జరిగినప్పటి నుంచి తమ కూతురు షాక్ లో ఉందని తండ్రి తెలిపారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Punganuru Child Murder: వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
Harish Rao: బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
Jani Master: జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్
జానీ మాస్టర్ కు పెరుగుతున్న మద్దతు, నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Siyaram Baba Viral Video 188 Years | 188ఏళ్ల సాధువు అంటూ వైరల్ అవుతున్న వీడియో | ABP DesamRK Roja on CM Chandrababu | పుంగనూరు బాలిక కిడ్నాప్, హత్య కేసుపై మాజీ మంత్రి ఆర్కే రోజా | ABP DesamTirumala Bramhotsavam Simha vahanam | యోగ నారసింహుడి అలంకారంలో తిరుమల శ్రీవారు | ABP DesamPrakash Raj Counters Pawan Kalyan | తమిళనాడులో పవన్ కళ్యాణ్ పరువు తీసిన ప్రకాశ్ రాజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Punganuru Child Murder: వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
Harish Rao: బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
Jani Master: జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్
జానీ మాస్టర్ కు పెరుగుతున్న మద్దతు, నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్
Pawan Kalyan: 3 నెలలుగా జీతాలు వస్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు
3 నెలలుగా జీతాలు వస్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు
Telangana: 20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Crime News: ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
Secunderabad To Goa Train: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
Embed widget