అన్వేషించండి

Nanded Hospital Deaths: నాందేడ్ లో వారం రోజుల్లో 108 మంది రోగుల మృతి, ఓ పసికందు కూడా!

నాందేడ్‌లోని ప్రభుత్వాస్పత్రిలో మరణాలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

నాందేడ్‌లోని ప్రభుత్వాస్పత్రిలో మరణ మృదంగం మోగుతోంది. ఇటీవల ఆస్పత్రిలో గడచిన 48 గంటల్లో 31 మంది మృతి చెందిన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గడచిన వారం లోజుల్లో 108 మంది రోగులు మృతి చెందారు. గడచిన 24 గంటల్లోనే 11 మంది మృతిచెందగా..  వీరిలో ఒక పసికందు కూడా ఉండటం విచారకరం. మృతుల్లో కొందరు పాము కాటుకు గురైనవారు కాగా మరికొందరు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారున్నారని ఓ ప్రభుత్వాధికారి తెలిపారు.

అక్టోబర్ నెల ఆరంభంలోనే ఈ ఆస్పత్రిలో 24 గంటల్లో 24 మంది మరణించిన విషయం తెలిసిందే. వారిలో 12 మంది శిశువులు ఉన్నారు. మందుల కొరత, వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆస్పత్రిలో రోగులు మృతి చెందినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

చివరి దశలో రోగులు వచ్చారు'
అయితే, ఔషధాలు, సిబ్బంది కొరత వల్లే ఈ దారుణం జరిగిందనే ఆరోపణలను ఆస్పత్రి డీన్‌ శ్యామ్‌రావు తోసిపుచ్చారు. మెరుగైన వైద్యం అందిస్తున్నప్పటికీ రోగులు స్పందించటం లేదన్నారు. చాలా మంది రోగులు చివరి దశలో ఆసుపత్రికి వచ్చారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక మంది పేషెంట్స్ వచ్చారని చెప్పారు. రోగులను రక్షించడానికి ఆస్పత్రి వైద్యులు సాయశక్తులా కృషి చేస్తున్నారని డీన్ వివరించారు.

ఆస్పత్రిలో జరుగుతున్న వరుస మరణాలపై డీన్ శ్యామ్ వాకోడే మాట్లాడుతు.... " మా హాస్పిటల్లో ఔషధ నిల్వలు సరిపడా ఉన్నాయి. మేము మూడు నెలలకు సరిపడా ఔషధాలను అందుబాటులో ఉంచుతాం. సిబ్బంది కూడా రోగులకు అన్నివేళల చికిత్స అందిస్తున్నారు. ఔషధాల కొరత కారణంగా ఏ రోగి కూడా ప్రాణాలు కోల్పోవట్లేదు. వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతోనే చనిపోతున్నారు. ఇక మరణించిన చిన్నారులలో కొంతమందికి పుట్టుకతోనే వచ్చిన ఆరోగ్య సమస్యలు ఉన్నాయి" అని తెలిపారు.

ఘటనపై విచారణకు కమిటీ
నాందేడ్‌ మరణాలపై స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ముగ్గురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సంబంధిత ఆస్పత్రిని సందర్శించి పూర్తి పరిస్థితులను పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి ఓ సమగ్ర నివేదిక అందించనుంది. మరోవైపు ఏక్‌నాథ్‌ శిందే సర్కార్‌పై విపక్షాలు ఎదురుదాడి చేశాయి. ప్రభుత్వ వైఫల్యం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని మండిపడ్డాయి.

ఒక్కరోజులో 14 మంది మృతి
మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలోని ఘాటీ ప్రభుత్వాస్పత్రిలో కూడా ఇదే తరహా ఘటన జరిగింది. గత 24 గంటల్లో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఆస్పత్రిలో మందుల కొరత వల్లే రోగులు మరణించారన్న ఆరోపణలను జిల్లా ఆస్పత్రి యాజమాన్యం ఖండించింది.

ఈ వరుస ఘటనలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని ప్రతిపక్షనేత అంబాదాస్ దాన్వే డిమాండ్ చేశారు.  ప్రతిపక్షనేత అంబాదాస్ దాన్వే మాట్లాడుతూ... " గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆస్పత్రికి కావాల్సిన మందులు సకాలంలో అందడం లేదు. దీంతో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చే పేద ప్రజలు బలవుతున్నారు. మందుల కొరత కారణంగా ఆస్పత్రి వర్గాలు రోగి బంధువులను మందుల కోసం ప్రైవేటు మెడికల్ షాపులకు పంపుతున్నాయి. బయట వేల రూపాయలు పెట్టి మందులు కొనలేక కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలి." అని చెప్పారు.

నాందేడ్ ఆసుపత్రిలో నవజాత శిశువులు, రోగులు మృతి చెందడం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనను బాంబే హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అటు జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Vaibhav Sooryavanshi News: ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
Vaibhav Sooryavanshi News: ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
Embed widget