అన్వేషించండి

Top 10 Headlines Today: భారత్ భవన్‌కు కేసీఆర్ శంకుస్థాపన - నేటి టాప్ 5 న్యూస్

నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

ఒడిశా ప్రమాదంలో ఏపీ వారంతా సేఫ్‌- మంత్రి అమర్‌నాథ్‌

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనాస్థలికి వెళ్లి  తెలుగువారిని కలిశామని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అలాగే క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్  సహా పలు ఆస్పత్రులకు పంపినట్లు వివరించారు. ఏపీకి చెందిన వారు కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో 309 మంది ఉన్నారని, అలాగే యశ్వంత్ పురా లో 33 మంది ఉండగా.. మొత్తంగా 342 మంది తెలుగు ప్రజలు ఉన్నట్లు గుర్తించారు. ఇంకా చదవండి

భారత్ భవన్‌కు కేసీఆర్ శంకుస్థాపన, ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా ఎక్స్‌లెన్స్‌, హెచ్ఆర్డీ కేంద్రం

దేశంలో ఏ రాజకీయ పార్టీకి కూడా లేని విధంగా.. బీఆర్ఎస్ పార్టీకి సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఈ మేరకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ శివారులోని కోకాపేటలో 11 ఎకరాల విస్తీర్ణంలో 15 అంతస్థుల్లో నిర్మించనున్న భారీ భవన నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేశారు. చండీహోమం, పుర్ణాహుతి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని, వివిధ రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. హైదరాబాద్ లో అత్యాధునిక సాంకేతిక హంగులతో మరో భారీ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మరే ఇతర రాజకీయ పార్టీలకు లేని విధంగా శిక్షణా సంస్థను ఏర్పాటు చేయనుంది. ఇంకా చదవండి

బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి రెడ్డికి భూకేటాయింపు రద్దు చేసిన హైకోర్టు!

బీఆర్ఎస్ ఎంపీ, హెటిరో ఛైర్మన్ పార్థసారధి రెడ్డికి చెందిన సాయి సింధు ఫౌండేషన్ కు భూ కేటాయింపును తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. ఈ పౌండేషన్ కు మేనేజింగ్ ట్రస్టీగా పార్థసాథి రెడ్డి ఉన్నారు. అయితే 2018 సంవత్సరంలో హైదరాబాద్ లోని ఖానామెట్ వద్ద క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం కోసం 15 ఎకరాల భూమిని ఆ ఫౌండేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందుకు సంబంధించిన జీఓను సవాల్‌ చేస్తూ... 2019లో హైకోర్టులో కొందరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రైట్ సొసైటీతో పాటు ఊర్మిళ, సురేష్ కుమార్... ఎంపీ పార్థ సారధికి భూమిని కేటాయించడంపై తమకు అభ్యంతరం ఉందంటూ పిల్ వేశారు. ఇంకా చదవండి

ఉపాధి హామీ కూలీగా మారిన మంత్రి ఎర్రబెల్లి - త్వరలోనే కూలీలకు పలుగు, పార పథకం

దేశవ్యాప్తంగా ఉన్న కూలీలకు ఏదో సాయం చేస్తామంటూ కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకాన్ని ఇప్పుడు పట్టించుకోవట్లేరని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రిఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మోదీ సర్కారు పెద్దగా పట్టించుకోవట్లేదని, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని ఆలోచిస్తోందని అన్నారు. ఈక్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున.. కూలీల శ్రేయస్సు కోరి, ఉపాధి హామీ కూలీలకు తట్ట, గడ్డపార, పార వంటి పనిముట్లను త్వరలో పంపిణీ చేయనున్నట్లు వివరించారు. ఆ దిశగా ఇప్పటికే ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు వివరించారు. వీటితో పాటు ఎర్రబెల్లి ట్రస్ట్ తరఫున ఉపాధి హామీ కూలీలకు.. స్టీల్ వాటర్ బాటిల్, లంచ్ క్యారియర్, ఆయా వస్తువులను తీసుకెళ్లే విధంగా ఓ మంచి బ్యాగుని పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇంకా చదవండి

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

ప్రకాశం జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణం వివాదం అధికార ప్రతిపక్షం మధ్య అగ్గి రాజేసింది. టీడీపీ, వైసీపీ నేతల పోటాపోటీ కార్యక్రమాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నాయుడుపాలెంలో ఉప్పునిప్పులా మారింది పరిస్థితి. టీడీపీ కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ నేతుల ఆరోపణలు చేశారు. దీనిపై మండిపడ్డ టీడీపీ నేతలు ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య మాట యుద్ధం నడిచింది. ఇంకా చదవండి

టాప్ హెడ్ లైన్స్

TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
US Iran War: ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Embed widget