అన్వేషించండి

ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే ముక్కు పిండి డబ్బు వసూలు చేయాలి - లా కమిషన్ సూచన

Law Commission: ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసే వాళ్లకు భారీ జరిమానాలు విధించాలని లా కమిషన్ సూచించింది.

Law Commission: లా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. బహిరంగ ప్రదేశాలు, జాతీయ రహదారులపై పదేపదే రాస్తారోకోలు చేయడంతో పాటు ఆస్తులను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని తేల్చి చెప్పింది. అలాంటి వాళ్లపై భారీ జరిమానాలు విధించాలని ప్రతిపాదించింది. ఆయా ఆస్తుల మార్కెట్‌ విలువను లెక్కించి ఆ మేరకు వాళ్ల నుంచి వసూలు చేయాలని వెల్లడించింది. పబ్లిక్‌, ప్రైవేట్ ప్రాపర్టీస్‌తో పాటు సంస్థలకు నష్టం కలిగించినా జరిమానాలు విధించాలని తేల్చి చెప్పింది. ఇలా అయితేనే అలాంటి చర్యలు తగ్గుతాయని తెలిపింది. ఆస్తులకు నష్టం కలిగించి అరెస్ట్ అయిన వాళ్లకు బెయిల్‌ దక్కాలంటే కచ్చితంగా ఆ ప్రాపర్టీలు ఎంత విలువ చేస్తాయో అంత డబ్బు చెల్లించాల్సిందే అన్న నిబంధన తీసుకురావాలని లా కమిషన్ సూచించింది. దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ రహదారులపై పదేపదే ప్రతిపక్షాలు ధర్నాలు, రాస్తారోకోలు చేయడం ఇబ్బందికరంగా మారింది. ఆ క్రమంలోనే కొన్ని పబ్లిక్ ప్రాపర్టీస్‌ ధ్వంసమవుతున్నాయి. అందుకే..లా కమిషన్ ఈ సూచనలు చేసింది. అటు ప్రజలూ తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, ఇది దృష్టిలో పెట్టుకుని చట్టంలో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరముందని ప్రతిపాదించింది. 

"ఎవరైనా సరే ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తే మార్కెట్‌లో వాటి విలువ ఎంత ఉందో లెక్కగట్టాలి. అంత మొత్తం వాళ్ల నుంచి వసూలు చేయాలి. ఇలా ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే వాళ్లపై కఠినంగా వ్యవహరించాలి. వాళ్లనే అందుకు బాధ్యులుగా చేయాలి. భారీ జరిమానాలు విధించాలి"

- లా కమిషన్ 

ఇందుకోసం ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలని లా కమిషన్ సూచించింది.  Kerala Prevention of Damage to Private Property and Payment of Compensation Act ని అందుకు ఉదాహరణగా చూపించింది. భారతీయ న్యాయ సన్నిహతలో ఇందుకు సంబంధించి ఓ సెక్షన్‌ని చేర్చాలని ప్రతిపాదించింది. రాజకీయ పార్టీలు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి వారించింది. ఇదే సమయంలో Prevention of Damage to Public Property Act of 1984 ని ప్రస్తావించింది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వాళ్లను నేరస్థులుగా పరిగణిస్తోంది ఈ చట్టం. అయితే...ఈ చట్టం అమల్లోకి వచ్చిన తరవాత కూడా ఆస్తుల ధ్వంసం కొనసాగుతూనే ఉందని గుర్తు చేసింది లా కమిషన్. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2015లో  Damage to Public Property Act (Amendment) Bill ని తీసుకొచ్చింది. కానీ ఇప్పటి వరకూ అది అమల్లోకి రాలేదని అసహనం వ్యక్తం చేస్తోంది లా కమిషన్. పైగా ఏటా ఈ నష్టతీవ్రత పెరుగుతోందని చెబుతోంది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నేడు తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ కీలక భేటీ
నేడు తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ కీలక భేటీ
Kerala Influencer Akhil Megha: కేరళం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జంటకు దిష్టి తగిలేసిందా? బస్సు క్లీనర్‌తో భార్య పరార్‌! బోరుమంటున్న భర్త!
కేరళం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జంటకు దిష్టి తగిలేసిందా? బస్సు క్లీనర్‌తో భార్య పరార్‌! బోరుమంటున్న భర్త!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
అత్యంత లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
కోకాపేటలో లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget