అన్వేషించండి

Breaking News Telugu Live Updates: హైదరాబాద్ చేరుకున్న భారత్, ఆసీస్ క్రికెట్ ప్లేయర్లు 

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

LIVE

Key Events
Breaking News Telugu Live Updates: హైదరాబాద్ చేరుకున్న భారత్, ఆసీస్ క్రికెట్ ప్లేయర్లు 

Background

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు (AP Government Employees Retirement Age) 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ ఆర్థిక శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇవి తమకు కూడా వర్తిస్తాయని కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, కంపెనీల ఉద్యోగులు భావించారు. ఈ విషయంపై స్పందించిన ఏపీ ఆర్థిక శాఖ తాజా ఉత్తర్వులతో క్లారిటీ ఇచ్చింది. పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్వర్వులు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో పని చేస్తున్న వారికి మాత్రమే వర్తిస్తాయని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌. ఎస్‌. రావత్‌ ఉత్తర్వులు ఇచ్చారు.

ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు, సొసైటీలు, యూనివర్సిటీల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఈ పదవీ విరమణ వయసు పెంపు వర్తించదు. ఆయా సంస్థలు ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లు అని ఉత్తర్వులు ఇవ్వడం తగదని ఈ కంపెనీలకు రాష్ట్ర ఆర్థికశాఖ సూచించింది. ఏపీ ప్రభుత్వ అనుమతి, అధికారం లేకుండా ఆయా సంస్థల్లో పదవీ విరమణ వయసు పెంపు ఉత్తర్వులు ఇవ్వడం సబబు కాదని, అయినా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఉత్తర్వులు ఎలా ఇస్తారని ఆర్థిక శాఖ ప్రశ్నించింది. తొందరపాటు నిర్ణయాలతో ఇలాంటి ఉత్వర్వులు జారీ చేయడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని తాజా ఉత్తర్వులలో ఆర్థికశాఖ పేర్కొంది. ఈ తరహా ఉల్లంఘనలకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రిటైర్మెంట్ వయసు పెంపు ఉత్వర్వులకు సంబంధించి నివేదికను పంపాలని కూడా ఆయా సంస్థలకు నిర్దేశించింది.

ఏపీ, తెలంగాణలో నేడు సైతం పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్ష సూచనతో తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం, పశ్చిమ రాజస్థాన్ నుంచి వాయువ్య మధ్యప్రదేశ్, ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్ గఢ్, తూర్పు మధ్యప్రదేశ్ ల మీదుగా దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ నుంచి 4.5 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. వీటి ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్ష సూచనతో ఎల్లో జారీ చేసింది ఐఎండీ. ఏపీలో సాధారణ వర్షపాతం నమోదు కానుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దిగువ ట్రోపోవాతావరణంలో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తున్నాయి.

తిరుమలలో శుక్రవారం‌ భక్తుల రద్దీ తగ్గింది. శుక్రవారం 23-09-2022 రోజున 65,158 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి నిన్న 28,416 మంది తలనీలాలు సమర్పించగా, 4.44 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. అయితే సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 29 కంపార్ట్‌మెంట్లో భక్తులు వేచి ఉండడంతో స్వామి వారి సర్వదర్శనానికి దాదాపు 16 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం పడుతుంది. 
ఆగమ శాస్త్రం ప్రకారం కైంకర్యాలు
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన రోజుగా పిలువబడుతుంది. ఈ క్రమంలో ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. వైఖానస అర్చకులు, సన్నిధి గొల్లలు, జియ్యంగార్లు స్వామి వారి సన్నిధిలోకి ప్రవేశించి స్వామి వారి తొలి దర్శనం చేసుకుంటారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతం స్తోత్రం, ప్రవర్తి, మంగళ శాసనం వంటివి పటిస్తూ ఉండగా సన్నిధిలో వైఖానస అర్చకుల ప్రత్యూష కాలరాతనలో భాగంగా శ్రీవారికి మొదటి నివేదనగా పచ్చి పాలను నివేదిస్తారు అర్చకులు. ముందు రోజు రాత్రి పావళింపు సేవలో బంగారు నవారు మంచంపై సేవించి ఉన్న శ్రీవారి కౌతుక బేరం శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి వారిని మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి సింహాసనంపై జీవ స్థానంలో వేయించేపు చేస్తారు. అనంతరం ఏకాంతంగా శ్రీవారికి కర్పూర నిరాజనం సమర్పణ జరుపుతారు అర్చకులు. దీనినే కైకర్యపరుల హారతిని కూడా పిలుస్తారు.

17:53 PM (IST)  •  24 Sep 2022

హైదరాబాద్ చేరుకున్న భారత్, ఆసీస్ క్రికెట్ ప్లేయర్లు 

భారత, ఆసీస్ క్రికెట్ జట్లు హైదరాబాద్ కు చేరుకున్నాయి. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో భారత్-ఆసీస్ మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న క్రికెట్ ప్లేయర్లు భారీ భద్రత మధ్యలో హోటల్ కు బయలుదేరారు. 

14:55 PM (IST)  •  24 Sep 2022

చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడికి జ్యూడీషియల్ రిమాండ్

జల్సాలకు‌ అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించడానికి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్తుడిని పట్టుకొని జ్యుడిస్యల్ రిమాండ్ కు తరలించిన పేట్ బషీరాబాద్ పోలీసులు... 

Voice Over: శాపూర్ నగర్ లోని డిసిపి కార్యాలయంలో బాలానగర్ జోన్ డిసిపి సందీప్ గోనె ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...రాత్రి సమయాలలో తాళం వేసిన ఇళ్ళలో దొంగతనాలకు పాల్పడుతున్న పంచల్ బారమ్ సింగ్(22) ను  పేట్ బషీరాబాద్‌ పోలీసులు మరియు బాలానగర్ సిసిఎస్ పోలీసులు పట్టుకొని ఇతని వద్ద నుండి 4 తులాల బంగారు నగలు, 2 కిలోల వెండి ఆభరణాలు మొత్తం వీటి విలువ ₹3,20,000/- స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. నింధితుడు పంచల్ బారమ్ సింగ్ కు మరో ఆరుగురు నింధితులు 1) Mangal Singh 2) Mangi All 3) Mukesh 4) Mangloi Ramesh 5) Suresh 6) Ramesh Chowhan లు సహకరించారని తెలిపారు. మేడ్చల్(4), పేట బషీరాబాద్‌(2) పియస్ లలో వీరంతా పాత నేరస్తులని, బారమ్ సింగ్ సుచిత్ర సెంటర్ లో అనుమానస్పదంగా తిరుగుతుండగా  అరెస్టు చేసి జ్యుడిస్యల్ రిమాండ్ కు తరలించామని, మరో 6 గురు నింధితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. వీరంతా ధార్ జిలా, మధ్య ప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించామని తెలిపారు. దసరా పండుగ కోసం ఊర్లకు వెల్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సమీప పోలీసులకు సమాచారం ఇవ్వాలని పురుజనులను డిసిపి కోరారు.

14:55 PM (IST)  •  24 Sep 2022

చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడికి జ్యూడీషియల్ రిమాండ్

జల్సాలకు‌ అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించడానికి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్తుడిని పట్టుకొని జ్యుడిస్యల్ రిమాండ్ కు తరలించిన పేట్ బషీరాబాద్ పోలీసులు... 

Voice Over: శాపూర్ నగర్ లోని డిసిపి కార్యాలయంలో బాలానగర్ జోన్ డిసిపి సందీప్ గోనె ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...రాత్రి సమయాలలో తాళం వేసిన ఇళ్ళలో దొంగతనాలకు పాల్పడుతున్న పంచల్ బారమ్ సింగ్(22) ను  పేట్ బషీరాబాద్‌ పోలీసులు మరియు బాలానగర్ సిసిఎస్ పోలీసులు పట్టుకొని ఇతని వద్ద నుండి 4 తులాల బంగారు నగలు, 2 కిలోల వెండి ఆభరణాలు మొత్తం వీటి విలువ ₹3,20,000/- స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. నింధితుడు పంచల్ బారమ్ సింగ్ కు మరో ఆరుగురు నింధితులు 1) Mangal Singh 2) Mangi All 3) Mukesh 4) Mangloi Ramesh 5) Suresh 6) Ramesh Chowhan లు సహకరించారని తెలిపారు. మేడ్చల్(4), పేట బషీరాబాద్‌(2) పియస్ లలో వీరంతా పాత నేరస్తులని, బారమ్ సింగ్ సుచిత్ర సెంటర్ లో అనుమానస్పదంగా తిరుగుతుండగా  అరెస్టు చేసి జ్యుడిస్యల్ రిమాండ్ కు తరలించామని, మరో 6 గురు నింధితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. వీరంతా ధార్ జిలా, మధ్య ప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించామని తెలిపారు. దసరా పండుగ కోసం ఊర్లకు వెల్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సమీప పోలీసులకు సమాచారం ఇవ్వాలని పురుజనులను డిసిపి కోరారు.

14:54 PM (IST)  •  24 Sep 2022

ఆస్తులపై టీటీడీ శ్వేత పత్రం, రూ 85 వేల 705 కోట్లు అని అంచనా

తిరుపతి : టిటిడి ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేయడం జరిగిందని టిటిడి ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి ప్రకటించారు.. ఇవాళ తిరుమలలోని అన్నమయ్య భవన్ లో నిర్వహించిన పాలక మండలి‌ సమావేశంలో పలు‌కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నాంమని, కోవిడ్ కారణంగా రెండేళ్ల తరువాత భక్తుల సమక్షంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.. టీటీడీకి సంబందించిన 960 స్థిర ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయడం జరిగిందని, ఆస్తుల విలువ 
రూ 85 వేల 705 కోట్లు ఉంటుందని ఆయన ప్రకటించారు.. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల పంటలను కొనుగోలు చేసేందుకు రైతు సాధికార సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందన్న ఆయన, తిరుమలలో సామన్య భక్తులకు వసతి సదుపాయం పెంపుపై నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన తెలియజేశారు.

11:38 AM (IST)  •  24 Sep 2022

శ్రీకాకుళం జిల్లా నౌపడ రైల్వే స్టేషన్ వద్ద టెన్షన్ టెన్షన్

శ్రీకాకుళం జిల్లా నౌపడ రైల్వే స్టేషన్ వద్ద టెన్షన్ టెన్షన్..  
రైల్వే ఆస్తుల్లో ఆక్రమణ తొలగింపుకు సిద్ధమైన అధికారులు..   
తీవ్రంగా ప్రతిఘటిస్తున్న స్థానికులు .. 
భారీగా మోహరించిన పోలీసు బలగాలు..
 80 ఏళ్లుగా ఇక్కడే జీవిస్తున్నామంటూ ఇప్పుడు ఆకస్మాత్తుగా వీధిన పడే వద్దంటూ వేడుకుంటున్న బాధితులు..   
 బలగంవంతంగా తొలగించేందుకు సిద్ధమవుతున్న అధికారులు.  
పోలీసులకు,ఆందోళనకారులు మధ్య తోపులాట. పరిస్థితి ఉద్రిక్తత.

11:03 AM (IST)  •  24 Sep 2022

Family Planning Operations: ఇబ్రహీంపట్నం కు.ని. ఆపరేషన్ల ఘటన, బాధ్యులపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు

ఆగస్టు 25వ తేదీన ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలో జరిగిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల (DPL క్యాంపు) ఘటన పై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇబ్రహీంపట్నంలో  దాదాపు ఓ గంట వ్యవధిలో 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. శస్త్రచికిత్స వికటించి నలుగురు మహిళలు మృతిచెందారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్వర్యంలో ప్రభుత్వం నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్వో, DCHS లపై బదిలీ వేటు వేసింది. వీరిని కలుపుకొని మొత్తం 13 మంది వైద్య సిబ్బందిపై క్రమ శిక్షణ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి సంబంధించిన DPL క్యాంపు ఆఫీసర్ డాక్టర్ నాగజ్యోతి,డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ గీత, హెడ్ నర్స్ చంద్రకళతో పాటు, మాడుగుల్ PHC డాక్టర్ శ్రీనివాస్, సూపర్ వైజర్లు అలివేలు, మంగమ్మ, మంచాల్ PHC డాక్టర్ కిరణ్, సూపర్ వైజర్ జయలత, దండుమైలారం PHC డాక్టర్ పూనం, సూపర్ వైజర్ జానకమ్మ ఉన్నారు. 

10:58 AM (IST)  •  24 Sep 2022

మార్చెయ్యటానికీ, తీసెయ్యటానికి NTR అన్నది పేరుకాదు.. బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ ట్వీట్ .........మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది పేరుకాదు..
ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక.. 

తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు..
కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు.. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు…… పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త…….

అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్..
శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు..

10:56 AM (IST)  •  24 Sep 2022

India's Forex Reserves: రూపాయే కాదు, ఫారెక్స్‌ కూడా పాయే!

-భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు ‍‌(ఫారిన్‌ కరెన్సీ లేదా ఫారెక్స్‌) రెండేళ్ల కనిష్టానికి కరిగిపోయాయి. ఈ నెల 16తో ముగిసిన వారానికి, 5.22 బిలియన్ డాలర్లు తగ్గి 545.65 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.

గతేడాది అక్టోబరులో 642 బిలియన్‌ డాలర్ల నిల్వలుండగా, ఇప్పుడు 545.65 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఈ ఏడాది వ్యవధిలోనే 96.45 బిలియన్‌ డాలర్లు తగ్గాయి. 2020 అక్టోబరు 2 తరవాత ఇదే తక్కువ మొత్తం. అంటే, రెండేళ్ల కనిష్ట స్థాయికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు పడిపోయాయి.

10:56 AM (IST)  •  24 Sep 2022

తిరుమలలో శుక్రవారం‌ భక్తుల రద్దీ తగ్గింది

తిరుమలలో శుక్రవారం‌ భక్తుల రద్దీ తగ్గింది. శుక్రవారం 23-09-2022 రోజున 65,158 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి నిన్న 28,416 మంది తలనీలాలు సమర్పించగా, 4.44 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. అయితే సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 29 కంపార్ట్‌మెంట్లో భక్తులు వేచి ఉండడంతో స్వామి వారి సర్వదర్శనానికి దాదాపు 16 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం పడుతుంది. 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: ధర్మానను లక్ష్మీదేవి ఆశీర్వదించారా? శ్రేణులకు హింట్ ఇచ్చారా?
ధర్మానను లక్ష్మీదేవి ఆశీర్వదించారా? శ్రేణులకు హింట్ ఇచ్చారా?
Weather Latest Update: తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
Tillu Square OTT Release Date: టిల్లన్న పాన్ ఇండియా సక్సెస్ కొడతాడా? ఓటీటీల్లో కామెడీ ఫిలిమ్స్ ట్రెండ్ మారుస్తాడా?
టిల్లన్న పాన్ ఇండియా సక్సెస్ కొడతాడా? ఓటీటీల్లో కామెడీ ఫిలిమ్స్ ట్రెండ్ మారుస్తాడా?
Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CSK Slumps Another Away Loss | చెపాక్ బయట ఆడాలంటే తిప్పలు పడుతున్న CSK | IPL 2024MS Dhoni Finishing | LSG vs CSK మ్యాచ్ లో ఫినిషనర్ గా అదరగొట్టిన MS Dhoni | IPL 2024Lucknow Super Giants vs Chennai Super Kings Highlights | లక్నో ఆల్ రౌండ్ షో.. చెన్నై ఓటమి | ABPBrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: ధర్మానను లక్ష్మీదేవి ఆశీర్వదించారా? శ్రేణులకు హింట్ ఇచ్చారా?
ధర్మానను లక్ష్మీదేవి ఆశీర్వదించారా? శ్రేణులకు హింట్ ఇచ్చారా?
Weather Latest Update: తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
Tillu Square OTT Release Date: టిల్లన్న పాన్ ఇండియా సక్సెస్ కొడతాడా? ఓటీటీల్లో కామెడీ ఫిలిమ్స్ ట్రెండ్ మారుస్తాడా?
టిల్లన్న పాన్ ఇండియా సక్సెస్ కొడతాడా? ఓటీటీల్లో కామెడీ ఫిలిమ్స్ ట్రెండ్ మారుస్తాడా?
Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Salaar Movie: 'సలార్‌' మేకర్స్‌ భారీ ఆఫర్‌ - టీవీలో ఈ సినిమా చూస్తూ ప్రభాస్‌ నడిపిన బైక్‌ గెలవచ్చు, ఎలా అంటే!
'సలార్‌' మేకర్స్‌ భారీ ఆఫర్‌ - టీవీలో ఈ సినిమా చూస్తూ ప్రభాస్‌ నడిపిన బైక్‌ గెలవచ్చు, ఎలా అంటే!
Blind People Voting: అంధులు ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
Blind People Voting: అంధులు ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
Air Taxi: గంటన్నర జర్నీ 7 నిమిషాల్లోనే పూర్తవుతుంది, ఎయిర్ టాక్సీ ఎగరబోతోంది
గంటన్నర జర్నీ 7 నిమిషాల్లోనే పూర్తవుతుంది, ఎయిర్ టాక్సీ ఎగరబోతోంది
IPL 2024 CSK vs LSG: లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
Embed widget