By: ABP Desam | Updated at : 29 Dec 2021 06:09 PM (IST)
Edited By: Murali Krishna
నాగాలాండ్ కాల్పుల ఘటన అప్డేట్
నాగాలాండ్ కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తోన్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అన్ని విధాలా సహకరిస్తున్నట్లు భారత ఆర్మీ ప్రకటించింది. ఆ ఘటనకు సంబంధమున్న సైనికులను ప్రశ్నించేందుకు సిట్కు అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. వారి వాంగ్మూలాలను నమోదు చేయవచ్చని ఆర్మీ పేర్కొంది.
ఏం జరిగింది?
నాగాలాండ్ మోన్ జిల్లాలోని ఓటింగ్ వద్ద మిలిటెంట్ల కదలికలున్నట్లు బలగాలకు సమాచారం అందింది. దీంతో డిసెంబర్ 4న ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. అయితే అప్పుడే బొగ్గు గనిలో విధులు ముగించుకుని కార్మికులు తిరు గ్రామం నుంచి ట్రక్కులో ఇంటికి వెళ్తుండగా బలగాలు కాల్పులు జరిపాయి. కాల్పుల్లో 13 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ జవాను సైతం ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
నాగాలాండ్ కాల్పుల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రకటన చేశారు. ఉగ్రవాదులనుకునే సైన్యం.. కూలీలపై కాల్పులు జరిపిందని అమిత్ షా అన్నారు.
ఈ కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలకు పరిహారం ప్రకటించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. మృతుల కుటంబాలకు రూ.11 లక్షల చొప్పున ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నాగాలాండ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఇవ్వనుంది. ఈ మేరకు నాగాలాండ్ సీఎం నీఫియు రియో ప్రకటించారు.
Also Read: Petrol Price Cut Jharkhand: వాహనదారులకు గుడ్ న్యూస్.. లీటర్ పెట్రోల్పై రూ.25 తగ్గింపు!
Hyderabad: నేడు Hydకి మోదీ, ఈ రూట్లలో ట్రాఫిక్కు నో ఎంట్రీ! ముందే వేరే మార్గాలు చూసుకోండి
Weather Updates: నేడు ఈ జిల్లాల్లో వర్షం, ఎల్లో అలర్ట్ జారీ! ఏపీలో నేడు 2-4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు
Modi Hyderabad Tour Today: నేడే హైదరాబాద్కు ప్రధాని, రంగంలోకి 2 వేల మంది పోలీసులు - పూర్తి షెడ్యూల్ ఇదీ
Petrol-Diesel Price, 26 May: ఈ నగరాల్లో వారికి శుభవార్త! ఇక్కడ ఇంధన ధరలు తగ్గుముఖం, ఈ సిటీల్లో మాత్రం పైపైకి
Gold-Silver Price: వరుసగా రెండోరోజూ బంగారం ధర షాక్! పెరిగిన పసిడి, వెండి ధరలు
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
Thyroid: హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్నారా? ఈ ఆహారాలను దూరంగా పెట్టాల్సిందే
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?