అన్వేషించండి

Operation Sindhur : ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియన్ ఆర్మీ సంచలన పోస్టు- సైన్యానికి కేంద్రానికి అండగా యావత్ దేశం

Sindhur Operation in POK: పహల్గాం దాడికి ప్రతీకారంగా భారతదేశం పోక్‌లో దాడి చేసింది. అనంతరం ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. యావత్ దేశం స్పందించింది.

Sindhur Operation in POK: ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి భారతదేశం ప్రతీకారం తీర్చుకుంది. ఏప్రిల్ 7 బుధవారం రాత్రి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో 9 లక్ష్యాలను భారత సాయుధ దళాలు దాడి చేసి ధ్వంసం చేశాయి.

భారత సాయుధ దళాల ఈ చర్యపై, సైన్యం సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి కీలక ప్రకటన వచ్చింది. అందులో న్యాయం జరిగింది. జై హింద్! అనిమాత్రమే రాసి ఉంది. 

ఆర్మీ పెట్టిన  పోస్టు  క్షణాల్లోనే వైరల్ 

న్యాయం జరిగిందని ఆర్మీ పోట్టిన పోస్టు   క్షణాల్లోనే వైరల్ అయింది. అంతా షేర్లు చేశారు. ప్రముఖులు దాన్ని స్టాటస్‌గా పెట్టుకుంటున్నారు. ఆర్మీ చేసిన దాడులకు, కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అండగా ఉంటామంటూ చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కోట్ల మంది తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మరికొందరు భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ దాడులతో   #IndianArmy,  #OperationSindoor #IndianArmedForces లాంటి హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. 

రక్షణ మంత్రిత్వ శాఖ ఏమి చెప్పింది?
రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కాసేపటి క్రితం భారత సాయుధ దళాలు 'ఆపరేషన్ సిందూర్'ను ప్రారంభించాయి, దీని కింద పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇక్కడ నుంచి భారతదేశంపై ఉగ్రవాద దాడుకు ప్రణాళికలు రచించారు. అని వెల్లడించింది. 

మొత్తం తొమ్మిది (9) ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నామని మంత్రిత్వ శాఖ తెలిపింది. మా చర్య కేంద్రీకృతమై ఉంది, రెచ్చగొట్టేది చర్య కాదని స్పష్టం చేసింది. పాకిస్తాన్ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోలేదని తెలిపింది. స్పష్టంగా ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకోవడంలో భారతదేశం చాలా సంయమనాన్ని పాటించింది. పహల్గామ్‌లో జరిగిన అనాగరిక ఉగ్రవాద దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు చనిపోయాడు. అందుకే ఈ చర్యలు తీసుకున్నారు. ఈ దాడి చేసిన వారిని బాధ్యులుగా చేయాలనే మాటకు మేము కట్టుబడి ఉన్నాము. 'ఆపరేషన్ సిందూర్' గురించి వివరణాత్మక సమాచారం బుధవారం ఇస్తామని తెలిపింది.  

ఏప్రిల్ 22న ఏం జరిగింది?
ఏప్రిల్ 22న, పహల్గామ్‌లో 5-6 మంది ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని చంపారు. ఎయిర్‌ఫోర్స్, ఓ ఐపీ అధికారి కూడా చనిపోయాడు. ఉగ్రవాదులు వారిని చంపే ముందు మతం గురించి అడిగారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఉగ్రవాదులలో ఒకరు ఆ మహిళతో మాట్లాడుతూ నిన్ను చంపను, వెళ్లి మోడీకి చెప్పు అని కూడా అన్నాడు.

ఈ ఉగ్రవాద దాడి తర్వాత ప్రధాని మోడీ తన విదేశీ పర్యటన రద్దు చేసుకుని తిరిగి వచ్చారు. తర్వాత రోజే సింధు జల ఒప్పందాన్ని నిలిపివేశారు. ఇంకా చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget