అన్వేషించండి

G20 Summit: బిజీ షెడ్యూల్‌లో.. బైడెన్‌కు మోదీ ప్రైవేట్‌ డిన్నర్‌

G20 Summit: ఇరువురు నేతలు ద్వైపాక్షిక సమావేశాల అనంతరం మోదీ నివాసంలో విందు చేయనున్నట్లు సమాచారం. బిజీ షెడ్యూల్‌లోనూ మోదీ బైడెన్‌కు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.

జీ 20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో పలు దేశాధినేతలు ఈరోజు సాయంత్రం కల్లా దిల్లీకి చేరుకోనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భారత్‌కు బయలుదేరారు. ఈరోజు రాత్రి ఏడు గంటల కల్లా బైడెన్‌ దిల్లీకి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. బైడెన్‌ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత తొలిసారిగా భారత్‌ వస్తున్ఆరు. అయితే బైడెన్ ఇక్కడికి చేరుకోగానే నేరుగా లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లనున్నారని సంబంధిత వర్గాల సమాచారం. సదస్సు ప్రారంభానికి ముందు రోజే అంటే శుక్రవారం సాయంత్రమే మోదీ తన నివాసంలో జో బైడెన్‌కు ప్రైవేట్‌  డిన్నర్‌ ఏర్పాటు చేశారు. 

ఇరువురు నేతలు ద్వైపాక్షిక సమావేశాల అనంతరం మోదీ నివాసంలో విందు చేయనున్నట్లు సమాచారం. బిజీ షెడ్యూల్‌లోనూ మోదీ బైడెన్‌కు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. మూడు నెలల క్రితం ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు కూడా బైడెన్‌ అధ్యక్ష నివాసం వైట్‌హౌస్‌లో మోదీకి ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. నేటి సమావేశంలో బైడెన్‌, మోదీ ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా జీఈ జెట్‌ ఇంజిన్‌ ఒప్పందం, పౌర అణు సాంకేతికతపై అర్థవంతమైన చర్చలు జరగనున్నాయని, వీటిపై పురోగతి సాధించే అవకాశముందని భద్రతా సలహాదారు జేక్‌ సుల్లివన్‌ వెల్లడించినట్లు రాయిటర్స్‌ సంస్థ పేర్కొంది. జెట్‌ ఇంజిన్లకు సంబంధించిన స్వదేశీ సాంకేతికతను భారత్‌కు బదిలీ చేసేందుకు ఏప్రిల్‌లో జీఈ అంగీకరించింది. అలాగే ఇరువురు నేతలు క్లీన్‌ ఎనర్జీ, వాణిజ్యం, ఆధునిక సాంకేతికత, డిఫెన్స్‌ రంగంలో సహకారం, ప్రపంచం ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్లను ఎదుర్కోవడంలో ఇరు దేశాలు ఎలా దోహదరపడతాయో అనే అంశాలపై సమీక్షించే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 

అమెరికా నుంచి భారత్‌ బయలుదేరే ముందు బైడెన్‌ తన సోషల్‌ మీడియా ఖాతా ఎక్స్‌లో జీ 20 సదస్సుకు వెళ్తున్నట్లు పోస్ట్‌ చేశారు. అంతర్జాతీయ ఆర్థిక సహకారం తమ ప్రధానాంశమని, అమెరికన్ల ప్రాధాన్యతలపై పురోగతి సాధిండం మీద దృష్టి సారిస్తామని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాటిని తెలియజేస్తామని, అలాగే జీ 20 సదస్సు పట్ల తమ నిబద్ధతను చాటుతున్నామని ట్వీట్‌ చేశారు. 

దాదాపు 19 దేశాల నుంచి సమావేశాల కోసం దేశాధినేతలు, ప్రతినిధులు నేడు దేశ రాజధాని దిల్లీకి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి చాలా బిజీ షెడ్యూల్‌ ఉంది. పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. దాదాపుగా మొత్తం 15 రౌండ్ల చర్చలు జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈరోజు మోదీ అమెరికా అధికారులతో పాటు మారిషస్‌, బంగ్లాదేశ్‌ ప్రతినిధులతోనూ చర్చించనున్నారు. రేపు (సెప్టెంబర్ 9)యూకే, జపాన్‌, జర్మనీ, ఇటలీ నేతలతో సమావేశం కానున్నారు. ఇవాళ్టి సమావేశాల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో ప్రధాని భేటీ అవుతారు. ఇదే సమావేశంలో బంగ్లాదేశ్ ప్రధాని కూడా హాజరు కానున్నారు. సెప్టెంబర్ 10వ తేదీన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో లంచ్ మీటింగ్‌ షెడ్యూల్ చేశారు. అదే సమయంలో కెనడా దేశాధినేతలతో సమావేశం కానున్నారు.  ఆ తర్వాత కొమొరోస్, తుర్కియే (టర్కీ), యూఏఈ, దక్షిణ కొరియా, యురోపియన్ యూనియన్, బ్రెజిల్, నైజీరియా అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. యురోపియన్ యూనియన్ దేశాలకు చెందిన కీలక నేతలు G20 Summit కి హాజరు కానున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
US Shooting: వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
South Central Railway : ఇంటి నుంచే దేశం నలుమూలలకు పార్శిల్ పంపేయొచ్చు- కొత్త సర్వీస్ ప్రారంభించనున్న దక్షిణ మధ్య రైల్వే
ఇంటి నుంచే దేశం నలుమూలలకు పార్శిల్ పంపేయొచ్చు- కొత్త సర్వీస్ ప్రారంభించనున్న దక్షిణ మధ్య రైల్వే
India Wedding Season: 44 రోజుల్లో 46 లక్షల వివాహాలు... ఎక్కువ పెళ్లిళ్లు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయో తెలుసా?
44 రోజుల్లో 46 లక్షల వివాహాలు... ఎక్కువ పెళ్లిళ్లు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయో తెలుసా?
Advertisement

వీడియోలు

South Africa whitewashed India | రెండో టెస్ట్ ఓడిపోయిన టీమ్ ఇండియా
Iceland Cricket Tweet on Gautam Gambhir | గంభీర్‌ను ట్రోల్ చేసిన ఐస్‌లాండ్ క్రికెట్
Ashwin Tweet on Ind vs SA Test Match | వైరల్ అవుతున్న అశ్విన్ పోస్ట్
Rohit as ambassador of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్‌ 2026 అంబాసిడర్‌గా రోహిత్
India vs South Africa Test Highlights | విజ‌యం దిశ‌గా సౌతాఫ్రికా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
US Shooting: వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
South Central Railway : ఇంటి నుంచే దేశం నలుమూలలకు పార్శిల్ పంపేయొచ్చు- కొత్త సర్వీస్ ప్రారంభించనున్న దక్షిణ మధ్య రైల్వే
ఇంటి నుంచే దేశం నలుమూలలకు పార్శిల్ పంపేయొచ్చు- కొత్త సర్వీస్ ప్రారంభించనున్న దక్షిణ మధ్య రైల్వే
India Wedding Season: 44 రోజుల్లో 46 లక్షల వివాహాలు... ఎక్కువ పెళ్లిళ్లు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయో తెలుసా?
44 రోజుల్లో 46 లక్షల వివాహాలు... ఎక్కువ పెళ్లిళ్లు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయో తెలుసా?
Raju Weds Rambai : హార్ట్ టచింగ్ 'రాజు వెడ్స్ రాంబాయి' - ఈ థియేటర్లలో ఫ్రీగా చూడొచ్చు
హార్ట్ టచింగ్ 'రాజు వెడ్స్ రాంబాయి' - ఈ థియేటర్లలో ఫ్రీగా చూడొచ్చు
Obesity Warning Signs : ఊబకాయం హెచ్చరిక సంకేతాలు.. బరువు పెరగడం నుంచి నిద్రలేమి వరకు.. జాగ్రత్త!
ఊబకాయం హెచ్చరిక సంకేతాలు.. బరువు పెరగడం నుంచి నిద్రలేమి వరకు.. జాగ్రత్త!
Hong Kong Fire Accident: హాంగ్‌కాంగ్‌లో 7 అంతస్తుల భవనాల్లో భారీ అగ్నిప్రమాదం- 44 మంది మృతి, 300 మంది అదృశ్యం!
హాంగ్‌కాంగ్‌లో 7 అంతస్తుల భవనాల్లో భారీ అగ్నిప్రమాదం- 44 మంది మృతి, 300 మంది అదృశ్యం!
Thamma OTT: డిసెంబర్‌ మొదటి వారంలోకి ఓటీటీకి రష్మిక 'థామ'... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
డిసెంబర్‌ మొదటి వారంలోకి ఓటీటీకి రష్మిక 'థామ'... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget