అన్వేషించండి

PAC Meeting: లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌- తెలంగాణ కాంగ్రెస్‌ నేతల కీలక సమావేశం

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. గాంధీభవన్‌లో సీఎం అధ్యక్షతన ఏర్పాటు చేసిన పీఏసీ మీటింగ్‌కు పార్టీ సీనియర్లు హాజరుకాబోతున్నారు.

Telangana Congress Meeting: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టాక... తొలిసారి పార్టీ సమావేశం నిర్వహిస్తోంది. గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్  అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న తొలి సమావేశం కావడంతో ఈ మీటింగ్‌పై ఆసక్తి రేగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన  జరగనున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావ్‌ థాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్‌  చౌదరి, విశ్వనాథ్‌తోపాటు పార్టీ సీనియర్‌ నేతలు ఈ సమావేశానికి హాజరుకాబోతున్నారు.

ఈ సమావేశంలో ప్రధానంగా... డీసీసీల నియామయంపై చర్చించబోతున్నారు. అభ్యర్థుల ఖరారు సమయంలో కొంత మంది డీసీసీలు పార్టీకి రాజీనామాలు చేశారు. దీంతో  ఆయా స్థానాల్లో డీసీసీల నియామకాలు చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతోపాటు పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలకు  సన్మానం చేయాలన్న ఆలోచనలో ఉంది కాంగ్రెస్‌ పార్టీ. ఈ సన్మాన సభకు సంబంధించిన ఏర్పాట్లపై కూడా ఈ మీటింగ్‌లో చర్చించబోతున్నారు. సన్మాన సభ ఎప్పుడు  పెట్టాలి.. ఎక్కడ పెట్టాలి అనే విషయాలపై చర్చించనున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి సహకరించిన పార్టీ అధ్యక్షులు, నాయకులు అందరికీ కూడా ఈ సమావేశంలో  ధన్యవాదాలు తెలపబోతున్నారు. 

అంతేకాకుండా... పార్టీలోని కొందరు సీనియర్‌ నేతలు తమ టికెట్లను త్యాగం చేశారు. అలాంటి వారికి ఎమ్మెల్సీ వంటి పదవులు ఇస్తామని ఎన్నికల సమయంలోనే రేవంత్‌రెడ్డి  భరోసా ఇచ్చారు. ఆ అంశంపై కూడా పీఏసీ సమావేశంలో చర్చించబోతున్నారు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై కూడా సమాలోచనలు చేయనున్నారు. టికెట్‌ ఆశించి దక్కని  వారికి నామినేషన్‌ పోస్టులు ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శలు, కార్యదర్శల నియామకాలు కూడా త్వరలోనే ఉంటాయని చర్చ జరుగుతోంది. దీనికి  సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. 

పార్టీ-ప్రభుత్వం మధ్య అనుసంధానం అనే ప్రధానాంశంపై కూడా పీఏసీలో చర్చకు రానుంది. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు.. దానికి సంబంధించిన  వ్యవహారాలన్నింటినీ కూడా పీఏసీలో చర్చించబోతున్నారు. పార్లమెంట్‌ ఎన్నికలు కూడా దగ్గరలోనే ఉన్నందున... ఈ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహంతో  ముందుకు వెళ్లాలి అనే అంశాలపై కూడా సమాలోచనలు చేయనున్నారు. ఈనెల 28న కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ఉన్నందున... రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాల  నిర్వహణపై కూడా పీఏసీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget