అన్వేషించండి

Lok Sabha Updates: కేసుల్లో చిక్కుకున్న చంద్రబాబును పక్కన పెట్టుకున్నారు- మోడీపై నిప్పులు చెరిగిన టీఎంసీ ఎంపీ

Kalyan Banerjee On Chandra Babu: లోక్ సభలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తెలుగుదేశం పార్టీ అధినేత లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

Andhra Pradesh CM Chandrababu Targeted: ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్డీఏ మిత్రపక్షాల నేతలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన కళ్యాణ్ బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విశ్వసనీయత లేని, అవినీతిపరులైన నేతల అండతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. అవినీతిపరులైన నేతలు ఎన్డీఏలో చేరగానే శుద్ధ పురుషులు అయ్యారా..? అంటూ నిలదీశారు. కేంద్రంలో ప్రస్తుతం అస్థిరమైన ప్రభుత్వం పాలన చేస్తుంటే, ఇంకోవైపు అత్యంత పటిష్టమైన ప్రతిపక్షం ఉందని పేర్కొన్నారు. 

గతంలో స్థిరమైన ప్రభుత్వంతో నిబ్బరంగా కనిపించిన ప్రధాని మోడీ, ప్రస్తుతం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత నితీష్ కుమార్ అనే ఊత కర్రల సాయంతో సభలకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆ రెండు కర్రలు పట్టుకునే దేశ, విదేశాల్లో మోడీ తిరుగుతున్నారని విమర్శించారు. గతంలో మాదిరిగా ప్రధాని మోదీలో ఆత్మస్థైర్యం కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. అదే సమయంలో ప్రతిపక్ష రాజకీయ నేతలపై సిబిఐ దాడులను ప్రస్తావించిన బెనర్జీ.. ఎన్డీఏ పక్షాల నేతలపై కేసులు అంశాన్ని తూర్పారబట్టారు. అవినీతిపరులంతా కూటమి కట్టారని ఇండియా కూటమిపై గతంలో మోడీ పదేపదే ఆరోపణ చేశారని, మరి చంద్రబాబు, అజిత్ పవర్, ప్రపుల్ పటేల్ విషయంలో జరిగిందేమిటో..? అని ప్రశ్నించారు. వీరిపై కేసులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. సిబిఐ, ఈడీలు చంద్రబాబును అరెస్టు చేస్తాయా..? అని నిలదీశారు. టిడిపి అధినేతను ఎందుకు సిబిఐ, ఈడి అరెస్టు చేయడం లేదని బెనర్జీ ప్రశ్నించారు. బిజెపి పంచన చేరగానే వాషింగ్ మిషన్ లో వేసిన మాదిరిగా వారంతా శుద్ధ పురుషులు అయ్యారంటూ..? ఎద్దేవా చేశారు. అవినీతిపరులైన నేతలను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అగత్యం మోడీ ప్రభుత్వానికి ఏర్పడిందని దుయ్యబెట్టారు.

ఆ నేతకు అంత ఆదాయం ఎలా వచ్చిందని ప్రశ్న..

ఎన్నికల సర్వేల అంశాలపై కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ బీజేపీ కూటమి 400 సీట్లు దాటుతుందంటూ ఎగ్జిట్ పోల్ సర్వేల ద్వారా ప్రచారం చేసి స్టాక్ మార్కెట్లో షేర్లు కొనాలని ప్రోత్సహించారని విమర్శించారు. ఫలితాలు రోజున ఒకవైపు స్టాక్ మార్కెట్ పడిపోయి రూ.31 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి అయిపోతే, టిడిపి అగ్రనేతకు చెందిన కంపెనీ మాత్రం రూ.520 కోట్లు ఒక్కరోజులోనే అర్జించిందని వెల్లడించారు. ఇది ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. దీనిపై విచారణ చేయాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై విచారణ చేసే దమ్ముందా..? అని ప్రశ్నించారు. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఐదేళ్లపాటు కొనసాగదని ఆయన జోస్యం చెప్పారు. మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అనంతరం ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోతుందని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగలేదని, ఎన్నికల అధికారులు బిజెపికి అనుకూలంగా పని చేశారని ఆరోపించారు. కళ్యాణ్ బెనర్జీ చేసిన ఆరోపణలు ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యంగా వైసీపీ శ్రేణులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యల వీడియోలను స్ప్రెడ్ చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యాఖ్యలను కౌంటర్ చేసే పనిలో టిడిపి నాయకులు నిమగ్నమయ్యారు. కళ్యాణ్ బెనర్జీ చేసిన ఊతకర్రల వ్యాఖ్యలపై టిడిపి ఎంపీ శబరి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఊత కర్ర కాదని, కత్తి అంటూ పేర్కొన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Palnadu Double Murder: ఇద్దరు అన్నదమ్ములను వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు.. పల్నాడులో దారుణం
ఇద్దరు అన్నదమ్ములను వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు.. పల్నాడులో దారుణం
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...

వీడియోలు

India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Palnadu Double Murder: ఇద్దరు అన్నదమ్ములను వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు.. పల్నాడులో దారుణం
ఇద్దరు అన్నదమ్ములను వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు.. పల్నాడులో దారుణం
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
Bigg Boss 9 Emmanuel: చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
Ramya Krishnan : తలైవాతో నీలాంబరి - 'నరసింహ' మూవీలో ఐకానిక్ సీన్... థియేటర్‌లో ఎంజాయ్ చేసిన రమ్యకృష్ణ
తలైవాతో నీలాంబరి - 'నరసింహ' మూవీలో ఐకానిక్ సీన్... థియేటర్‌లో ఎంజాయ్ చేసిన రమ్యకృష్ణ
Christmas 2025 : ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్మస్ ట్రెడీషన్స్ ఇవే.. ఇండియాలో ఇవి బాగా హైలెట్​ అయ్యాయి, ఎందుకంటే
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్మస్ ట్రెడీషన్స్ ఇవే.. ఇండియాలో ఇవి బాగా హైలెట్​ అయ్యాయి, ఎందుకంటే
Embed widget