అన్వేషించండి

Bharat Nyay Yatra: రాహుల్‌కి ఝలక్ ఇచ్చిన మణిపూర్‌ ప్రభుత్వం, న్యాయ్ యాత్రకు అనుమతి నిరాకరణ

Bharat Nyay Yatra: రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్రకు మణిపూర్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.

Rahul Gandhi Bharat Nyay Yatra:  


14 నుంచి న్యాయ్ యాత్ర..

ఈ నెల 14వ తేదీ నుంచి రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్రను (Bharat Nyay Yatra) ప్రారంభించనున్నారు. మణిపూర్ నుంచి ఈ యాత్ర మొదలు కానుంది. ఈ యాత్రకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలోనే రాహుల్‌కి షాక్‌ ఇచ్చింది మణిపూర్ ప్రభుత్వం. యాత్రకు అనుమతి నిరాకరించింది. ground permission ఇవ్వలేమని తేల్చి చెప్పింది. దీనిపై కాంగ్రెస్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘచంద్రతో పాటు మరి కొందరు కీలక నేతలు మణిపూర్ ముఖ్యమంత్రి బైరెన్ సింగ్‌ని ప్రత్యేకంగా కలిశారు. యాత్రకు అనుమతినివ్వాలని కోరారు. కానీ..అందుకు బైరెన్ సింగ్ అంగీకరించలేదు. శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని అనుమతినివ్వలేమని తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఇలా స్పందించడం చాలా దురదృష్టకరమని కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు. కాంగ్రెస్ అడిగిన స్థలంలో కాకుండా మరో ప్రైవేట్ ప్లేస్‌లో యాత్ర మొదలు పెటాలని ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని,మళ్లీ అలజడి రేగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరముందని బైరెన్ సింగ్ అభిప్రాయపడ్డారు. అందుకే భారత్ న్యాయ్ యాత్రకు అనుమతి ఇవ్వలేమని వివరించారు. ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు. మణిపూర్‌ని కాదని ఇంకెక్కడి నుంచి యాత్ర మొదలు పెడతామని ప్రశ్నించారు. మణిపూర్‌లోనే మరో చోట నుంచి యాత్రను ప్రారంభిస్తామని, త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. 

"ఇంఫాల్‌లోని ప్యాలెస్ గ్రౌండ్ నుంచి భారత్ న్యాయ్ యాత్ర ప్రారంభించాలనుకున్నాం. కానీ మణిపూర్ ప్రభుత్వం మాత్రం అందుకు అంగీకరించడం లేదు. అనుమతినివ్వలేదు. తూర్పు నుంచి పశ్చిమం వైపుగా యాత్ర సాగించాలనుకున్నాం. అలాంటప్పుడు మణిపూర్‌ని ఎలా వదులుకుంటాం..? అలా వదిలేసి మేం దేశ ప్రజలకు ఏం సందేశమిస్తాం..? ఎలాగైనా సరే మణిపూర్‌ నుంచే యాత్ర మొదలవుతుంది. కానీ అది ఎక్కడి నుంచి అనేది ఇంకా నిర్ణయం కాలేదు. ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం"

- కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ 

 

మొత్తం 14 రాష్ట్రాల్లో ఈ యాత్ర కొనసాగనుంది. మార్చి 20న యాత్ర ముగియనుంది. 6,200 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది. గతేడాది సెప్టెంబర్ 7వ తేదీన ఫస్ట్ ఫేజ్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) కన్యాకుమారి నుంచి మొదలైంది. దాదాపు 12 రాష్ట్రాల మీదుగా 4 వేల కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్ర కశ్మీర్‌లో ముగిసింది. దాదాపు 136 రోజుల పాటు రాహుల్ గాంధీ ఈ యాత్ర చేశారు. అయితే...ఫస్ట్ ఫేజ్‌లో పూర్తిగా పాదయాత్ర చేశారు రాహుల్ గాంధీ. ఈ సారి మాత్రం హైబ్రిడ్ మోడ్‌లో సాగనుంది. అంటే...కొంత దూరం వరకూ నడక ద్వారా ఆ తరవాత వాహనాల్లో యాత్ర చేయనున్నారు.

Also Read: పాతికేళ్లలో దేశ రూపురేఖలే మార్చేస్తాం, ఇది భారత్‌కి అమృత కాలం - ప్రధాని మోదీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Manchu Lakshmi: ప్లీజ్‌ నాకు సాయం చేయండి -  మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్,  అసలేమైంది..
ప్లీజ్‌ నాకు సాయం చేయండి - మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్, అసలేమైంది..
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Embed widget