అన్వేషించండి

IND vs PAK: ఇండియా–పాక్​ మ్యాచ్​ను ప్రదర్శిస్తే హోటళ్లను ధ్వంసం చేస్తాం: శివసేన నేతల హెచ్చరిక

ఇండియా–పాక్​ మ్యాచ్​ను హోటళ్లలోని టీవీల్లో ప్రదర్శించవద్దని శివసేన లీడర్లు కోరారు. ఒకవేళ్ల స్ట్రీమింగ్​ చేస్తే దాడులు చేస్తామని హెచ్చరించారు.

India Pak Match: టీమిండియా నేడు పాకిస్థాన్​తో ఢీకొనబోతోంది. ఏసియా కప్​లో భాగంగా దుబాయ్​ ఇంటర్నేషనల్​ స్టేడియంలో రాత్రి 8 గంటల నుంచి మ్యాచ్​ ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్​కు గతంలోలాగ మద్దతు లభించడం లేదు. భారత అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పహల్గాం ఉగ్రదాడి చేసిన దేశంతో క్రికెట్ మ్యాచ్​లు అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. పాక్​తో ఏ విధమైన క్రికెట్​ సంబంధాలు కూడా కొనసాగించొద్దని కోరుతున్నారు. అయితే మరికొందరేమో మ్యాచ్ ఆడి పాకిస్థాన్​ను చిత్తుచిత్తుగా ఓడించాలని కోరుకుంటున్నారు. ఇలా పాక్​తో మ్యాచ్​పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మ్యాచ్​ను ప్రదర్శించవద్దని హెచ్చరికలు
ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలోని సోలాపూర్​కు చెందిన శివసేన (UBT) లీడర్​ శరద్​ కోలీ రాష్ట్రంలోని హోటళ్ల ఓనర్లకు హెచ్చరికలు జారీ చేశారు. హోటళ్లలోని టీవీల్లో మ్యాచ్​ను ప్రదర్శించవద్దన్నారు. ఒకవేళ్ల స్ట్రీమింగ్​ చేస్తే దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియా రిలీజ్​ చేశారు. అందులో శరద్​ కోలీ బ్యాట్​ పట్టుకొని హోటల్​ యజమానులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హోటళ్ల యజమానులు ఈ మ్యాచ్​ను ప్రదర్శించవద్దని కోరారు. మహారాష్ట్రతోపాటు దేశ ప్రజలు ఈ మ్యాచ్​ను చూడొద్దని విజ్ఞప్తి చేశారు. పాకిస్థాన్​ను పాపాలు చేసే దేశంగా అభివర్ణించారు.

ఈ బ్యాట్‌తో పగులగొట్టేస్తాం
వీడియోలో హోటల్ యజమానులను ఉద్దేశించి శరద్​ కోలీ మాట్లాడుతూ.. ‘మహారాష్ట్రలోని అన్ని హోటల్ యజమానులను నేను అభ్యర్థిస్తున్నా. మన సోదరీమణుల సింధూరాన్ని చెరిపేయడానికి ప్రయత్నించింది పాకిస్తాన్. పాకిస్తాన్ మ్యాచ్‌ను మహారాష్ట్రలోని ఏ హోటల్‌లోనూ ప్రదర్శించవద్దు. దేశాన్ని ప్రేమిస్తే మీరు ఈ మ్యాచ్‌ను ప్రసారం చేయరు. ఏదైనా హోటల్ యజమాని లేదా ఆపరేటర్ భారత్​–పాక్​ మ్యాచ్‌ను ప్రదర్శిస్తే.. మేము ఆ హోటల్‌ను ఈ బ్యాట్‌తో పగులగొట్టేస్తామని గుర్తుంచుకోండి. హోటల్ యజమాని, డైరెక్టర్ దీనికి బాధ్యత వహిస్తారు’ అని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. అయితే మ్యాచ్​ ప్రదర్శనపై నిబంధనల గురించి శివసేన పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

మ్యాచ్​ ఆడాల్సిందే.. తప్పదు
భారత్​–పాక్​ మ్యాచ్​ను బ్యాన్​ చేయాలని డిమాండ్లు వస్తున్న వేళ క్రీడాశాఖ మాజీ, ప్రస్తుత పార్లమెంట్​ సభ్యుడు అనురాగ్​ ఠాకూర్​ స్పందించారు. ఆసియా క్రికెట్​ కౌన్సిల్(ACC)​, ఇంటర్నేషనల్​ క్రికెట్​ కౌన్సిల్​ (ICC) నిర్వహించే మ్యాచ్​ను బహిష్కరించలేమని వెల్లడించారు.  ACC, ICC ఆధ్వర్యంలో జరిగే మల్టీనేషనల్​ టోర్నమెంట్​లో వారికి కేటాయించిన మ్యాచుల్లో కచ్చితంగా పాల్గొనాలని అన్నారు. ఒకవేళ ఆడకుంటే ఆ దేశాలను టోర్నీ నుంచి ఎలిమినేట్​ చేస్తారని పేర్కొన్నారు.

ద్వైపాక్షిక సిరీస్​లు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆడదు
కానీ పాక్​తో భారత్​ ద్వైపాక్షిక సిరీస్​ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఆడదని అనురాగ్​ ఠాకూర్​ స్పష్టం చేశారు. ‘భారత్​పై పాక్​ ఉగ్ర దాడులు ఆపేసే వరకు టీమిండియా ద్వైపాక్షిక సిరీస్​లు ఆడకూడదని మేము చాలా కాలం క్రితమే నిర్ణయం తీసుకున్నాం’ అని మంత్రి మీడియా సమావేశంలో తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget