News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Wrestlers Protest: రెజ్లర్లను మరోసారి చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం, నేడు సమావేశం అయ్యే అవకాశం

Wrestlers Protest: ప్రభుత్వం రెజ్లర్లను మరోసారి చర్చలకు ఆహ్వానించిందని కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

FOLLOW US: 
Share:

Wrestlers Protest: ప్రభుత్వం మళ్లీ రెజ్లర్లను చర్చలకు ఆహ్వానించింది. కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. క్రీడా మంత్రి ట్వీట్ చేస్తూ.. రెజ్లర్లతో వారి సమస్యలను చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందుకోసం మల్లయోధులను మరోసారి ఆహ్వానించినట్లు తెలిపారు. రాత్రి మంత్రి ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇవాళ సాయంత్రానికి చర్చలు జరిగేలా ఉన్నట్టు తెలుస్తోంది. 

రెండు రోజుల క్రితం కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రెజ్లర్లు, వారి కోచ్‌లు సమావేశమయ్యారని మీడియాకు తెలియజేశారు. సమస్యను పరిష్కరిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారని పూనియా తెలిపారు. సోమవారం రోజు రెజ్లర్లు తమ ఉద్యోగాల్లోకి తిరిగి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై అగ్రశ్రేణి రెజ్లర్లు బజ్ రంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ ట్వీట్ చేస్తూ.. ఇంతకుముందు తమ మెడల్స్ గురించి మాట్లాడేవారని.. ఇప్పుడు తమ ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారని తెలిపారు. తమ జీవితం ప్రమాదంలో ఉందని.. దాని ముందు ఉద్యోగం చాలా చిన్న విషయం అని తెలిపారు. ఉద్యోగం న్యాయానికి అడ్డంకిగా కనిపిస్తే.. దాన్ని వదిలేయడానికి పది సెకన్లు కూడా పట్టవని తెలిపారు. ఉద్యోగ భయాన్ని ప్రదర్శించ వద్దని తెలిపారు. మరో ట్వీట్‌ లో.. రెజ్లర్ బజరంగ్ పునియా దేశ ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మకూడదని విజ్ఞప్తి చేశారు. అలాగే న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు.

బ్రిజ్ భూషణ్ సింగ్‌ పై రెజ్లర్ల ప్రదర్శన కేసు..

ఈ ఏడాది జనవరి 18వ తేదీన లైంగిక వేధింపుల ఆరోపణల కింద బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ మరియు వినేష్ ఫోగట్‌లతో సహా దాదాపు 30 మంది రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. జనవరి 19న క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో రెజ్లర్లు చర్చలు జరిపారు. బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, రవి దహియా క్రీడా మంత్రిని కలిశారు. ఈ విషయంలో చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం మల్లయోధులకు హామీ ఇచ్చింది.

రోజులు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఏప్రిల్ 23న జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు ధర్నాకు దిగారు. రెజ్లింగ్ సమాఖ్య ఎగ్జిక్యూటివ్ కమిటీకి 45 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఒలింపిక్ సంఘం తాత్కాలిక కమిటీ (తాత్కాలిక కమిటీ)ని ఏర్పాటు చేస్తుందని ఏప్రిల్ 24న క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది. మే 13న భారత ఒలింపిక్ సంఘం రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారులందరినీ ఈ సంస్థ నిర్వహణకు సంబంధించిన అధికారిక పనులు మరియు నిర్ణయాలు తీసుకోకుండా పూర్తిగా నిషేధించినట్లు వార్తలు వచ్చాయి. దీని తర్వాత, మే 7న రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికలు జరగాల్సి ఉండగా, వాటిని క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేసింది.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. మే 28వ తేదీన కొత్త పార్లమెంట్‌కు సమీపంలో మహిళా మహా పంచాయత్‌ను నిర్వహించేందుకు రెజ్లర్లు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని జంతర్‌మంతర్‌ నుంచి తమ వస్తువులను తరలించారు. దీని తర్వాత హరిద్వార్‌లోని గంగా నదిలో రెజ్లర్లు తమ పతకాలను విసిరేందుకు ప్రయత్నించారు. అయితే భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్ ,ఇతర మద్దతుదారులు వారిని సముదాయించారు.  దీంతో రెజ్లర్లు పతకాలను గంగలో పారేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. రెజ్లర్లకు మద్దతుగా రైతులు జూన్ 2న హర్యానాలోని కురుక్షేత్రలో ఖాప్ మహాపంచాయత్ నిర్వహించారు.

ఇదిలా ఉండగా మంగళవారం (జూన్ 6), బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల దృష్ట్యా.. బ్రిజ్ భూషణ్ సహచరులు మరియు యూపీలోని గోండాలోని అతని నివాసంలో పనిచేస్తున్న వ్యక్తుల వాంగ్మూలాలను కూడా ఢిల్లీ పోలీసులు రికార్డ్ చేశారు. ప్రస్తుతం మల్లయోధులు మాట్లాడుతూ.. న్యాయం జరిగే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందన్నారు. అలాగే రెజ్లర్ల ఉద్యమం నుండి రైతు సంఘాలు మద్దతు ఉపసంహరించుకోలేదని భారత రైతు సంఘం ప్రతినిధి, నాయకుడు రాకేష్ టికైత్ మంగళవారం తెలిపారు. రెజ్లర్ల డిమాండ్‌ మేరకు జూన్‌ 9వ తేదీన భారత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌కు వ్యతిరేకంగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు.

Published at : 07 Jun 2023 10:53 AM (IST) Tags: Amit Shah Bajrang Punia Anurag Thakur Vinesh Phogat Sakshi malik

ఇవి కూడా చూడండి

Aditya L1: ఇస్రో కీలక అప్‌డేట్, సూర్యుడి వైపు దూసుకెళ్తున్న ఆదిత్య L1

Aditya L1: ఇస్రో కీలక అప్‌డేట్, సూర్యుడి వైపు దూసుకెళ్తున్న ఆదిత్య L1

FSSAI: న్యూస్ పేపర్లలో ఆహారం ప్యాక్ చేయొద్దు, ఆరోగ్యానికి ప్రమాదం- ఫుడ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరిక

FSSAI: న్యూస్ పేపర్లలో ఆహారం ప్యాక్ చేయొద్దు, ఆరోగ్యానికి ప్రమాదం- ఫుడ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరిక

అంబులెన్స్ కు దారివ్వని బిహార్ సీఎం సెక్యూరిటీ, ప్రమాదంలో చిన్నారి ప్రాణాలు

అంబులెన్స్ కు దారివ్వని బిహార్ సీఎం సెక్యూరిటీ, ప్రమాదంలో చిన్నారి ప్రాణాలు

Breaking News Live Telugu Updates: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగిస్తున్న టీడీపీ శ్రేణులు

Breaking News Live Telugu Updates: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగిస్తున్న టీడీపీ శ్రేణులు

ESIC Recruitment 2023: ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో 1,038 పారామెడికల్ స్టాఫ్ పోస్టులు, తెలంగాణ రీజియన్‌లో ఎన్ని పోస్టులంటే?

ESIC Recruitment 2023: ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో 1,038 పారామెడికల్ స్టాఫ్ పోస్టులు, తెలంగాణ రీజియన్‌లో ఎన్ని పోస్టులంటే?

టాప్ స్టోరీస్

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

Bhadrachalam: మంత్రి కేటీఆర్ పర్యటనలో విషాదం- నాలాలో పడి మహిళా హెడ్ కానిస్టేబుల్ మృతి

Bhadrachalam: మంత్రి కేటీఆర్ పర్యటనలో విషాదం- నాలాలో పడి మహిళా హెడ్ కానిస్టేబుల్ మృతి

Lyca Productions: మలయాళంలో లైకా ప్రొడక్షన్స్ ఎంట్రీ - బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌తో

Lyca Productions: మలయాళంలో లైకా ప్రొడక్షన్స్ ఎంట్రీ - బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌తో

Rs 2,000 Exchange Deadline: రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త - చివరి తేదీ ఇదే

Rs 2,000 Exchange Deadline: రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త - చివరి తేదీ ఇదే