అన్వేషించండి

Budget 2024: నిర్మలా సీతారామన్ ఖాతాలో ఎన్నో రికార్డులు సంచలనాలు - అదే ఆమె స్పెషాల్టీ

Interim Budget 2024: ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఎన్నో రికార్డులు సృష్టించారు.

Budget 2024 Highlights: మరి కొద్ది నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి కీలక సమయంలో కేంద్రం ప్రవేశ పెడుతున్న పద్దుపై ఎన్నో అంచనాలుండడం సహజం. ఆరోసారి పద్దు ప్రవేశపెడుతూ రికార్డు సృష్టిస్తున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రతిసారీ అంచనాలను అందుకుంటూ బడ్జెట్‌ని రూపొందించడం అంత సులభమేమీ కాదు. కానీ...ఆ సవాలుని ప్రతిసారీ గట్టిగానే ఎదుర్కొన్నారు. అంతే కాదు. ప్రధాని మోదీ ఆకాంక్షలకు అనుగుణంగానే ఆమె పద్దు తయారు చేస్తారన్న పేరునీ సంపాదించుకున్నారు. నిజానికి మోదీ మొదటి సారి ప్రధాని అయ్యాక ఆయన కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా అరుణ్‌జైట్లీ ఎన్నికయ్యారు. మొదటి సారి ఆయనే పద్దుని ప్రవేశపెట్టారు. ఆ తరవాత ఆయన కన్నుమూశారు. అప్పుడు ఎవరిని ఆర్థిక మంత్రిగా నియమించాలని మేధోమథనం చేసి నిర్మలా సీతారామన్‌కి ఆ అవకాశమిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఏ ప్రభుత్వంలో అయినా సరే...ఆర్థిక శాఖ చాలా కీలకం. అంత ముఖ్యమైన బాధ్యతల్ని ఆమెకి అందించారంటే ఎంత భరోసా ఉండి ఉండాలో అర్థం చేసుకోవచ్చు. 2019లో ఆమె ఆర్థిక మంత్రిగా ఎన్నికైనప్పుడే తొలి రికార్డుని సృష్టించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరవాత ఆర్థిక మంత్రి పదవికి ఎన్నికైన తొలి మహిళ ఆమే. అలా 2019లో తొలిసారి ఆమె బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. 1970లోనే ఇందిరా గాంధీ ప్రధాని హోదాలో ఉన్నప్పుడు బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. ఆ రకంగా చూస్తే పద్దుని ప్రవేశపెట్టిన మహిళ ఆమే అయినప్పటికీ...కేవలం ఆర్థిక మంత్రిగా ఉంటూ పద్దుని రూపొందించిన తొలి మహిళ మాత్రం నిర్మలా సీతారామన్. 

Finance Minister Nirmala Sitharaman with MoS Anurag Thakur and others outside the North Block ahead of the presentation of Union Budget 2019-20 at Parliament

Image Credits: PTI

సుదీర్ఘ ప్రసంగం..

ఆమె ఆర్థికమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి తన స్పెషాల్టీని చూపించారు. తొలి పద్దులోనే ఆ ప్రత్యేకత చూపించారు. అంతకు ముందు బడ్జెట్ పత్రాలను బ్రీఫ్‌కేస్‌లో పట్టుకొచ్చే వారు. కానీ...నిర్మలా సీతారామన్‌ వాటిని లెడ్జర్స్‌ రూపంలోకి మార్చారు. ఎర్రని రంగున్న క్లాత్‌లో ఆ లెడ్జర్స్‌ని తీసుకొచ్చే కొత్త సంప్రదాయాన్ని మొదలు పెట్టారు. అలా 2019,2020,2021,2022,2023లో వరుసగా బడ్జెట్‌లు ప్రవేశపెడుతూ వచ్చారు. ఇప్పుడు ఆరోసారి ప్రవేశపెడుతున్నారు. మరి కొద్ది నెలల్లో ఎన్నికలుండడం వల్ల మధ్యంతర పద్దుని రూపొందిస్తారు. ఇలా...తొలిసారి మధ్యంతర బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన తొలి మహిళగానూ రికార్డు సృష్టించారు నిర్మలా సీతారామన్. 2020లో అతి పెద్ద బడ్జెట్ ప్రసంగం చేసి రికార్డు సృష్టించారు. దేశ చరిత్రలోనే అత్యధికంగా ఆర్థిక మంత్రి హోదాలో  2 గంటల 42 నిముషాల పాటు మాట్లాడారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
US Iran War: జోర్డాన్‌లో అమెరికా విమానాలపై ఇరాన్ దాడి! క్షిపణుల దాడిలో పలువురు మృతి!
జోర్డాన్‌లో అమెరికా విమానాలపై ఇరాన్ దాడి! క్షిపణుల దాడిలో పలువురు మృతి!
Parliament Monsoon Session 2026: పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?
పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?
Kerala Kannur Consumer Court: 9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget