అన్వేషించండి

Madhya Pradesh: పెళ్లి భోజనం తిని వాంతులు, 100 మంది ఆసుపత్రి పాలు

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో పెళ్లి భోజనం చేసిన 100 మంది అస్వస్థతకు గురయ్యారు.

Madhya Pradesh:

మధ్యప్రదేశ్‌లో..

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో పెళ్లి భోజనం తిని 100 మంది అస్వస్థతకు గురయ్యారు. పెళ్లి పూర్తికాగానే భోజనం చేసి అతిథులంతా వెళ్లిపోయారు. కాసేపటి తరవాత అందరికీ వాంతులు అయ్యాయి. తీవ్ర కడుపు నొప్పితో విలవిలలాడిపోయారు. సాయంత్రానికి అందరూ మంచం పట్టారు. దగ్గర్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో 20 మంది చేరారని, వారికి చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. మరి కొంత మంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. "ఓ ఆలయంలో జరిగిన పెళ్లికి అందరూ హాజరయ్యారు. అక్కడ వివాహ విందు చేసిన తరవాత  అందరికీ వాంతులయ్యాయి. ప్రస్తుతానికి వారి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదు" అని వైద్యులు తెలిపారు. 

నెల్లూరులోనూ..

ఇటీవలే ఏపీలోని నెల్లూరులోనూ ఇదే జరిగింది. చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం పద్మాపురం గ్రామంలో పెళ్లి విందులో పుడ్ పాయిజన్ అయింది. పెళ్లి విందులో పాల్గొన్న దాదాపు 200 మంది పైగా అస్వస్థత గురి అయ్యారు. పెళ్లి విందులో పాల్గొన్న వారికి ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు కావడంతో వారిని హుటాహుటిన ఎస్.ఆర్.పురం మండల ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. అస్వస్థతకు గురైన వారు ఆసుపత్రిలో చికిత్స కోసం బారులు తీరారు. స్థానికుల వివరాలు ప్రకారం పద్మాపురం గ్రామానికి చెందిన కుటుంబంలో పెళ్లి జరిగింది. మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో దాదాపు 500 మందికి పైగా భోజనాలు ఏర్పాటుచేశారు. వీరిలో ఆఖరులో తిన్నవారు అస్వస్థతకు గురైనట్లు గ్రామస్తులు చెప్పారు. వాంతులు, విరేచనాలు విపరీతంగా కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. 

బిహార్‌లో..

ఇటీవలే బిహార్‌లోనూ ఓ దారుణం జరిగింది. బల్లి పడినట్లు అనుమానిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని బలవంతంగా తినిపించడంతో 200 మంది విద్యార్థులు ఆస్పత్రిపాలయ్యారు. భాగల్పుర్‌లోని ఓ పాఠాశాలలో ఈ ఘటన జరిగింది. మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు ట్యూషన్‌ క్లాసులకు వెళ్లగా అక్కడ ఒకరికి వాంతులయ్యాయి. కొద్దిసేపటికే మిగిలిన విద్యార్థులు కూడా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పాఠశాల సమీపంలోని ఓ వైద్య కేంద్రానికి విద్యార్థులను తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. మధ్యాహ్న భోజనంలో బల్లి పడిందని అందుకే విద్యార్థులు అస్వస్థతగు గురయ్యారని కొంతమంది ఆరోపిస్తున్నారు. 8వ తరగతి విద్యార్థి ప్లేట్‌లో చనిపోయిన బల్లి 
కనిపించడంతో ఈ విషయాన్ని విద్యార్థులు.. ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లారట. అయితే అది బల్లి కాదని వంకాయని విద్యార్థులకు ప్రిన్సిపాల్ చెప్పినట్లు సమాచారం. కొంతమంది విద్యార్థులు ఆహారం తినేందుకు ముందుకు రాకపోవడంతో పాఠశాల సిబ్బంది ఆహారం తినాలని వారిని బలవంతం చేసినట్లు సమాచారం. ఆ ఆహారం తిన్న తర్వాతే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. విద్యార్థులు, తల్లిదండ్రులు చెప్పిందే నిజమైతే పాఠశాల అధికారులు, సిబ్బందిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని  విద్యా శాఖ తెలిపింది. పోలీసులు కూడా ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ప్రధానోపాధ్యాయుడు, సిబ్బంది తప్పు చేసినట్లు  తేలితే అరెస్టు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. 

Also Read: Gujarat Elections: ప్రచార సభలో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న ఒవైసీ - వైరల్ వీడియో

 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Akhanda 2 OTT : ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Akhanda 2 OTT : ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Warangal Viral News: లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
Fact Check: మార్చి 2026 నుంచి రూ.500 నోట్ల చెలామణి ఆగిపోతుందా? మళ్ళీ నోట్ల రద్దు జరుగుతుందా?
మార్చి 2026 నుంచి రూ.500 నోట్ల చెలామణి ఆగిపోతుందా? మళ్ళీ నోట్ల రద్దు జరుగుతుందా?
Aadi Saikumar: ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
Embed widget