అన్వేషించండి

Indonesia: ఇండోనేసియాలో భారీ హింస! ఫుట్ బాల్ స్టేడియంలో 127 మంది మృతి

‘‘స్టేడియంలో గొడవ, గందరగోళం నెలకొంది. 34 మంది స్టేడియంలో మరణించగా, మిగిలిన వారు ఆసుపత్రిలో మరణించారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు.’’ అని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.

ఇండోనేసియాలో ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కనీసం 127 మంది మరణించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మ్యాచ్‌లో ఓడిన జట్టు అభిమానులు ఆగ్రహంతో మైదానంలోకి రావడంతో ఈ హింస చెలరేగింది. ఇండోనేసియాలోని తూర్పు జావా ప్రావిన్స్‌లోని అరెమా ఎఫ్‌సి, పెర్సెబయా సురబయా మధ్య ఈ ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది. అరెమా ఎఫ్‌సీ ఓడిపోవడం చూసి ఆ జట్టుకు మద్దతు తెలిపిన అభిమానులు తట్టుకోలేకపోయారు. 

ఆ భారీ జనాన్ని అదుపు చేసేందుకు టియర్ గ్యాస్ షెల్స్ ను కూడా పోలీసులు ప్రయోగించారు. దీంతో స్టేడియంలో మరింత తొక్కిసలాట జరిగింది. AFP వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, తూర్పు జావా ప్రావిన్స్ పోలీసు చీఫ్, నికో అఫింటా మాట్లాడుతూ.. మ్యాచ్‌లో తమ జట్టు ఓడిపోవడాన్ని చూసి కొంతమంది ఫుట్‌బాల్ పిచ్ వైపు పరుగులు తీశారని, వారిని ఆపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పరిస్థితి మొత్తం అదుపుతప్పిందని అన్నారు.

‘‘స్టేడియంలో గొడవ, గందరగోళం నెలకొంది. 34 మంది స్టేడియంలో మరణించగా, మిగిలిన వారు ఆసుపత్రిలో మరణించారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు.’’ అని ఆయన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.

ఘటన పైన ఇండోనేషియా ఫుట్‌బాల్ అసోసియేషన్ (PSSI) శనివారం (అక్టోబరు 1) అర్థరాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేసింది. మొత్తం విషయాన్ని దర్యాప్తు చేయడానికి ఒక బృందాన్ని మలంగ్‌కు పంపినట్లు తెలిపింది. ఆ ప్రకటన ప్రకారం, ‘‘కంజ్రుహాన్ స్టేడియంలో అరేమా జట్టు అభిమానులు చేసిన దానికి PSSI చింతిస్తుంది. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెబుతున్నాం. PSSI వెంటనే దర్యాప్తు చేయడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. అది మలంగ్‌కు బయలుదేరింది. అల్లర్ల దృష్ట్యా ఫుట్‌బాల్ లీగ్ మ్యాచ్‌లను వారం రోజుల పాటు వాయిదా వేశారు. ఈ ఘటనలో 180 మంది గాయపడినట్లు సమాచారం. ఈ సీజన్‌లో అరేమా ఎఫ్‌సీపై నిషేధం విధించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jana Nayagan : విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - విడుదలకు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - విడుదలకు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
West Bengal: ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మద్య తీవ్రమైన వార్‌!
ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మద్య తీవ్రమైన వార్‌!
Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Google Chrome Hidden Tools : Chrome వాడుతున్నారా? ఈ హిడెన్ ఫీచర్‌లు మీకు తెలుసా?
Chrome వాడుతున్నారా? ఈ హిడెన్ ఫీచర్‌లు మీకు తెలుసా?

వీడియోలు

Hardik Pandya in Vijay Hazare Trophy | సెంచరీ చేసిన హార్దిక్
Tilak Varma Injured | తిలక్ వర్మకు గాయం ?
Sarfaraz Khan vs Abhishek Sharma | 6 బంతుల్లో 6 బౌండరీలు బాదిన సర్ఫరాజ్
Sanjay Manjrekar Comments on Virat Kohli | విరాట్ పై సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్
Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jana Nayagan : విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - విడుదలకు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - విడుదలకు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
West Bengal: ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మద్య తీవ్రమైన వార్‌!
ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మద్య తీవ్రమైన వార్‌!
Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Google Chrome Hidden Tools : Chrome వాడుతున్నారా? ఈ హిడెన్ ఫీచర్‌లు మీకు తెలుసా?
Chrome వాడుతున్నారా? ఈ హిడెన్ ఫీచర్‌లు మీకు తెలుసా?
Andhra Pradesh Weather Update: సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
KCR : మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
The Raja Saab OTT : 'ది రాజా సాబ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్! - ఆ ఛానల్‌లో చూడొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
'ది రాజా సాబ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్! - ఆ ఛానల్‌లో చూడొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
Embed widget