అన్వేషించండి

Reason for Stampede At TVK Vijay Rally: విజయ్ ర్యాలీలో తొక్కిసలాటకు కారణాలు ఇవే! రూ.10 లక్షలు ప్రకటించిన ప్రభుత్వం

TVK Stampade Death: విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఊపిరాడక టీవీకే పార్టీ కార్యకర్తలు, విజయ్ అభిమానులు ప్రాణాలు కోల్పోయారు.

TVK Vijay Stampade Death: కరూర్: తమిళనాడులోని కరూర్ లో నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్‌ పొలిటికల్ ర్యాలీ విషాదాన్ని నింపింది. శనివారం రాత్రి అకస్మాత్తుగా జరిగిన తొక్కిసలాటలో పలువురు స్పృహతప్పి పడిపోయారు. ఊపిరాడక 31 మంది మరణించారు. వీరిలో 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు ఉన్నారు. మరో 58 మంది గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ తొక్కిసలాట విషాదంపై తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులు, డాక్టర్లను ఆదేశించారు. 

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం

సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు ఇవ్వాలని స్టాలిన్ ఆదేశించారు. ఆసుపత్రులలో ఇంటెన్సివ్ వైద్య చికిత్స పొందుతున్న వారికి రూ. లక్ష చొప్పున ఇవ్వాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు. అంతేకాకుండా, సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి, రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

అనుమతికి రెట్టింపు వచ్చిన కార్యకర్తలు, అభిమానులు

ఇంత పెద్ద విషాదంపై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ ర్యాలీలో తొక్కిసలాట ఎందుకు, ఎలా జరిగిందనే ప్రశ్న రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లో తలెత్తుతోంది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, కరూర్ లో విజయ్ ర్యాలీలో మొదట అంచనా వేసిన కంటే ఎక్కువ మంది గుమిగూడారు. పోలీసులు దాదాపు 30,000 మందిని అనుమతించగా, దాదాపు 60,000 మంది విజయ్ కార్నర్ మీటింగ్ ర్యాలీలో పాల్గొన్నారని భావిస్తున్నారు. ఈవెంట్ స్థలాన్ని ఇప్పటికే ఒకసారి మార్చారు. వాస్తవానికి ఈ ర్యాలీ మధ్య కరూర్ లో నిర్వహించాల్సి ఉండగా, రద్దీ, ట్రాఫిక్ ప్రమాదాల గురించి పోలీసులు హెచ్చరించడంతో వేలుచామిపురానికి ప్రచార వేదికను మార్చారు.

విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకటిలో భయాందోళనలు
విజయ్ టీవీకే పార్టీ ర్యాలీ రాత్రి 7:20 గంటలకు వేలుచామిపురంలో ప్రారంభమైంది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ ప్రాంతమంతా చీకటిగా మారడంతో జనసమూహంలో గందరగోళం నెలకొంది. ప్రజలు భయంతో అటూ ఇటూ పరుగులు తీశారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగి, చాలా మంది పడిపోయారు. ఈ క్రమంలో పలువురు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. 

రద్దీ, వెంటిలేషన్ సమస్య
విద్యుత్ సరఫరా నిలిచిపోయిన తరువాత అసలే రద్దీ ఎక్కువ ఉంటడం, వెంటిలేషన్ లేకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చాయని అధికారులు చెబుతున్నారు. వేలాది మంది ఒకేసారి ర్యాలీ ప్రాంగణం నుంచి కదలడంతో పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమయ్యారు. చాలా మంది స్పృహ కోల్పోగా, వారిని తల్లిదండ్రులు, టీవీకే పార్టీ కార్యకర్తలు చికిత్స కోసం ర్యాలీ నుంచి బయటకు తీసుకెళ్లారు.

భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు
తరువాత విద్యుత్ పునరుద్ధరించిన తరువాత గుంపును చెదరగొట్టారు. కానీ ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన రాజకీయ కార్యక్రమాలలో భద్రత, గుంపు నిర్వహణకు తగిన ఏర్పాట్లు ఎందుకు చేయలేదనే ప్రశ్నను లేవనెత్తింది. విజయ్ పార్టీ తమిళనాడు వెట్రి కజగం (టివికె) దీనిపై ఏ విధంగా స్పందిస్తుందని ప్రజలు వేచి చూస్తున్నారు.

అత్యవసర సేవలకు మార్గం కష్టమైంది
సంఘటన తరువాత, కరూర్ ఎస్పీ నేతృత్వంలోని పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండటంతో అంబులెన్స్, పోలీసు వాహనాలకు దారి కోసం సైతం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. చివరకు ఎలాగోలా మార్గం చేసుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 

తమిళనాడు మాజీ మంత్రి, డీఎంకే నేత సెంథిల్ బాలాజీ శనివారం రాత్రి కరూర్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రికి చేరుకుని పరిశీలించారు. సెంథిల్ బాలాజీ మాట్లాడుతూ, ఇప్పటివరకు తొక్కిసలాటలో 31 మంది మరణించగా, 58 మంది గాయపడి ఆసుపత్రుల్లో చేరారు. ప్రస్తుతం 46 మంది ప్రైవేట్ ఆసుపత్రిలో, 12 మంది ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారని తెలిపారు. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆదివారం నాడు కరూర్ కు రానున్నారని, పరిస్థితిని సమీక్షిస్తారని తెలిపారు.

అధికారులు, ప్రభుత్వం స్పందన
ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ అత్యవసర చర్యలకు ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు మంత్రి అంబిల్ మహేష్ పొయ్యమోళి మరియు మా సుబ్రమణ్యం కరూర్ చేరుకుని సహాయక మరియు వైద్య పనులను పర్యవేక్షించారు. అదనపు డిజిపి కూడా పరిస్థితిని సమీక్షించారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I: దక్షిణాఫ్రికాతో 4వ టీ20- గాయంతో భారత స్టార్ ఓపెనర్ ఔట్! Toss ఆలస్యం
దక్షిణాఫ్రికాతో 4వ టీ20- గాయంతో భారత స్టార్ ఓపెనర్ ఔట్! Toss ఆలస్యం
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Advertisement

వీడియోలు

అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?
Prashant Veer Kartik Sharma CSK IPL 2026 Auction | ఎవరీ ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I: దక్షిణాఫ్రికాతో 4వ టీ20- గాయంతో భారత స్టార్ ఓపెనర్ ఔట్! Toss ఆలస్యం
దక్షిణాఫ్రికాతో 4వ టీ20- గాయంతో భారత స్టార్ ఓపెనర్ ఔట్! Toss ఆలస్యం
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Virat Kohli Anushka Sharma Trolls: అంత అహంకారమా... దివ్యాంగుడిని తోసేస్తారా? కోహ్లీ - అనుష్కపై నెటిజన్స్ ఆగ్రహం
అంత అహంకారమా... దివ్యాంగుడిని తోసేస్తారా? కోహ్లీ - అనుష్కపై నెటిజన్స్ ఆగ్రహం
Train Tickets: ట్రైన్ టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి గుడ్ న్యూస్ - ఇక పది గంటల ముందే ఆ సమాచారం !
రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి గుడ్ న్యూస్ - ఇక పది గంటల ముందే ఆ సమాచారం !
Bigg Boss Telugu Emmanuel Promo : స్పెషల్ AVలు వచ్చేస్తున్నాయి.. మొదటిది Unstoppable Emmanuelదే, పొగడ్తలతో ముంచేసిన బిగ్​బాస్
స్పెషల్ AVలు వచ్చేస్తున్నాయి.. మొదటిది Unstoppable Emmanuelదే, పొగడ్తలతో ముంచేసిన బిగ్​బాస్
Nagarjuna: ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన
ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన
Embed widget