అన్వేషించండి

Crisis in TMC - Mamatha's resilience test | ఓటమిని మించిన ప్రమాదంలో మమత పార్టీ

టీఎంసీ కోటకు బీటలుఈ సంక్షోభం దీదీ ప్రస్థానానికి ముగింపేనా ఓటమిని మించిన ప్రమాదంలో మమత ఉన్నారా

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మమతా బెనర్జీ సొంత పార్టీ నుండే పెద్ద సంక్షోభం ఎదుర్కొంటున్నారు.
  • గతంలోనూ అనేక సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొని విజయాలు సాధించారు.
  • దాదాపు 60 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు పార్టీ భవిష్యత్తుకు ప్రమాదం.
  • ఇది దీదీ ప్రస్థానానికి అంతమా లేక మరొక పునరాగమనమా?
  • టీఎంసీ కోటకు బీటలు
  • ఈ సంక్షోభం దీదీ ప్రస్థానానికి ముగింపేనా 
  • ఓటమిని మించిన ప్రమాదంలో మమత ఉన్నారా

రాజకీయాల్లో సొంతవాళ్ల తిరుగుబాటును ఎదుర్కోవడం ప్రత్యర్ధులను ఎదుర్కోవడంకన్నా కష్టం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన మమతా బెనర్జీ ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. మూడు దశాబ్దాలుగా బెంగాల్ రాజకీయాల్లో అప్రతిహత శక్తిగా నిలిచిన ఆమెకు ఈసారి సవాలు సొంత పార్టీ నుంచే వస్తోంది. ఏకంగా పార్టీని నిట్టనిలువునా చీల్చేంతగా పెరుగుతోంది.

ఇప్పటివరకు మమతా బెనర్జీ ఎదుర్కొన్న ప్రతి రాజకీయ సంక్షోభంలో ప్రత్యర్థి స్పష్టం. ఒకప్పుడు కమ్యూనిస్టులు, తర్వాత బీజేపీ. కానీ ఇప్పుడు ఆమె ఎదుట నిలబడిన వారు ఆమె స్వయంగా పెంచి పోషించిన నాయకులే. అందుకే 2026 సంక్షోభం మమత రాజకీయ జీవితంలో ఎదుర్కోబోయే అతిపెద్ద సవాలు కానుంది. 

వీధి పోరాటాల నుంచి బెంగాల్ సీఎం దాకా పోరాడి గెలిచి...

మమతా బెనర్జీ రాజకీయ జీవితం భారత రాజకీయాల్లో అరుదైన కథ. కోల్‌కతాలోని సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆమెకు రాజకీయ వారసత్వం లేదు. ఆర్థిక బలం లేదు. ఉన్నదల్లా అసాధారణమైన పోరాట పటిమ మాత్రమే.

కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మమత, ఓ దశలో ఆపార్టీ సీనియర్లతోనే విభేదించి పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆ గొడవలో మమతపై బౌతిక దాడికూడా జరిగింది. కానీ దేనికీ వెరవకుండా కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా ఎదిగారు. ప్రత్యక్ష ఉద్యమాలకు ప్రతీకగా మారారు. కమ్యూనిస్టు పాలనకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతూ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

1998లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినప్పుడు చాలామంది ఆమెను తేలిగ్గా తీసిపారేశారు. ప్రతిపక్షమంటే కాంగ్రెస్ కాదు తృణమూల్ కాంగ్రెస్ అనేలా ఎదిగారు . చివరికి 2011లో 34 ఏళ్ల కమ్యూనిస్టు పాలనకు ముగింపు పలికి చరిత్ర సృష్టించారు. అది కేవలం అధికార మార్పు కాదు. బెంగాల్ రాజకీయాల్లో ఓ సంచలన పరిణామం.

 'దీదీ' అంటే బ్రాండ్ ... పార్టీని మించి.

మమత విజయానికి ప్రధాన కారణం ఆమె వ్యక్తిత్వం. కన్యాశ్రీ, విద్యార్థి స్కాలర్‌షిప్‌లు, ఆరోగ్య పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో ఆమెపై ప్రత్యేకమైన అనుబంధాన్ని సృష్టించాయి. ప్రజలు తృణమూల్ కాంగ్రెస్‌ను కాకుండా "దీదీ"ని విశ్వసించారు. అదే సమయంలో పార్టీ నిర్మాణం కూడా మమత చుట్టూనే తిరిగింది. నిర్ణయాలు, వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, రాజకీయ దిశ—అన్నీ దీదీ నే కేంద్రంగా పనిచేసాయి.ఈ విధానం అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి బలంగా పనిచేసింది. ఇప్పుడు ఆమె నాయకత్వానకీ, నిర్ణయాధికారానకీ అదే సవాలుగా మారింది. వారసుడు అభిషేక్ బెనర్జీకి శాపంగా మారింది. 

గతంలోనూ మమతను పనైపోయింది అన్నారు... 

మమత రాజకీయ జీవితంలో సంక్షోభాలు కొత్తవి కావు. విధ్యార్ధినాయకురాలిగా రాజకీయ ప్రవేశం చేసినప్పటినుంచీ ప్రతీ స్ధాయిలోనూ ఇదే ఆమెకు చివరి ఘట్టం అన్నంత పెద్ద సవాళ్లు ఎదురయ్యాయి. ప్రతీ సారీ ధైర్యగా ఎదుర్కొన్నారు. ప్రతీ సారీ మరో మెట్టు ఎదిగారు. 

సింగూర్ – నందిగ్రామ్ ఉద్యమాల సమయంలో మమత మరీ పెట్టుబడులకు వ్యతిరేకంగాపోతున్నారు. కమ్యూనిస్టులే పరిశ్రమలను ప్రోత్సహిస్తుంటే భూములు, నిర్వాసితులు అనే నినాదం పనిచేయదు .. వ్యతిరేకత వస్తుందన్నారు. కానీ ఆపోరాటంతోనే కమ్యూనిస్టులను మట్టికరిపించారు. 
నందిగ్రామ్ పరాజయం – 2021 : తన రాజకీయ ప్రతిష్టకు ప్రతీకగా మారిన నందిగ్రామ్‌లో సువేందు అధికారికి ఓడిపోయినప్పుడు మమత రాజకీయంగా బలహీనపడతారని విశ్లేషణలు వచ్చాయి. కానీ అదే ఎన్నికల్లో తృణమూల్ 200కు పైగా స్థానాలు గెలుచుకుని అధికారాన్ని నిలబెట్టుకుంది. ఓటమిని విజయంగా మార్చుకోవడంలో మమత మరోసారి సత్తా చాటారు.

ఆర్జీ ఖర్ ఆస్పత్రి ఘటన : 2024లో జరిగిన వైద్య విద్యార్థిని హత్య కేసు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసింది. భారీ నిరసనలు జరిగాయి. అయినప్పటికీ మమత రాజకీయంగా నిలబడగలిగారు. అందుకే ఆమె రాజకీయ ప్రస్ధానాని దగ్గరగాచూసిన వాళ్లు చెబుతారు.. సవాళ్లంటే మమతకు మరో మెట్టు అని.

కానీ 2026  అతి పెద్ద  ఛాలెంజ్.. ?

ఈసారి మమత ఎదుర్కొంటున్న సమస్య బయట శత్రువు కాదు.. పార్టీలో అంతర్గతంగా ఉన్న వ్యక్తులే.. గతంలో సువేందు అధికారి తనను ఎదిరించిప్పుడు, బీజేపీ 2021లోనే తన రాజకీయ పతనానికి అన్ని యత్నాలూ చేసినప్పుడు ఎదురొడ్డి నిలిచారు. కానీ ఈసారి సమస్య అత్యంత పెద్దది. పార్టీ ఎమ్మెల్యేలలో దాదాపు 60 మంది తిరుగుబాటు  చేయడం బెంగాల్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఏకంగా పార్టీ మోత్తాన్నే చీల్చేంతగా.. అసలు పార్టీనే మాది అనేంత పెద్దది. ఇది కేవలం నాయకత్వంపై అసంతృప్తి మాత్రమే కాదు. ఇది పార్టీ భవిష్యత్తుపై అనిశ్చితి. ఏడు పదులు దాటిన ఓ రాజకీయ యోధురాలి పోరాట పఠమకు మరో పరీక్ష. 

మరి ఈసారి తట్టుకుని నిలబడగలదా ?

దీనికి నిర్ధిష్ట సమాధానం చెప్పడు కష్టం.  కానీ బెంగాల్ రాజకీయాల్లో భావోద్వేగాలు, ప్రాంతీయ భావం, వ్యక్తిత్వ రాజకీయాలు ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ మూడు అంశాల్లోనూ మమత ఇప్పటికీ తిరుగులేని నాయకురాలే. బీజేపీ ప్రభుత్వం ప్రజల్లో అసంతృప్తిని కలిగించే నిర్ణయాలు తీసుకుంటే, ప్రతిపక్ష నాయకురాలిగా మమతకు మళ్లీ అవకాశాలు రావచ్చు. మైనారిటీల మద్దతు ఎప్పటికీ మమతకే అదే సమయంలో వయసు, పార్టీ విభేదాలు, అవినీతి ఆరోపణలు, నాయకత్వంపై ప్రశ్నలు ఆమెకు ప్రతికూలంగా మారే అవకాశం కూడా ఉంది.

అందుకే బెంగాల్ రాజకీయాలను గమనిస్తున్న ప్రతి ఒక్కరి మదిలో ఒకే ప్రశ్న వినిపిస్తోంది— ఇది దీదీ రాజకీయ ప్రస్థానానికి అస్తమయమా? లేక మరోసారి ఆమె పునరాగమనానికి ముందు నిశ్శబ్దమా? 

Frequently Asked Questions

ప్రస్తుతం మమతా బెనర్జీ ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు ఏమిటి?

ఆమె సొంత పార్టీలోనే నాయకుల తిరుగుబాటును ఎదుర్కొంటున్నారు. దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం ఆమె రాజకీయ జీవితంలో అతిపెద్ద సవాలుగా మారింది.

మమతా బెనర్జీ రాజకీయాల్లోకి ఎలా ప్రవేశించి, ముఖ్యమంత్రి అయ్యారు?

ఆమె కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, 1998లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 2011లో 34 ఏళ్ల కమ్యూనిస్టు పాలనకు ముగింపు పలికి ముఖ్యమంత్రి అయ్యారు.

మమత గతంలో ఎదుర్కొన్న సవాళ్లకు, ప్రస్తుత సంక్షోభానికి మధ్య తేడా ఏమిటి?

గతంలో ఆమె ప్రత్యర్థులతో (కమ్యూనిస్టులు, బీజేపీ) పోరాడారు. కానీ ఇప్పుడు ఆమె స్వయంగా పెంచి పోషించిన నాయకులే ఆమెకు సవాలుగా మారారు, ఇది అంతర్గత తిరుగుబాటు.

మమతా బెనర్జీ విజయానికి ప్రధాన కారణం ఏమిటి?

ఆమె వ్యక్తిత్వం, సంక్షేమ పథకాలు 'దీదీ'గా ప్రజల్లో ప్రత్యేకమైన అనుబంధాన్ని సృష్టించాయి. పార్టీ నిర్మాణం ఆమె చుట్టూనే తిరగడం కూడా ఆమె విజయానికి ప్రధాన కారణం.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dhanush Political Entry: విజయ్ బాటలో ధనుష్ ? తమిళ రాజకీయాల్లోకి మరో హీరో.. 2031 లక్ష్యంగా కామ్‌గా స్క్రిప్ట్!
విజయ్ బాటలో ధనుష్ ? తమిళ రాజకీయాల్లోకి మరో హీరో.. 2031 లక్ష్యంగా కామ్‌గా స్క్రిప్ట్!
Hyderabad Crime News: మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Embed widget