అన్వేషించండి

Mukesh Ambani: గురువాయూర్ క్షేత్రాన్ని సందర్శించిన అంబానీ- రికార్డ్ స్థాయిలో భారీ విరాళం!

Mukesh Ambani Visits Guruvayur Temple: పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ.. కేరళ గురువాయూర్ క్షేత్రానికి భారీ విరాళం అందజేశారు.

Mukesh Ambani Visits Guruvayur Temple: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ.. కేరళలోని గురువాయూర్ క్షేత్రాన్ని శనివారం సందర్శించారు. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రాధికతో కలిసి గురువాయురప్పగా పిలుచుకునే శ్రీకృష్ణుని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి అంబానీకి దర్శనం చేయించారు.

భారీ విరాళం

ఈ సందర్భంగా ఆలయంలో అన్నదానం కోసం రూ.1.51 కోట్లు అంబానీ విరాళంగా అందజేశారు. ఈ విషయాన్ని ఆలయ సీనియర్‌ అధికారులు ధ్రువీకరించారు.

అలాగే ఆలయం ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన మెడికల్‌ సెంటర్‌ ప్రణాళికను ముకేశ్‌ అంబానీ ముందు ఆలయ అధికారులు ఉంచారు. ఇందుకోసం రూ.50 కోట్లు ఖర్చవుతుందని సాయం చేయాలని కోరారు. ఈ అభ్యర్థనను తాను పరిశీలిస్తానని అంబానీ పేర్కొన్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

" గురువాయూర్ ఆలయాన్ని సందర్శించిన తర్వాత ముకేశ్ అంబానీ ఒక చెక్కును కానుకగా సమర్పించారు. ఆ చెక్కుపై ₹ 1.51 కోట్లు రాసి ఉంది. ఇప్పటివరకు గురువాయూర్‌ ఆలయానికి ఒక భక్తుడు విరాళంగా సమర్పించిన అత్యధిక మొత్తం ఇదే.                   "
-  డాక్టర్ వీకే విజయన్, గురువాయూర్ దేవస్థానం చైర్మన్

ఈ- హుండీ

మరోవైపు గురువాయూర్ ఆలయంలో ఈ-హుండీని ప్రారంభించారు. ఇప్పుడు భక్తులు డిజిటల్ విరాళాలు ఇవ్వవచ్చు. అక్కడున్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ కానుకను డిజిటల్‌ విధానంలో అందించవచ్చని అధికారులు తెలిపారు.

శ్రీవారి దర్శనం

తిరుమల శ్రీవారిని కూడా ముకేశ్ అంబానీ ఇటీవల దర్శించుకున్నారు. కాబోయే కోడలు రాధికతో కలసి శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసారు.

దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు ముకేశ్ అంబానీకి వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించి, స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత ఆలయం వెలుపలో మీడియాతో అంబానీ మాట్లాడారు.

శ్రీవారి ఆశీస్సులు పొందడం చాల సంతోషంగా ఉంది.  శ్రీవారి ఆలయంలో రోజు రోజుకు మెరుగైన సౌకర్యాల కల్పన జరుగుతుంది. శ్రీవారి ఆలయం భారత పౌరుల గర్వానికి చిహ్నం.                                                    "
-ముకేశ్ అంబానీ, రిలయన్స్ అధినేత

భారీ విరాళం

ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) రూ.1.5 కోట్లు విరాళంగా అందించారు అంబానీ. ఇందుకు సంబంధించిన డీడీని తిరుమలలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. ఆ సమయంలో అంబానీతో పాటు ఎంపీలు గురుమూర్తి, విజయసాయిరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు. పాల్గొన్నారు.

Also Read: యూరప్‌‌లో ఎత్తైన మౌంట్‌ ఎల్బ్రస్‌ను అధిరోహించిన తెలంగాణ కుర్రాడు, హర్యానా గవర్నర్ అభినందనలు

Also Read: Viral Video: బ్యాగులోని ఆపిల్ ను కొట్టేసిన కోతి ఎలా పారిపోతుందో చూడండి?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Telugu TV Movies Today: సోమవారం స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
సోమవారం స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Telugu TV Movies Today: సోమవారం స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
సోమవారం స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
Hero Splendor లేదా TVS Star City Plus ఏ బైక్ కొనడం బెస్ట్ ? ధర, మైలేజీ తెలుసుకోండి
Hero Splendor లేదా TVS Star City Plus ఏ బైక్ కొనడం బెస్ట్ ? ధర, మైలేజీ తెలుసుకోండి
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Embed widget