అన్వేషించండి

Sudan Crisis: సూడాన్‌లో చిక్కుకున్న భార‌తీయుల‌ను స్వ‌దేశానికి తెచ్చేందుకు ఆప‌రేష‌న్ కావేరి ప్రారంభం

Sudan Crisis Operation Kaveri: యుద్ధ‌మేఘాలు క‌మ్ముకున్న ఆఫ్రిక‌న్ దేశం సూడాన్‌లో చిక్కుకున్న భార‌తీయులను స్వ‌దేశానికి తీసుకువ‌చ్చేందుకు విదేశాంగ మంత్రిత్వశాఖ ఆపరేష‌న్ కావేరి ప్రారంభించింది.

Operation Kaveri Sudan Crisis: యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ సూడాన్‌లో చిక్కుకుపోయిన భార‌త‌ పౌరులను రక్షించేందుకు ఆపరేషన్ కావేరీని ప్రారంభించిందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సోమవారం తెలిపారు. "సూడాన్‌లో ఉన్న‌ మా సోదరులందరికీ సహాయం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది" అని జైశంకర్ అన్నారు. "సూడాన్‌లో చిక్కుకుపోయిన మన పౌరులను తిరిగి తీసుకురావడానికి ఆపరేషన్ కావేరీ కొన‌సాగుతోంది. సుమారు 500 మంది భారతీయులు పోర్ట్ సూడాన్‌కు చేరుకున్నారు. మరికొంద‌రు మార్గ‌మ‌ధ్యంలో ఉన్నారు. మా నౌకలు, విమానాలు వారిని స్వదేశానికి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి" అని జైశంకర్ ట్వీట్ చేశారు.

సూడాన్ నుంచి భారతీయులను తరలించేందుకు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA)  ఆదివారం  అత్యవసర ప్రణాళికలు రూపొందించింది. అయితే క్షేత్ర‌స్థాయిలో తీసుకునే చర్యలు భద్రతా పరిస్థితిపై ఆధారపడి ఉంటాయ‌ని పేర్కొంది.

ఆ దేశ రాజధాని ఖార్టూమ్‌లోని వివిధ ప్రాంతాల్లో తీవ్ర పోరాటాలు జరుగుతున్నట్టు నివేదికలు వచ్చాయ‌ని, సూడాన్‌లో భద్రతా పరిస్థితి "అస్థిరంగా" ఉందని పేర్కొంది. ప్రస్తుతం సూడాన్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న‌ 3,000 మందికి పైగా భారతీయ పౌరుల భద్రతపై దృష్టి సారించినట్లు ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.

"మా సన్నాహాల్లో భాగంగా వేగంగా ముందుకు సాగడానికి, భారత ప్రభుత్వం అనేక ప్ర‌ణాళిక‌ల‌ను అనుసరిస్తోంది" అని విదేశీ వ్య‌వ‌హారాల‌ మంత్రిత్వ శాఖ‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. "రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ C-130J విమాన‌లు ప్రస్తుతం జెడ్డాలో అందుబాటులో ఉన్నాయి. INS సుమేధ సూడాన్ పోర్ట్‌కు చేరుకుంది" అని తెలిపింది.

"ఆకస్మిక ప్రణాళికలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం, అయితే క్షేత్ర‌స్థాయిలో స‌హాయ‌చ‌ర్య‌లు అక్క‌డి భద్రతా పరిస్థితిపై ఆధారపడి ఉంటాయి, ఇది ఖార్టూమ్‌లోని వివిధ ప్రదేశాలలో భీకర పోరాటాల నివేదికల నేప‌థ్యంలో అస్థిరంగా కొనసాగుతుంది" అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

సైన్యం, పారామిలిటరీ గ్రూపు మధ్య భీకర పోరు 
సూడాన్‌లో గత 10 రోజులుగా దేశ సైన్యం.. పారామిలిటరీ గ్రూపు మధ్య భీకర పోరు కొన‌సాగుతోంది. ఫ‌లితంగా ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 400 మంది పౌరులు మరణించారు. ఈ నేప‌థ్యంలో సూడాన్‌లో ఉన్న‌ భారతీయుల శ్రేయస్సు, భద్రతకు హామీ ఇవ్వడానికి భారతదేశం పూర్తి స్థాయి ప్రయత్నాలు చేస్తోందని విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ పేర్కొంది. సుడాన్‌లో భ‌ద్ర‌తా ప‌రిస్థితిని సంక్లిష్టత‌ను నిశితంగా పరిశీలిస్తున్నామ‌ని తెలిపింది. సుడాన్‌లోని భారతీయుల ర‌క్ష‌ణ‌కు వివిధ భాగస్వాములతో సమన్వయం చేసుకుంటున్నామ‌ని వివ‌రించింది.

విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ‌, సుడాన్‌లోని భారత రాయబార కార్యాలయం.. ఆ దేశ‌ అధికారులతో పాటు, ఐక్యరాజ్యసమితి, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, యునైటెడ్ స్టేట్స్ స‌హా ఇతరులతో తరచూ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాయి. 

ఫ్రెంచ్ వైమానిక దళం ఇప్పటివరకు ఐదుగురు భారతీయ పౌరులను తరలించినట్లు ఫ్రెంచ్ దౌత్య వర్గాలు తెలిపాయి. వీరితో పాటు 28కి పైగా దేశాల పౌరుల‌ను జిబౌటిలోని ఫ్రెంచ్ సైనిక స్థావరానికి తీసుకువచ్చారు. అంతకుముందు సౌదీ అరేబియా త‌మ‌తో సన్నిహిత సంబంధాలు, స్నేహపూర్వకంగా ఉండే దేశాలకు చెందిన 66 మంది పౌరులను సుడాన్ నుంచి ఆదివారం సురక్షితంగా తరలించింది. వారిలో కొంతమంది భారతీయులు కూడా ఉన్నారు.

టాప్ హెడ్ లైన్స్

India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Embed widget