అన్వేషించండి

BrahMos Missiles in Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో బ్రహ్మోస్ మిస్సైల్స్‌తో టార్గెట్స్ ఛేదించాం- సీఎం యోగి ఆదిత్యనాథ్

యోగి ఆదిత్యనాథ్ లక్నోలో బ్రహ్మోస్ యూనిట్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ లో బ్రహ్మోస్ తో పాక్‌ను చావదెబ్బ కొట్టామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం సంచలన విషయాన్ని వెల్లడించారు. భారతదేశం ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దాడుల్లో పాకిస్తాన్‌, పీఓకే ఉగ్రస్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణి వినియోగించినట్లు ఆయన ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్ బ్రహ్మోస్ వాడినందుకే భారత్ సక్సెస్ అయిందని, అందుకే తాము ఆత్మరక్షణ కోసం ఎదురుదాడి చేశామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ కట్టుకథ మొదలుపెట్టింది. ఇరుదేశాలు కాల్పుల విరమణ ప్రకటించిన అనంతరం శనివారం నాడు పాక్ ప్రభుత్వం భారత్‌ మీద ఆరోపణలు చేసింది.

బ్రహ్మోస్ సత్తా ఏంటో పాకిస్తాన్‌ను అడగండి..

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ మిస్సైల్ సెంటర్‌ను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వర్చువల్‌గా ప్రారంభించారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభించిన కార్యక్రమంలో యూపీ సీఎ యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూపీ సీఎ యోగి మాట్లాడుతూ.. "ఆపరేషన్ సింధూర్‌లో బ్రహ్మోస్ క్షిపణి సామర్థ్యాన్ని మీరు చూసి ఉంటారు. మీరు చూడకపోయి ఉంటే, బ్రహ్మోస్ క్షిపణి సత్తా గురించి పాకిస్తాన్ ప్రజలను అడగండి" అని లక్నోలో బ్రహ్మోస్ ఉత్పత్తి యూనిట్ ప్రారంభోత్సవంలో యోగి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్, పీఓకే లోని ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు బ్రహ్మోస్ క్షిపణులతో దాడి చేసి సక్సెస్ సాధించామని యోగి ఆదిత్యనాథ్ చెప్పడంతో దేశ వ్యాప్తంగా ఇది హాట్ టాపిక్ అవుతోంది.

"ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భవిష్యత్తులో జరిగే ఏ ఉగ్రవాద చర్య అయినా యుద్ధంగా పరిగణిస్తామని ప్రకటించారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయకపోతే ఆ సమస్యను పరిష్కరించలేము. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి మోదీ నాయకత్వంలో మనమందరం ఒకటిగా ఉండాలి. శాంతి మంత్రం జపిస్తే, ఉగ్రవాదం ఆగదు. వారికి వారి భాషలోనే సమాధానం చెప్పాలి. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం ప్రపంచానికి సందేశాన్ని ఇచ్చింది" అని యూపీ సీఎం యోగి అన్నారు.

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది..

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో బైసరన్ లోయలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మందిని చంపేశారు. ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ మొదలుపెట్టింది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని కీలకమైన జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి విజయం సాధించింది. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగిసిపోలేదని, మరిన్ని ఉగ్ర స్థావరాలు బాకీ ఉన్నాయని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల అఖిలపక్ష సమావేశం అనంతరం అన్నారు. ఉగ్రవాదంపై భారత్ పోరాటం మరో దశకు చేరిందని, మోదీ నాయకత్వంలో పాక్ ఉగ్రవాదులను ఏరివేయడమే లక్ష్యమన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget