అన్వేషించండి

Pegasus : మోడీ సర్కార్‌పై మమతా సర్కార్ విచారణ..!?

పెగాసస్ స్పైవేర్ అంశంలో విచారణకు బెంగాల్ సర్కార్ నిర్ణయించింది. ఇద్దరు మాజీ న్యాయమూర్తులతో కమిటీని మమతా బెనర్జీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.


బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రభుత్వం " పెగాసస్ " నిఘా వ్యవహారంపై విచారణ జరిపించాలని నిర్ణయించారు. ప్రత్యేకంగా మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించిన మమతా బెనర్జీ ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకున్నారు. పెగాసస్‌పై విచారణకు ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీలో మాజీ న్యాయమూర్తులు ఉంటారు. పెగాసస్ వ్యవహారాన్ని  దర్యాప్తు చేయాలంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రమే అక్కర్లేదని... బెంగాల్‌కు చెందిన వ్యక్తులపైనా నిఘా పెట్టినట్లుగా తేలింది కాబట్టి... తమ పరిధిలో తము దర్యాప్తు చేస్తామని బెంగాల్ సర్కార్ చెబుతోంది. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సహా పీకే మరికొంతమంది బెంగాలీ నేతలపై కూడా...పెగాసస్ నిఘా పెట్టారని..  మీడియాలో ఆరోపణలు వచ్చాయి. వీటిపైన విచారణ జరపనున్నారు.
 
దేశంలో ప్రస్తుతం పెగాసస్ నిఘా వ్యవహారంపై రేగుతున్న దుమారం అంతా ఇంతా కాదు. అయితే కేంద్రం మాత్రం విచారణకు ఆదేశించే ఉద్దేశంలో లేదు. ఈ విషయం చాలా సూటిగానే చెబుతోంది. ప్రధానంగా కేంద్రంపైనే అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్న  సమయంలో కేంద్రం విచారణకు ఆదేశిస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. దీంతో కొంత మంది సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులపైనా పెగాసస్‌ను ప్రయోగించారన్న చర్చ జరుగుతోంది. దీంతో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. అయితే.. పిటిషన్లు ఇంకా విచారణకు రాలేదు. విచారణ జరిగి.. నిర్ణయం వచ్చే సరికి బాగా సమయం పట్టే అవకాశం ఉంది. 

ప్రభుత్వాలకు మాత్రమే పెగాసస్ సాఫ్ట్ వేర్ అమ్ముతామని.. అమ్మామని.. ఇందులో మరో మాట లేదని ఈ సాఫ్ట్ వేర్ సృష్టికర్త అయిన ఇజ్రాయెల్ సంస్థ చెబుతోంది. దీంతో ఇండియాలో ఎవరిపైనైనా పెగాసస్‌ను ప్రయోగించి ఉంటే.. ఖచ్చితంగా అది ప్రభుత్వమే అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలా కాకుండా ప్రైవేటు వ్యక్తులు.. అత్యంత ముఖ్యులైన వీఐపీలపై ఇలానిఘా పెట్టి ఉంటే దేశభద్రత ప్రమాదంలో పడినట్లవుతుంది. దీంతో బెంగాల్ ప్రభుత్వం చేయించబోతున్న దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెల్లడవుతాయన్నది ఆసక్తికరంంగా మారింది. 

అయితే ఈ  స్పై సాఫ్ట్‌వేర్‌ను పరిశీలించి.. ఎవరు తీసుకొచ్చారు.. ఎవరు ప్రయోగించారు.. అన్ని తెలుసుకోవడం అంత తేలికగా అయ్యే పని కాదు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం.. అంతకు మించి అన్నీ పరిశీలించగలిగే అధికారం కావాలి. చాలా అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. బెంగాల్ దర్యాప్తు బృందానికి కేంద్రం సహకరిస్తుందా అన్నది సందేహమే. అయితే ఈ విషయంలో ... నిజాలు బయటకు రావాలని దేశంలో ఎక్కువ మంది కోరుకుంటున్నారు. వ్యక్తిగత స్వేచ్చను ఎవరు హరించినా ప్రజలు అంగీకరించే అవకాశం ఉండదు. అందుకే బెంగాల్ సర్కార్ నిర్ణయానికి ఎక్కువ మంది మద్దతు లభిస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

IND VS SL 2nd Test Day 4 UPdates: సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!
సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. వరదల్లో 384 మంది గల్లంతు, అందులో 105 మంది భారతీయులు
నేపాల్‌లో జల ప్రళయం.. వరదల్లో 384 మంది గల్లంతు, అందులో 105 మంది భారతీయులు
Missing Fishermen Safe: గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం.. 23 రోజుల తరువాత ఆచూకీ లభ్యం
గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం.. 23 రోజుల తరువాత ఆచూకీ లభ్యం
Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతితో విషాదం
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతితో విషాదం

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. వరదల్లో 384 మంది గల్లంతు, అందులో 105 మంది భారతీయులు
నేపాల్‌లో జల ప్రళయం.. వరదల్లో 384 మంది గల్లంతు, అందులో 105 మంది భారతీయులు
Konda Murali Comments :సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
CM Chandrababu: ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
YS Jagan Press Meet Highlights:
"రైతు, బీసీ ఛాంపియన్స్ మేమే" వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
Irumudi : టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
Fake Korrameenu Fish Identification: మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?
మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?
Samantha Ruth Prabhu : ప్రెగ్నెన్సీతోనే సమంత జిమ్ వర్కౌట్స్ - షాకైన నెటిజన్స్... ఫోటోస్ చూశారా?
ప్రెగ్నెన్సీతోనే సమంత జిమ్ వర్కౌట్స్ - షాకైన నెటిజన్స్... ఫోటోస్ చూశారా?
Embed widget