మధుర షాహి ఈద్గా సర్వేపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
Supreme Court: పిటిషన్ల నిర్వహణకు వ్యతిరేకంగా మసీదు పక్షం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారించాలని సుప్రీంకోర్టు తెలిపింది.
![మధుర షాహి ఈద్గా సర్వేపై సుప్రీంకోర్టు కీలక తీర్పు Supreme Court Stays Allahabad High Court Order Appoint Commissioner To Inspect Shahi Idgah Masjid మధుర షాహి ఈద్గా సర్వేపై సుప్రీంకోర్టు కీలక తీర్పు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/16/c630ca0a435f4613d280c8d78659adee1705387696316215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mathura Sri Krishna Janmabhoomi Case: ఉత్తరప్రదేశ్లోని మథురలోని షాహి మసీదు (వివాదాస్పద ప్రాంగణం) సర్వే ఉత్తర్వులపై సుప్రీంకోర్టు మంగళవారం (జనవరి 16, 2024) స్టే విధించింది. ఈ కేసు విచారణ సందర్భంగా పిటిషన్ల నిర్వహణకు వ్యతిరేకంగా మసీదు పక్షం దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు విచారించాలని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.
గతంలో అలహాబాద్ హైకోర్టు సర్వేకు ఆదేశించగా, షాహీ ఈద్గా కమిటీ మధుర జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు అన్ని కేసులను బదిలీ చేయడాన్ని వ్యతిరేకించింది. తదుపరి విచారణను 2024 జనవరి 23కి వాయిదా వేసింది.
శ్రీకృష్ణుడి జన్మస్థానంలోని 13.37 ఎకరాల్లో మసీదు నిర్మించారని లక్నోకు చెందిన అడ్వకేట్ 2020లో కేసు దాఖలు చేశారు. అక్కడ కట్రా కేశవ్దేవ్ ఆలయం ఉండేదని చెప్పుకొచ్చారు. అందుకే ఇక్కడ సర్వే చేపట్టాలని పిటిషన్ వేశారు. కానీ దీన్ని ముస్లింలు పూర్తిగా వ్యతిరేకించారు. అలహాబాద్ హైకోర్టులో వాళ్లకు చుక్క ఎదురైంది. అక్కడ సర్వే నిర్వహించేందుకు కోర్టు ఓకే చెప్పింది. దీంతో వారంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు విచారించి మసీదు సర్వేచేసేందుకు కమిషనర్ నియమించాలన్న అలహాబాద్ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)