అన్వేషించండి

Bangladesh: బంగ్లాదేశ్‌ సంక్షోభం వెనక అమెరికా హస్తం, షేక్ హసీనా స్పీచ్‌లో సంచలన విషయాలు

Sheikh Hasina: బంగ్లాదేశ్‌ అల్లర్ల వెనక అమెరికా హస్తం ఉందని షేక్ హసీనా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె రాసుకున్న స్పీచ్‌లో అగ్రరాజ్యంపై విరుచుకు పడ్డారు.

Bangladesh Crisis: ప్రధాని పదవికి రాజీనామా చేయక ముందు షేక్ హసీనా బంగ్లాదేశ్ పౌరులను ఉద్దేశించి ఓ ప్రసంగం చేయాలనుకున్నారు. స్పీచ్ రెడీ కూడా చేసుకున్నారు. కానీ...అంతలోనే ఆందోళనకారులు ఒక్కసారిగా ముట్టడి చేయడం వల్ల అప్పటికప్పుడు వెంటనే ఇండియాకి బయల్దేరి వచ్చారు. అయితే...ఈ స్పీచ్‌లోని అంశాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టిస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో ఈ సంక్షోభం వెనక అమెరికా హస్తం ఉందని ఆరోపించారు షేక్ హసీనా. ఇదే విషయాన్ని తన ప్రసంగం ద్వారా అందరికీ చెప్పాలనుకున్నారు. కానీ ఆ అవకాశం దక్కలేదు. ఈ స్పీచ్‌ కాపీలోని అంశాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. సెయింట్ మార్టిన్ ఐల్యాండ్‌ని ( Saint Martin Island) అమెరికాకి అప్పగించి ఉంటే బంగ్లాదేశ్‌లో ఇదంతా జరిగేదే కాదని అందులో పేర్కొన్నారు షేక్ హసీనా. అంతే కాదు. బే ఆఫ్ బెంగాల్‌పై అమెరికా ఆధిపత్యాన్ని ఒప్పుకుని ఉంటే ఈ సంక్షోభం తలెత్తేది కాదని స్పష్టం చేశారు. అమెరికా కారణంగానే ఇంత విధ్వంసం జరిగిందని తేల్చి చెప్పారు. విద్యార్థుల శవాలతో రాజకీయాలు చేయాలని చూశారని మండి పడ్డారు. 

"ఇంత మంది చనిపోతుంటే చూడలేక నేను ప్రధాని పదవికి రాజీనామా చేశాను. విద్యార్థుల శవాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలని చూశారు. కానీ..నేను అదంతా జరగనివ్వలేదు. అందుకే వెంటనే పదవి నుంచి తప్పుకున్నాను. ఒకవేళ సెయింట్ మార్టిన్ ఐల్యాండ్‌ సార్వభౌమాధికారాన్ని అమెరికాకి అప్పగించి తలొంచి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. బే ఆఫ్ బెంగాల్‌పై అమెరికా ఆధిపత్యాన్ని అడ్డుకున్నందుకే ఇంత సంక్షోభం సృష్టించారు. ఇలాంటి అతివాదులు ఏవేవో చెప్పి ఉసిగొల్పుతూనే ఉంటారు. మీరు మాత్రం ఆ వలలో పడొద్దు"

- షేక్ హసీనా స్పీచ్‌లోని అంశాలు

బంగ్లాదేశ్‌కి దక్షిణాన బే ఆఫ్ బెంగాల్‌కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది సెయింట్ మార్టిన్ ఐల్యాండ్. దీనిపై అమెరికా ఆధిపత్యం చెలాయించాలని చూసిందని, అందుకు ఒప్పుకోలేదనే ఇంత విధ్వంసం సృష్టించిందని షేక్ హసీనా ఆరోపించారు. ఇంకా తను అక్కడే ఉండి ఉంటే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి ఉండే వాళ్లని, ఆ మారణహోమాన్ని చూడలేకే రాజీనామా చేశానని ఆ స్పీచ్‌లో వివరించారు. తన పార్టీ ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని మళ్లీ బలం పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 

"దయచేసి మీరు విశ్వాసం కోల్పోవద్దు. నేను తప్పకుండా తిరిగి వస్తాను. నేను ప్రస్తుతానికి ఓడిపోయి ఉండొచ్చు. కానీ బంగ్లాదేశ్ మాత్రం గెలిచింది. ఈ ప్రజల కోసమే నా నాన్న, కుటుంబం ప్రాణాలు అర్పించింది"

- షేక్ హసీనా

దేశవ్యాప్తంగా అల్లర్లు ఉద్ధృతం కావడం వల్ల ఆగస్టు 5వ తేదీన షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. హుటాహుటిన అక్కడి నుంచి భారత్‌కి వచ్చారు. మోదీ సర్కార్ ఆమెకి ఆశ్రయం ఇచ్చేందుకు అంగీకరించలేదు. ప్రస్తుతానికి ఇండియాలోనే ఉన్న ఆమె యూకే, అమెరికాకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ..ఈ రెండు దేశాలూ ఆమెపై ఆంక్షలు విధించాయి. ఫలితంగా ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. అయితే...ఆమె కొడుకు సాజీబ్ మాత్రం త్వరలోనే మళ్లీ బంగ్లాదేశ్‌కి వెళ్లిపోతారని చెబుతున్నారు. 

Also Read: Bangladesh: బంగ్లాదేశ్‌లో లక్షలాది మంది హిందువుల ర్యాలీ, దాడులను నిరసిస్తూ రోడ్లపై నినాదాలు


 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
US Fed Rates Cut: అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Embed widget