WB By-Election Voting LIVE: ప్రశాంతంగా ముగిసిన ఉపఎన్నికల పోలింగ్.. అక్టోబర్ 3న ఫలితాలు
బంగాల్లో మూడు స్థానాల్లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. అయితే అందరి దృష్టి మమతా బెనర్జీ పోటీ చేస్తోన్న భవానీపుర్ స్థానంపైనే ఉంది. అక్టోబర్ 3న ఫలితాలు వెల్లడించనున్నారు.

Background
బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తోన్న భవానీపుర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. తెల్లవారుజామునే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు.
జాంగీపుర్, సంసేర్గంజ్ అసెంబ్లీ స్థానాలకు కూడా ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి ఓటమిపాలైన దీదీ ఈ ఉపఎన్నికలో భవానీపుర్ నుంచి పోటీ చేస్తున్నారు. దీదీకి పోటీగా భాజపా నుంచి న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్ బరిలో ఉన్నారు. అక్టోబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఒడిశాలోని పిపిలీ నియోజకవర్గంలో కూడా నేడు పోలింగ్ జరుగుతోంది.
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్..
బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్న భవానీపుర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నిక ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 53.32 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది.
భవానీపుర్లో ఘర్షణ..
భవానీపుర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భాజపా, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. భాజపా నేత కల్యాణ్ చౌబే కారును ఆందోళనకారులు ధ్వంసం చేశారు.
#WATCH | West Bengal: A scuffle broke out between BJP and TMC supporters in Bhabanipur assembly constituency, where voting for the by-poll is underway today. BJP leader Kalyan Chaubey's car was allegedly vandalised. pic.twitter.com/TBiPFdsWlI
— ANI (@ANI) September 30, 2021





















