Viral Video: స్టేజీపై డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన యువతి - గుండెపోటుతో మృతి
Viral Video : డ్యాన్స్ చేస్తూ ఓ యువతి అకస్మాత్తుగా కుప్పకూలింది. ఆ తర్వాత ఆమెక సీపీఆర్ చేసినప్పటికీ ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు.

Viral Video : కరోనా తర్వాత గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా మధ్యప్రదేశ్ లో ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. డ్యాన్స్ చేస్తూ ఓ యువతి ఒక్కసారిగా కుప్పకూలింది. గుండెపోటు కారణంగానే ఆమె చనిపోయిందని అనుమానిస్తున్నారు. అయితే కొన్నాళ్ల క్రితం ఆమె సోదరుడు కూడా గుండెపోటుతోనే ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు మళ్లీ అదే కుటుంబంలో ఓ వ్యక్తి హార్ట్ ఎటాక్ తో మరణించడం హాట్ టాపిక్ గా మారింది.
పెళ్లి వేడుకలో విషాదం.. డ్యాన్స్ చేస్తూ యువతి మృతి
మధ్యప్రదేశ్లోని విదిష జిల్లాలో జరిగిన ఒక వివాహ వేడుకలో వేదికపై నృత్యం చేస్తూ 23 ఏళ్ల యువతి మరణించిన విషాద సంఘటన ఫిబ్రవరి 9న సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయిన ఓ వీడియో ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం ప్రకారం, మృతురాలిని ఇండోర్ నివాసి పరిణీత (23) గా గుర్తించారు. ఆమె తన బంధువుల్లో ఒకరి వివాహానికి హాజరు కావడానికి విదిషకు వెళ్లింది. ఈ సంఘటన శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో జరిగిందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఇందులో పరిణీత వేదికపై ఓ పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపించింది. ఆ సమయంలోనే ఆమె అకస్మాత్తుగా వేదికపై కుప్పకూలింది. ఆమె డ్యాన్స్ చేస్తుండగా గుండెపోటు వచ్చి ఉంటుందని, దాని కారణంగానే వేదికపై ఆమె ఆకస్మికంగా మరణించి ఉంటుందని పలువురు అనుమానిస్తున్నారు.
@vidisha @Ms_HeartAttack @vidishanews डांस करते-करते महिला अचानक गिरी, फिर नहीं उठी...हो गई मौत,हार्ट अटैक की आशंका।
— @durgesh IANS (@D_kumar777) February 9, 2025
डेढ़ मिनट के डांस के बाद अचानक स्टेज पर गिरी महिला हुई मौत। pic.twitter.com/NVnqPZt89k
సంగీత్ వేడుక రాత్రి 9 గంటలకు ప్రారంభం కాగా, ఈ ఘటన 10 గంటల ప్రాంతంలో జరిగింది. అయితే ఆమె ఒక్కసారిగా అలా స్టేజీపై కుప్పకూలడంతో వివాహానికి హాజరైన బంధువులు కొందరు వైద్యులు వెంటనే సీపీఆర్ చేసి ఆమెను బతికించడానికి ప్రయత్నించారు. కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఆ తర్వాతం ఆమెను విదిషలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు, మరణించినట్లు ప్రకటించారు. ఆమె మరణం తరువాత, వివాహ ఆచారాలు రాత్రి సమయంలో పూర్తయ్యాయి. ఆదివారం జరగాల్సిన అన్ని కార్యక్రమాలు రద్దు చేశారు. ఆమె బంధువులు చాలా మంది విదిషలో ఉండటంతో, ఆమె అంత్యక్రియలు కూడా అక్కడే జరిగాయి.
గతంలోనూ ఇలాంటి విషాదమే
పరిణీత ఇండోర్లోని స్వస్తిక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బ్రాంచ్ హెడ్ సురేంద్ర కుమార్ జైన్, బిందు జైన్ల కుమార్తె. ఈ కుటుంబం ఇండోర్లోని సౌత్ తుకోగంజ్లో నివసిస్తోంది. పరిణీత సోదరుడు కూడా 12 సంవత్సరాల వయసులో సైకిల్ తొక్కుతూ గుండెపోటుతో మరణించాడు. ఇంట్లో మౌని అని ముద్దుగా పిలుచుకునే పరిణీత తన ఎంబీఏ పూర్తి చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమెకు డ్యాన్స్ అంటే ఇష్టం. ఈ క్రమంలోనే ఒక నెల నుంచి వివాహంలో తన ప్రదర్శన కోసం సిద్ధమవుతోంది.
Also Read : Chilukur Temple: చిలుకూరు బాలాజీ అర్చకుడు రంగరాజన్పై దుండగుల దాడి కేసు, నిందితుల అరెస్ట్





















