By: ABP Desam | Updated at : 08 Apr 2022 05:52 PM (IST)
ఉక్రెయిన్ రైల్వేస్టేషన్పై రష్యా రాకెట్ దాడి
తూర్పు ఉక్రేనియన్ నగరం క్రామాటోర్స్క్లోని ప్యాక్డ్ రైలు స్టేషన్పై రష్యా దాడి చేసింది. రాకెట్తో చేసిన ఈ దాడిలో 35 మంది వరకు రాకెట్ దాడిలో కనీసం 35 మంది మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు. పౌరులను ఖాళీ చేయించి వేరే ప్రాంతానికి తరలిస్తున్నప్పు ఈ దాడి జరిగిందని రాయటర్స్ సంస్థ పేర్కొంది.
#BREAKING Russian defence ministry accuses Kyiv of deliberately targeting train station in eastern Ukraine city of Kramatorsk pic.twitter.com/FRkSvpmec1
— AFP News Agency (@AFP) April 8, 2022
వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు మహిళలు, పిల్లలు, వృద్ధులు సిద్ధంగా ఉన్న టైంలో దాడి జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రెండు రాకెట్లను వెంటవెంటనే రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్ చెబుతోంది.
"రెండు రాకెట్లు క్రమాటోర్స్క్ రైల్వే స్టేషన్ను తాకాయి. క్రామాటోర్స్క్ రైల్వే స్టేషన్పై రాకెట్ దాడిలో 30 మందికిపైగా మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు"అని ఉక్రేనియన్ రైల్వేస్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారని ఉక్రెయిన్ రైల్వే హెడ్ తెలిపారు.
రైల్వే స్టేషన్ను ఢీకొట్టినట్లు చెబుతున్న క్షిపణులను ఉక్రెయిన్ సైన్యం మాత్రమే ఉపయోగించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సంస్థ పేర్కొంది.
క్షిపణులు తాకినప్పుడు వేల మంది ప్రజలు స్టేషన్లో ఉన్నారని డొనెట్స్క్ ప్రాంత గవర్నర్ పావ్లో కైరిలెంకో పేర్కొన్నారు. దాడి జరిగిన సమయంలో దాదాపు 4,000 మంది స్టేషన్లో ఉన్నారని క్రమాటోర్స్క్ మేయర్ ఒలెక్సాండర్ హోంచారెంకో తెలిపారు.
The missile attack this morning on a train station used for evacuations of civilians in Ukraine is despicable.
— Ursula von der Leyen (@vonderleyen) April 8, 2022
I am appalled by the loss of life and I will offer personally my condolences to President @ZelenskyyUa
My thoughts are with the families of the victims.
"రష్యన్ ఫాసిస్టులు వారు ఎక్కడ లక్ష్యంగా పెట్టుకున్నారో, వారికి ఏమి కావాలో బాగా తెలుసు: ప్రజల్లో భయాందోళనలు కలిగించాలని కోరుకున్నారు, వారు వీలైనంత ఎక్కువ మంది పౌరుల ప్రాణాలు తీయాలని చూస్తున్నారు." మేయర్ ఒలెక్సాండర్ పేర్కొన్నారు.
కైరిలెంకో తన సోషల్ మీడియాలో కుప్పల తెప్పలుగా పడి ఉన్న బ్యాగులు, ఇతర వస్తువులు.. పక్కనే పడి ఉన్న మృతదేహాలను చూపించే ఫోటోను షేర్ చేశారు. ఫ్లాక్ జాకెట్లు ధరించిన సాయుధ పోలీసులు వారి పక్కన నిలబడ్డారు.
"అమానవీయమైన రష్యన్లు తమ పద్ధతులను మార్చుకోవడం లేదు. యుద్దభూమిలో ఎదురొడ్డి నిలబడే శక్తి లేకుండా, పౌర జనాభాను నాశనం చేస్తున్నారు" అని ఉక్రియాన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కామెంట్ చేశారు.
సిక్కుల ఓటు బ్యాంక్ కోసం కెనడా చిక్కుల్లో పడిందా? భారత్తో మైత్రిని కాదనుకుని ఉండగలదా?
కెనడా రాజకీయాల్ని సిక్కులే శాసిస్తున్నారా? అంత పవర్ వాళ్లకి ఎలా వచ్చింది?
India Vs Canada: ఇండియా కెనడా గొడవపడితే లక్షల కోట్లు ఆవిరే! మాటల యుద్ధం ముదిరితే ఇక అంతే
ఖలిస్థాన్ వివాదం భారత్ని కెనడాకి దూరం చేస్తుందా? ఇన్నాళ్ల మైత్రి ఇక ముగిసినట్టేనా?
Indian Medical Graduates: భారతీయ వైద్య విద్యార్థులు ఇక విదేశాల్లోనూ ప్రాక్టీస్ చెయ్యొచ్చు
Breaking News Live Telugu Updates: కడియం శ్రీహరికి జై కొట్టిన తాటికొండ రాజయ్య
Chandrababu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు రిమాండ్ ను పొడగింపు- పిటిషన్పై తీర్పులు మధ్యాహ్నానికి వాయిదా
వచ్చే నెలలో బీజేపీ ప్రచార హోరు, రంగంలోకి మోడీ, అమిత్ షా
అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించిన టీడీపీ- స్పీకర్ తీర్పుపై తీవ్ర విమర్శలు
/body>