Operation Ajay: ఇజ్రాయిల్ లోని భారతీయుల కోసం "ఆపరేషన్ అజయ్"
Operation Ajay: ఇజ్రాయిల్ నుండి తిరిగి రావాలనుకునే భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ అజయ్ను ప్రారంభించింది. విదేశాల్లోని భారతీయుల భద్రత కోసం కట్టుబడి ఉన్నామంటూ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు.

భారత ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనతో ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయం కూడా స్పందించింది. గురువారం నుండి ఆపరేషన్ అజయ్ ప్రారంభమవుతుందని వార్తా సంస్థ ANI కి తెలియజేసింది. ఇప్పటికే ప్రత్యేక విమానంలో నమోదు చేసుకున్న భారతీయ పౌరులకు ఈ మెయిల్ ద్వారా సమాచారం అందించామని తెలిపింది. వారిని దశల వారీగా ఇండియాకు తీసుకువస్తారు. మరోవైపు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఢిల్లీలో రౌండ్-ది-క్లాక్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్ లో పరిస్థితిని పర్యవేక్షించడానికి, భారతీయులకు సహాయం అందించడానికి టెల్ అవీవ్, రమల్లాలో ప్రత్యేక అత్యవసర హెల్ప్లైన్లను ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్లోని ఉన్నతాధికారులు, అక్కడి భద్రతా బలగాల సాయంతో ఎయిరిండియా , దౌత్యకార్యాలయాల సమన్వయంతో ఆపరేషన్ అజయ్ను నిర్వహిస్తున్నారు.
యుద్ధ ప్రాంతంలో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం ఇదే మొదటిసారి కాదని రాయబార కార్యాలయం ఈ సందర్భంగా గుర్తు చేసింది. భారతదేశం ఇంతకు ముందు కూడా యుద్ధ ప్రాంతాలు, కరోనా మహమ్మారి, ప్రకృతి వైపరీత్యాల నుండి తన పౌరులను క్షేమంగా దేశానికి తీసుకువచ్చింది.
గతంలో ఆపరేషన్ గంగా..
2002 లో రష్యా సైనిక దాడితో కకావికలమైన ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపుకు చేపట్టిన కార్యక్రమం ఆపరేషన్ గంగా. ఆ సమయంలో ఎప్పటికప్పుడు దేశ పౌరులను అప్రమత్తం చేస్తూ క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగను ముమ్మరంగా నిర్వహించింది. ఉక్రెయిన్ నుంచి అక్కడి సరిహద్దు దేశాలైన పోలండ్, హంగరీ, రొమేనియా, స్లోవేకియా నుంచి భారతీయులను స్వదేశానికి తరలించింది.
Before You Go
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
ట్రెండింగ్ వార్తలు






















