News
News
వీడియోలు ఆటలు
X

New Parliament Building: మీ అహంకారంతో కాదు రాజ్యాంగ విలువలతో పార్లమెంట్ తయారైంది - రాహుల్ ఫైర్

New Parliament Building: పార్లమెంట్ ప్రారంభోత్సవ విషయంలో రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

FOLLOW US: 
Share:

New Parliament Building: 

రాహుల్ గాంధీ ట్వీట్ 

కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరు కావడం లేదని ఇప్పటికే విపక్షాలు స్పష్టం చేశాయి. కాంగ్రెస్ సహా మొత్తం 19 పార్టీలు ఈ మేరకు లేఖ కూడా రాశాయి. దీనిపై కేంద్రమంత్రి అమిత్‌షాతో పాటు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా స్పందించారు. దీనిపై రాజకీయాలు చేయొద్దని అన్నారు. అయితే..అటు విపక్షాలు మాత్రం బీజేపీపై మండి పడుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని పక్కన పెట్టి ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌ని ప్రారంభించడమేంటని ప్రశ్నిస్తున్నాయి. ఈ వివాదంపై రాహుల్ గాంధీ స్పందించారు. ట్విటర్ వేదికగా బీజేపీపై మండి పడ్డారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా జరిపించకపోవడం ఆమెకు అవమానకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"భారత రాజ్యాంగంలోనే అత్యున్నత పదవి రాష్ట్రపతి. ఆ హోదాలో ఉన్న వ్యక్తి చేత పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించకపోవడం ఆ పదవిని కించపరిచినట్టే అవుతుంది. పార్లమెంట్‌ అనేది మీ అహంకారంతో కాదు, రాజ్యాంగ విలువలతో తయారవుతుంది"

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత 

 

ఈ కార్యక్రమాన్ని బైకాట్ చేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించిన కాసేపటికే రాహుల్ గాంధీ ఈ ట్వీట్ చేశారు. మొత్తం 19 పార్టీలు ఒకే మాటపై ఉన్నాయి. "పార్లమెంట్‌లో ప్రజాస్వామ్యానికి చోటులేదు. అందుకే మాకు ఆ బిల్డింగ్‌లో ఎలాంటి విలువలూ కనిపించడం లేదు" అని  తేల్చి చెబుతున్నాయి. కాంగ్రెస్ నిర్ణయాన్ని ప్రకటిస్తూ కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

"కాంగ్రెస్ పార్టీతో సైద్ధాంతికంగా కలిసొచ్చే పార్టీలన్నింటితోనూ చర్చించాకే బైకాట్ చేయాలని నిర్ణయించుకున్నాం. విపక్షాలన్నీ ఈ విషయంలో ఒక్కటవడం చాలా సంతోషంగా ఉంది"

- కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని పూర్తిగా పక్కన పెట్టి ప్రధాని మోదీ ఒక్కరే పార్లమెంట్‌ని ఆవిష్కరించాలనుకోవడం చాలా అవమానకరమని.. ఇది ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చి పెడుతుందని విపక్షాలు గట్టిగా విమర్శిస్తున్నాయి.  

ఈ నెల 28వ తేదీన జరగనున్న కొత్త పార్లమెంట్ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యే ప్రసక్తే లేదని విపక్షాలు తేల్చి చెప్పాయి. ఇప్పటికే 19 పార్టీలు లేఖ రాశాయి. ఈ నిర్ణయంపై కేంద్రహోం మంత్రి అమిత్‌ షా స్పందించారు. దీన్ని రాజకీయం చేయొద్దని అన్నారు. ఈ పార్లమెంట్ భవనం ప్రధాని మోదీ దూరదృష్టికి నిదర్శనం అని వెల్లడించారు. 

"ఈ కొత్త పార్లమెంట్ భవనం ప్రధాని మోదీ ముందుచూపుకి నిదర్శనం. మే 28వ తేదీన ప్రధాని ఈ భవనాన్ని దేశానికి అంకితం చేయనున్నారు. దాదాపు 60 వేల మంది కార్మికుల శ్రమతో కట్టిన భవనమిది. ఇది చిరస్థాయిలో నిలిచిపోతుంది. ఈ కార్యక్రమంలోనే ఆ కార్మికులందరినీ ప్రధాని మోదీ సత్కరిస్తారు"

- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి 

Also Read: Sengol in Parliament: పార్లమెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా సెంగోల్, ఏంటీ దీని కథ - ఎందుకంత ప్రత్యేకం?

Published at : 24 May 2023 04:38 PM (IST) Tags: PM Modi Rahul Gandhi President New Parliament Opening New Parliament

సంబంధిత కథనాలు

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

TDP Manifesto: భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో, చంద్రబాబు 6 ప్రధాన హామీలు

TDP Manifesto: భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో, చంద్రబాబు 6 ప్రధాన హామీలు

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!