అన్వేషించండి

Budget 2024: నిర్మలా సీతారామన్ ఖాతాలో ఎన్నో రికార్డులు సంచలనాలు - అదే ఆమె స్పెషాల్టీ

Interim Budget 2024: ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఎన్నో రికార్డులు సృష్టించారు.

Budget 2024 Highlights: మరి కొద్ది నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి కీలక సమయంలో కేంద్రం ప్రవేశ పెడుతున్న పద్దుపై ఎన్నో అంచనాలుండడం సహజం. ఆరోసారి పద్దు ప్రవేశపెడుతూ రికార్డు సృష్టిస్తున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రతిసారీ అంచనాలను అందుకుంటూ బడ్జెట్‌ని రూపొందించడం అంత సులభమేమీ కాదు. కానీ...ఆ సవాలుని ప్రతిసారీ గట్టిగానే ఎదుర్కొన్నారు. అంతే కాదు. ప్రధాని మోదీ ఆకాంక్షలకు అనుగుణంగానే ఆమె పద్దు తయారు చేస్తారన్న పేరునీ సంపాదించుకున్నారు. నిజానికి మోదీ మొదటి సారి ప్రధాని అయ్యాక ఆయన కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా అరుణ్‌జైట్లీ ఎన్నికయ్యారు. మొదటి సారి ఆయనే పద్దుని ప్రవేశపెట్టారు. ఆ తరవాత ఆయన కన్నుమూశారు. అప్పుడు ఎవరిని ఆర్థిక మంత్రిగా నియమించాలని మేధోమథనం చేసి నిర్మలా సీతారామన్‌కి ఆ అవకాశమిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఏ ప్రభుత్వంలో అయినా సరే...ఆర్థిక శాఖ చాలా కీలకం. అంత ముఖ్యమైన బాధ్యతల్ని ఆమెకి అందించారంటే ఎంత భరోసా ఉండి ఉండాలో అర్థం చేసుకోవచ్చు. 2019లో ఆమె ఆర్థిక మంత్రిగా ఎన్నికైనప్పుడే తొలి రికార్డుని సృష్టించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరవాత ఆర్థిక మంత్రి పదవికి ఎన్నికైన తొలి మహిళ ఆమే. అలా 2019లో తొలిసారి ఆమె బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. 1970లోనే ఇందిరా గాంధీ ప్రధాని హోదాలో ఉన్నప్పుడు బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. ఆ రకంగా చూస్తే పద్దుని ప్రవేశపెట్టిన మహిళ ఆమే అయినప్పటికీ...కేవలం ఆర్థిక మంత్రిగా ఉంటూ పద్దుని రూపొందించిన తొలి మహిళ మాత్రం నిర్మలా సీతారామన్. 

Finance Minister Nirmala Sitharaman with MoS Anurag Thakur and others outside the North Block ahead of the presentation of Union Budget 2019-20 at Parliament

Image Credits: PTI

సుదీర్ఘ ప్రసంగం..

ఆమె ఆర్థికమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి తన స్పెషాల్టీని చూపించారు. తొలి పద్దులోనే ఆ ప్రత్యేకత చూపించారు. అంతకు ముందు బడ్జెట్ పత్రాలను బ్రీఫ్‌కేస్‌లో పట్టుకొచ్చే వారు. కానీ...నిర్మలా సీతారామన్‌ వాటిని లెడ్జర్స్‌ రూపంలోకి మార్చారు. ఎర్రని రంగున్న క్లాత్‌లో ఆ లెడ్జర్స్‌ని తీసుకొచ్చే కొత్త సంప్రదాయాన్ని మొదలు పెట్టారు. అలా 2019,2020,2021,2022,2023లో వరుసగా బడ్జెట్‌లు ప్రవేశపెడుతూ వచ్చారు. ఇప్పుడు ఆరోసారి ప్రవేశపెడుతున్నారు. మరి కొద్ది నెలల్లో ఎన్నికలుండడం వల్ల మధ్యంతర పద్దుని రూపొందిస్తారు. ఇలా...తొలిసారి మధ్యంతర బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన తొలి మహిళగానూ రికార్డు సృష్టించారు నిర్మలా సీతారామన్. 2020లో అతి పెద్ద బడ్జెట్ ప్రసంగం చేసి రికార్డు సృష్టించారు. దేశ చరిత్రలోనే అత్యధికంగా ఆర్థిక మంత్రి హోదాలో  2 గంటల 42 నిముషాల పాటు మాట్లాడారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
Andhra Pradesh News: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP DesamUnstoppable With NBK Season 4 Ep 6 Promo |  Sreeleela తో నవీన్ పోలిశెట్టి ఫుల్ కామెడీ | ABP Desamజగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
Andhra Pradesh News: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Most Expensive Android Smartphones: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?
ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
Maharashtra New Government: మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
Embed widget