అన్వేషించండి

Gaza: గాజాలోని ఓ స్కూల్‌పై ఇజ్రాయేల్ సేన దాడి, 100 మంది శరణార్థులు మృతి

Israel Hamas: గాజాలోని ఓ స్కూల్‌పై ఇజ్రాయేల్ దాడి చేసింది. ఈ ఘటనలో 100 మంది ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. వీళ్లంతా ఆశ్రయం కోల్పోయి తల దాచుకుంటున్న వాళ్లే.

Gaza News: ఇజ్రాయేల్ హమాస్ యుద్ధం (Israel Hamas War) ఇప్పట్లో ఆగేలా లేదు. పైగా రోజురోజుకీ తీవ్రమవుతోంది. వందలాది మంది పౌరులను బలి తీసుకుంటోంది. ఈ మృతుల్లో చిన్నారులూ ఉంటున్నారు. హమాస్‌ బేస్‌లపై దాడులు చేస్తున్నామని చెబుతూ ఇజ్రాయేల్‌ సైన్యం గాజాలోని స్కూల్స్‌పై దాడులు చేస్తోంది. మరోసారి ఇజ్రాయేల్‌ గాజాలోని ఓ స్కూల్‌పై దాడి చేసింది. ఈ దాడిలో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. Reuters వెల్లడించిన వివరాల ప్రకారం...ప్రార్థనలు చేస్తూ ఉండగా ఈ దాడి జరిగింది. యుద్ధం కారణంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొందరు ఈ స్కూల్‌లో తల దాచుకుంటున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఇక్కడికి వచ్చారు. కానీ..ఇజ్రాయేల్ దాడిలో అంతా బలి అయ్యారు. అయితే...ఇజ్రాయేల్ సైన్యం మాత్రం తమ దాడిని సమర్థించుకుంటోంది. హమాస్ ఉగ్రవాదులు ఈ స్కూల్‌లోనే నక్కి ఉన్నారని, వాళ్లని మట్టుబెట్టాలన్న లక్ష్యంతోనే దాడి చేశామని చెబుతోంది. 

"హమాస్ ఉగ్రవాదులు ఎక్కడైతే తల దాచుకున్నారో అక్కడే ఇజ్రాయేల్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేస్తోంది. గాజాలోని ఆ స్కూల్‌లో వాళ్లు ఉన్నట్టు సమాచారం అందింది. దాడి చేసే ముందే ఎంత నష్టం జరుగుతుందని అంచనా వేశాం. వీలైనంత వరకూ ప్రాణనష్టం తక్కువగా ఉండేలా దాడులు చేశాం. ఏరియల్ సర్వైవలెన్స్‌ చేసి, పక్కా సమాచారం తరవాతే ముందుకు వెళ్లాం"

- ఇజ్రాయేల్ ఎయిర్ ఫోర్స్

గత వారం కూడా గాజాలోని ఓ స్కూల్‌పై ఇజ్రాయేల్ దాడి చేసింది. ఆగస్టు 4వ తేదీన గాజాలో రెండు స్కూల్స్‌పై దాడులు జరిగాయి. చాలా మంది శరణార్థులు ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు. ఈ దాడిలో 30 మంది చనిపోయారు. అంతకు ముందు మరో దాడిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టు 1వ తేదీన ఇజ్రాయేల్ దాడిలో 15 మంది మృతి చెందారు. గాజాలోని బిల్డింగ్‌లు, స్కూల్స్‌ని టార్గెట్‌గా చేసుకుంటోంది ఇజ్రాయేల్ సైన్యం. వీటిలోనే హమాస్ కమాండర్‌లు ఉన్నారని వాదిస్తోంది. కానీ...సాధారణ పౌరులే ఎక్కువగా బలి అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అవన్నీ హమాస్ కమాండ్ సెంటర్‌లు అని వాదిస్తున్నప్పటికీ అంతర్జాతీయంగా ఇజ్రాయేల్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

గతేడాది అక్టోబర్ 3వ తేదీన ఈ యుద్ధం మొదలైంది. ఇజ్రాయేల్‌పై హమాస్‌ దాడులు చేసింది. ఇందుకు ప్రతీకారంగా ఇజ్రాయేల్ ప్రతిదాడులు మొదలు పెట్టింది. అప్పటి నుంచి ఈ విధ్వంసం కొనసాగుతూనే ఉంది. హమాస్ ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ యుద్ధం కారణంగా గాజాలో దాదాపు 39 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. హమాస్‌ని పూర్తిగా అంతం చేసేంత వరకూ ఈ యుద్ధం ఆపేదే లేదని ఇజ్రాయేల్ తేల్చిచెప్పింది. అటు హమాస్ కూడా అదే స్థాయిలో ఎదురు దాడులు చేస్తోంది. హమాస్‌ లీడర్‌లను హతమార్చడంపై అటు ఇరాన్‌ కూడా తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇరాన్‌ మద్దతుతో హెజ్బుల్లా ఇజ్రాయేల్‌పై దాడులకు దిగుతోంది. ఫలితంగా మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. 

Also Read: Viral News: ఘోర ప్రమాదం, గాల్లో అదుపు తప్పి చక్కర్లు కొట్టి కుప్ప కూలిన విమానం - 62 మంది మృతి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fake News on Minister Birthday : శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ - లోకేష్ వార్నింగ్ - ఏం జరిగిందంటే ?
శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ - లోకేష్ వార్నింగ్ - ఏం జరిగిందంటే ?
Viral News: దొంగకు దేహశుద్ధి చేసి పులిహోర తినిపించారు - నల్గొండ జిల్లాలో ఘటన, వైరల్ దృశ్యాలు
దొంగకు దేహశుద్ధి చేసి పులిహోర తినిపించారు - నల్గొండ జిల్లాలో ఘటన, వైరల్ దృశ్యాలు
What is Kejriwal strategy : రాజీనామాతో కేజ్రీవాల్ మరోసారి తప్పిదం చేస్తున్నారా ? రాజకీంగా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారా ?
రాజీనామాతో కేజ్రీవాల్ మరోసారి తప్పిదం చేస్తున్నారా ? రాజకీంగా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారా ?
Devara: దేవర మేనియా - అక్కడ భారీగా మిడ్‌నైట్ బెనిఫిట్‌ షోలకు ప్లాన్‌, టికెట్‌ రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే!
దేవర మేనియా - అక్కడ భారీగా మిడ్‌నైట్ బెనిఫిట్‌ షోలకు ప్లాన్‌, టికెట్‌ రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నిజాం రాజ్యం ఇండియాలో విలీనమయ్యాక ఖాసిం రజ్వీ ఏమయ్యాడు?Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desamసింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fake News on Minister Birthday : శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ - లోకేష్ వార్నింగ్ - ఏం జరిగిందంటే ?
శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ - లోకేష్ వార్నింగ్ - ఏం జరిగిందంటే ?
Viral News: దొంగకు దేహశుద్ధి చేసి పులిహోర తినిపించారు - నల్గొండ జిల్లాలో ఘటన, వైరల్ దృశ్యాలు
దొంగకు దేహశుద్ధి చేసి పులిహోర తినిపించారు - నల్గొండ జిల్లాలో ఘటన, వైరల్ దృశ్యాలు
What is Kejriwal strategy : రాజీనామాతో కేజ్రీవాల్ మరోసారి తప్పిదం చేస్తున్నారా ? రాజకీంగా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారా ?
రాజీనామాతో కేజ్రీవాల్ మరోసారి తప్పిదం చేస్తున్నారా ? రాజకీంగా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారా ?
Devara: దేవర మేనియా - అక్కడ భారీగా మిడ్‌నైట్ బెనిఫిట్‌ షోలకు ప్లాన్‌, టికెట్‌ రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే!
దేవర మేనియా - అక్కడ భారీగా మిడ్‌నైట్ బెనిఫిట్‌ షోలకు ప్లాన్‌, టికెట్‌ రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే!
Telugu News: మేకపాటి విరాళానికి రాజకీయం అడ్డంకి- చంద్రబాబుకు స్పీడ్ పోస్టు- తెలంగాణలో మాత్రం నేరుగా అందజేత!
మేకపాటి విరాళానికి రాజకీయం అడ్డంకి- చంద్రబాబుకు స్పీడ్ పోస్టు- తెలంగాణలో మాత్రం నేరుగా అందజేత!
Ganesh Immersion Live Updates: ముగిసిన ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర
ముగిసిన ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర
Hansika Motwani: 'దేశముదురు'  సన్యాసినిని పోల్చుకున్నారా... బక్కచిక్కినా చక్కగున్న ఆపిల్ బ్యూటీ హన్సిక!
'దేశముదురు' సన్యాసినిని పోల్చుకున్నారా... బక్కచిక్కినా చక్కగున్న ఆపిల్ బ్యూటీ హన్సిక!
Swachhata Hi Seva 2024: తెలుగు రాష్ట్రాల్లో 'స్వచ్ఛతా హీ సేవ' కార్యక్రమం - స్వచ్ఛ గ్రామాలే లక్ష్యంగా ప్రణాళిక
తెలుగు రాష్ట్రాల్లో 'స్వచ్ఛతా హీ సేవ' కార్యక్రమం - స్వచ్ఛ గ్రామాలే లక్ష్యంగా ప్రణాళిక
Embed widget