అన్వేషించండి

Madhya Pradesh: పెళ్లి భోజనం తిని వాంతులు, 100 మంది ఆసుపత్రి పాలు

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో పెళ్లి భోజనం చేసిన 100 మంది అస్వస్థతకు గురయ్యారు.

Madhya Pradesh:

మధ్యప్రదేశ్‌లో..

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో పెళ్లి భోజనం తిని 100 మంది అస్వస్థతకు గురయ్యారు. పెళ్లి పూర్తికాగానే భోజనం చేసి అతిథులంతా వెళ్లిపోయారు. కాసేపటి తరవాత అందరికీ వాంతులు అయ్యాయి. తీవ్ర కడుపు నొప్పితో విలవిలలాడిపోయారు. సాయంత్రానికి అందరూ మంచం పట్టారు. దగ్గర్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో 20 మంది చేరారని, వారికి చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. మరి కొంత మంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. "ఓ ఆలయంలో జరిగిన పెళ్లికి అందరూ హాజరయ్యారు. అక్కడ వివాహ విందు చేసిన తరవాత  అందరికీ వాంతులయ్యాయి. ప్రస్తుతానికి వారి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదు" అని వైద్యులు తెలిపారు. 

నెల్లూరులోనూ..

ఇటీవలే ఏపీలోని నెల్లూరులోనూ ఇదే జరిగింది. చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం పద్మాపురం గ్రామంలో పెళ్లి విందులో పుడ్ పాయిజన్ అయింది. పెళ్లి విందులో పాల్గొన్న దాదాపు 200 మంది పైగా అస్వస్థత గురి అయ్యారు. పెళ్లి విందులో పాల్గొన్న వారికి ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు కావడంతో వారిని హుటాహుటిన ఎస్.ఆర్.పురం మండల ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. అస్వస్థతకు గురైన వారు ఆసుపత్రిలో చికిత్స కోసం బారులు తీరారు. స్థానికుల వివరాలు ప్రకారం పద్మాపురం గ్రామానికి చెందిన కుటుంబంలో పెళ్లి జరిగింది. మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో దాదాపు 500 మందికి పైగా భోజనాలు ఏర్పాటుచేశారు. వీరిలో ఆఖరులో తిన్నవారు అస్వస్థతకు గురైనట్లు గ్రామస్తులు చెప్పారు. వాంతులు, విరేచనాలు విపరీతంగా కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. 

బిహార్‌లో..

ఇటీవలే బిహార్‌లోనూ ఓ దారుణం జరిగింది. బల్లి పడినట్లు అనుమానిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని బలవంతంగా తినిపించడంతో 200 మంది విద్యార్థులు ఆస్పత్రిపాలయ్యారు. భాగల్పుర్‌లోని ఓ పాఠాశాలలో ఈ ఘటన జరిగింది. మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు ట్యూషన్‌ క్లాసులకు వెళ్లగా అక్కడ ఒకరికి వాంతులయ్యాయి. కొద్దిసేపటికే మిగిలిన విద్యార్థులు కూడా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పాఠశాల సమీపంలోని ఓ వైద్య కేంద్రానికి విద్యార్థులను తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. మధ్యాహ్న భోజనంలో బల్లి పడిందని అందుకే విద్యార్థులు అస్వస్థతగు గురయ్యారని కొంతమంది ఆరోపిస్తున్నారు. 8వ తరగతి విద్యార్థి ప్లేట్‌లో చనిపోయిన బల్లి 
కనిపించడంతో ఈ విషయాన్ని విద్యార్థులు.. ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లారట. అయితే అది బల్లి కాదని వంకాయని విద్యార్థులకు ప్రిన్సిపాల్ చెప్పినట్లు సమాచారం. కొంతమంది విద్యార్థులు ఆహారం తినేందుకు ముందుకు రాకపోవడంతో పాఠశాల సిబ్బంది ఆహారం తినాలని వారిని బలవంతం చేసినట్లు సమాచారం. ఆ ఆహారం తిన్న తర్వాతే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. విద్యార్థులు, తల్లిదండ్రులు చెప్పిందే నిజమైతే పాఠశాల అధికారులు, సిబ్బందిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని  విద్యా శాఖ తెలిపింది. పోలీసులు కూడా ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ప్రధానోపాధ్యాయుడు, సిబ్బంది తప్పు చేసినట్లు  తేలితే అరెస్టు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. 

Also Read: Gujarat Elections: ప్రచార సభలో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న ఒవైసీ - వైరల్ వీడియో

 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sankranti Special Trains: హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
Sankranti Rush: సంక్రాంతికి వెళ్లే జనంతో రోడ్లు జామ్‌-  రైల్వేలు, బస్‌లు, ప్రైవేటు వాహనాలు కిటకిట
సంక్రాంతికి వెళ్లే జనంతో రోడ్లు జామ్‌-  రైల్వేలు, బస్‌లు, ప్రైవేటు వాహనాలు కిటకిట
Telangana Latest News: అధికారుల మనోధైర్యం దెబ్బతీయొద్దు! వైరల్ కంటెంట్‌పై ఐఏఎస్‌ల అసోసియేషన్ ఆగ్రహం; వార్తలు తొలగించాలని డిమాండ్
అధికారుల మనోధైర్యం దెబ్బతీయొద్దు! వైరల్ కంటెంట్‌పై ఐఏఎస్‌ల అసోసియేషన్ ఆగ్రహం; వార్తలు తొలగించాలని డిమాండ్
Bandla Ganesh : బండ్ల గణేష్ మహా పాదయాత్ర - షాద్ నగర్ To తిరుపతి... ఏపీ సీఎం చంద్రబాబుపై అభిమానంతో...
బండ్ల గణేష్ మహా పాదయాత్ర - షాద్ నగర్ To తిరుపతి... ఏపీ సీఎం చంద్రబాబుపై అభిమానంతో...

వీడియోలు

MI vs RCB Highlights WPL 2026 | ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విక్టరీ
MI vs RCB WPL 2026 Harmanpreet Kaur | తమ ఓటమికి కారణం ఏంటో చెప్పిన కెప్టెన్
Shreyas in place of Tilak Ind vs NZ | తిలక్ స్థానంలో శ్రేయస్
Jay Shah about Rohit Sharma | రోహిత్ పై జై షా ప్రశంసలు
Asian Thalassemia Conclave | తలసేమియా గురించి తెలుసుకోకపోవటమే అసలు సమస్య | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sankranti Special Trains: హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
Sankranti Rush: సంక్రాంతికి వెళ్లే జనంతో రోడ్లు జామ్‌-  రైల్వేలు, బస్‌లు, ప్రైవేటు వాహనాలు కిటకిట
సంక్రాంతికి వెళ్లే జనంతో రోడ్లు జామ్‌-  రైల్వేలు, బస్‌లు, ప్రైవేటు వాహనాలు కిటకిట
Telangana Latest News: అధికారుల మనోధైర్యం దెబ్బతీయొద్దు! వైరల్ కంటెంట్‌పై ఐఏఎస్‌ల అసోసియేషన్ ఆగ్రహం; వార్తలు తొలగించాలని డిమాండ్
అధికారుల మనోధైర్యం దెబ్బతీయొద్దు! వైరల్ కంటెంట్‌పై ఐఏఎస్‌ల అసోసియేషన్ ఆగ్రహం; వార్తలు తొలగించాలని డిమాండ్
Bandla Ganesh : బండ్ల గణేష్ మహా పాదయాత్ర - షాద్ నగర్ To తిరుపతి... ఏపీ సీఎం చంద్రబాబుపై అభిమానంతో...
బండ్ల గణేష్ మహా పాదయాత్ర - షాద్ నగర్ To తిరుపతి... ఏపీ సీఎం చంద్రబాబుపై అభిమానంతో...
Hyderabad Crime News: ఏపీలో గ్రూప్‌ 2 క్రాక్ చేసిన అంబర్‌పేట ఎస్సై; కానీ బెట్టింగ్ వ్యసనంతో జైలుపాలు! తాకట్టులో సర్వీస్ రివాల్వర్
ఏపీలో గ్రూప్‌ 2 క్రాక్ చేసిన అంబర్‌పేట ఎస్సై; కానీ బెట్టింగ్ వ్యసనంతో జైలుపాలు! తాకట్టులో సర్వీస్ రివాల్వర్
Telangana Govt Employees: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన 
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన 
Pawan Kalyan:
"పిఠాపురంలో రూల్‌బుక్, అభివృద్ధే మాట్లాడాలి" అధికారులకు కీలక ఆదేశాలు! మార్చి 14న భారీ బహిరంగ సభ
Bha Bha Ba OTT: ఓటీటీకి వచ్చే వారమే 'భా భా బా'... మలయాళ యాక్షన్ కామెడీలో మోహన్ లాల్ కూడా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీకి వచ్చే వారమే 'భా భా బా'... మలయాళ యాక్షన్ కామెడీలో మోహన్ లాల్ కూడా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget