అన్వేషించండి

వైరల్ వీడియో: మంత్రి సంజయ్ షిర్సాట్ ఇంట్లో నగదు కట్టలు.. హోటల్ కొనుగోలుపై విచారణ!

Maharastra: మహారాష్ట్ర మంత్రివర్గంలో శివసేన తరపున మంత్రిగా ఉన్న సంజయ్ పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. డబ్బు కట్టలతో ఉన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Sanjay Shirsat video :మహారాష్ట్రలోని శివసేన (షిండే వర్గం) నాయకుడు, సామాజిక న్యాయ శాఖ మంత్రి సంజయ్ షిర్సాట్‌కు సంబంధించిన ఒక వీడియో  సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో షిర్సాట్ తన గదిలో ఒక బ్యాగ్ పక్కన కూర్చుని ఉండగా, ఆ బ్యాగ్‌లో నగదు కట్టలు కనిపిస్తున్నాయి.  షిర్సాట్ ,  అతని కుమారుడు సిద్ధాంత్ షిర్సాట్‌లు చత్రపతి సంభాజీనగర్‌లోని విట్స్ హోటల్‌ను మార్కెట్ విలువ కంటే తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఆరోపణలపై కూడా విచారణ జరుగుతోంది. హోటల్ మార్కెట్ విలువ రూ. 120 కోట్ల ఉంటే  రూ. 65 కోట్లకు కొనుగోలు చేశారు.  ఈ ఘటనలు మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చను రేకెత్తించాయి.  
 
సంజయ్ షిర్సాట్ వీడియో  నిజమేనని అంగీకరించారు.  కానీ ఇది ఒక "కుట్ర" అని పేర్కొన్నారు. పర్యటన నుంచి తిరిగి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఎవరో ఈ వీడియో తీశారు. బ్యాగ్‌లో ఏముందో తనకు తెలియదని మంత్రి చెబుతున్నారు.  ఈ వీడియోను రాజకీయంగా ప్రేరేపితమైనదని ఆరోపిస్తున్నారు.  శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ ఈ వీడియోను షేర్ చేశారు.  ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై విమర్శలు చేశారు. 

చత్రపతి సంభాజీనగర్‌లోని విట్స్ హోటల్‌ను సంజయ్ షిర్సాట్ కుమారుడు సిద్ధాంత్ షిర్సాట్ యాజమాన్యంలోని "ఎం/ఎస్ సిద్ధాంత్ మెటీరియల్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ సప్లై" కంపెనీ రూ. 65 కోట్లకు టెండర్ ద్వారా గెలుచుకుంది. అయితే, ఈ హోటల్ మార్కెట్ విలువ రూ. 120 కోట్ల నుంచి రూ. 150 కోట్ల వరకు ఉంటుందని విపక్ష నాయకుడు అంబదాస్ దాన్వే ఆరోపించారు.  ఈ టెండర్ ప్రక్రియలో అవినీతి మరియు కార్టెలైజేషన్ జరిగిందని ఆరోపించారు. సిద్ధాంత్ కంపెనీ 2024లో ఏర్పాటైంది.  టెండర్‌కు అర్హత కోసం అవసరమైన మూడు సంవత్సరాల ఆదాయపు పన్ను రిటర్న్‌లు లేవని ఆయన పేర్కొన్నారు .

 హోటల్ విలువ 2018లో రూ. 75.92 కోట్లుగా నిర్ణయించారు.  2025లో దాని విలువ రూ. 150 కోట్లుగా ఉందని, అయినప్పటికీ 2018 రేట్ల ఆధారంగా టెండర్ జరిగిందని దాన్వే విమర్శించారు   సిద్ధాంత్ షిర్సాట్ కు ఆర్థిక సామర్థ్యం లేదని అంటున్నారు.  షిర్సాట్ 2024 ఎన్నికల అఫిడవిట్‌లో తన కుమారుడు ఎలాంటి ఆస్తులు కలిగి లేడని పేర్కొన్నారు.  సంజయ్ షిర్సాట్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు, టెండర్ ప్రక్రియ కోర్టు ఆదేశాల మేరకు జరిగిందని, ఆరు సార్లు టెండర్ విఫలమైన తర్వాత సిద్ధాంత్ కంపెనీ పాల్గొందని చెప్పారు.  మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జూలై 7, 2025న ఈ టెండర్ ప్రక్రియలో అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. టెండర్ రద్దు చేశారు. 

సంజయ్ షిర్సాట్ 2019 ఎన్నికలలో రూ. 3.3 కోట్ల ఆస్తులను ప్రకటించగా, 2024 ఎన్నికలలో ఇది రూ. 35 కోట్లకు పెరిగింది, దీనిలో రూ. 44.8 లక్షల నగదు, రూ. 26.5 కోట్ల బ్యాంక్ రుణాలు ఉన్నాయి. ఈ ఆస్తులలో రూ. 4.4 కోట్ల విలువైన వ్యవసాయ భూమి, ముంబై,  సంభాజీనగర్‌లో రూ. 4.7 కోట్ల విలువైన ఫ్లాట్‌లు ఉన్నాయి. ఈ ఆస్తుల పెరుగుదలపై వివరణ కోసం ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ జూలై 2025లో నోటీసు జారీ చేసింది.  సంజయ్ "డబ్బు సంపాదించడం సులభం, కానీ ఖర్చు చేయడం కష్టం" అని ఒక కార్యక్రమంలో వ్యాఖ్యానించారు, ఇది వైరల్ అయింది.  షిర్సాట్ మొదట డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే కుమారుడు ష్రీకాంత్ షిండేకు కూడా ఇన్‌కమ్ టాక్స్ నోటీసు వచ్చినట్లు చెప్పారు, కానీ తర్వాత ఈ వ్యాఖ్యను ఉపసంహరించుకున్నారు.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Goa Fire Accident: గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
Tirupati Crime News: విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి, గర్భం దాల్చిన బాధితురాలు.. తిరుపతిలో దారుణం
విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి, గర్భం దాల్చిన బాధితురాలు.. తిరుపతిలో దారుణం
Indigo Show Cause Notice: ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
Savitri : 'మహానటి' సావిత్రి... పాత్ర తప్ప ఆమె కనిపించేవారు కాదు - మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
'మహానటి' సావిత్రి... పాత్ర తప్ప ఆమె కనిపించేవారు కాదు - మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

వీడియోలు

Yashasvi Jaiswal Century vs SA | వన్డేల్లోనూ ప్రూవ్ చేసుకున్న యశస్వి జైశ్వాల్ | ABP Desam
Rohit Sharma Virat Kohli Comebacks | బీసీసీఐ సెలెక్టర్లుకు, కోచ్ గంభీర్ కి సౌండ్ ఆఫ్ చేసిన రోహిత్, కోహ్లీ | ABP Desam
Virat Kohli vs Cornad Grovel Row | నోటి దురదతో వాగాడు...కింగ్ బ్యాట్ తో బాదించుకున్నాడు | ABP Desam
Virat kohli No Look six vs SA | తనలోని బీస్ట్ ను మళ్లీ బయటకు తీస్తున్న విరాట్ | ABP Desam
Ind vs SA 3rd ODI Highlights | సెంచరీతో సత్తా చాటిన జైశ్వాల్..సిరీస్ కొట్టేసిన భారత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Goa Fire Accident: గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
Tirupati Crime News: విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి, గర్భం దాల్చిన బాధితురాలు.. తిరుపతిలో దారుణం
విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి, గర్భం దాల్చిన బాధితురాలు.. తిరుపతిలో దారుణం
Indigo Show Cause Notice: ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
Savitri : 'మహానటి' సావిత్రి... పాత్ర తప్ప ఆమె కనిపించేవారు కాదు - మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
'మహానటి' సావిత్రి... పాత్ర తప్ప ఆమె కనిపించేవారు కాదు - మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
Telangana Rising Global Summit Agenda: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు.. హాజరయ్యే సినీ, క్రీడా ప్రముఖులు వీరే
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు.. హాజరయ్యే సినీ, క్రీడా ప్రముఖులు వీరే
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
Ind vs SA 3rd ODI Highlights: జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
భారత్‌లో అతి చవకైన, అత్యధిక మైలేజ్ ఇచ్చే బైక్స్.. 800 Km రేంజ్, లిస్ట్ చూశారా
భారత్‌లో అతి చవకైన, అత్యధిక మైలేజ్ ఇచ్చే బైక్స్.. 800 Km రేంజ్, లిస్ట్ చూశారా
Embed widget