By: ABP Desam | Updated at : 07 Feb 2023 01:36 PM (IST)
మోదీని అభినందిస్తున్న పార్టీ అధ్యక్షుడు నడ్డా
BJP Parliamentary Party Meeting: భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ సమావేశంలో టర్కీలో సంభవించిన వినాశకరమైన భూకంపాన్ని ప్రస్తావించారు. గుజరాత్లోని కచ్ భూకంపం వచ్చిన రోజుల్లో ఎదుర్కొన్ని ఇబ్బందులను మోదీ గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. ''మనం కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నాం. టర్కీకి భారత్ అన్ని విధాలా సహకరిస్తుందన్నారు.
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపంపై సంతాపం వ్యక్తం చేశారు. 2021లో కచ్లో సంభవించిన భూకంపాన్ని గుర్తు చేసిన ప్రధాని మోదీ,'మనం కూడా ఇలాంటి విపత్తులను ఎదుర్కొన్నాం. ఈ క్లిష్ట సమయంలో టర్కీకి మేము (భారత్) అన్ని విధాలా సహాయం చేస్తాము.
వాస్తవానికి సోమవారం (ఫిబ్రవరి 6) టర్కీలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత 7.8గా నమోదైంది. భూకంపం ఎంత తీవ్రంగా ఉందంటే ఇప్పటివరకు ఐదు వేల మందికిపైగా ప్రజలు మరణించారు. 15 వేల మందికి పైగా గాయపడ్డారు.
Budget session: PM Modi attends BJP parliamentary party meeting
Read @ANI Story | https://t.co/EoS6g7MBdI#PMModi #BJP #parliamentarypartymeeting #Parliament #BudgetSession #BJPmeeting pic.twitter.com/JOXbnsHafd — ANI Digital (@ani_digital) February 7, 2023
పేదల ప్రయోజనాల కోసమే బడ్జెట్: ప్రధాని మోదీ
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ప్రధాని మోదీ బడ్జెట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. బడ్జెట్లో పేదల ప్రయోజనాలకు పెద్దపీట వేశామని ప్రధాని మోదీ తెలిపారు. దీన్ని ఎవరూ ఎన్నికల బడ్జెట్ అనడం లేదన్నారు. అయితే, వచ్చే లోక్ సభ ఎన్నికలకు ముందు ఇదే చివరి పూర్తి బడ్జెట్.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విలేకరులతో మాట్లాడుతూ బిజెపిని సైద్ధాంతికంగా వ్యతిరేకిస్తున్న వారు కూడా బడ్జెట్ ను స్వాగతించారని అన్నారు.
క్రీడా కార్యక్రమాలు నిర్వహించాలని కోరిన ప్రధాని...
ముఖ్యంగా నగరాల నుంచి వచ్చే ఎంపీలు క్రీడా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధాని మోదీ కోరారు. వివిధ జీ20 సమావేశాల కోసం భారత్ కు వచ్చిన విదేశీ అతిథులు దేశంలో వారి ఆతిథ్యాన్ని ప్రశంసించారు.
Indian Railways: రైళ్లపై రాళ్లు రువ్వితే కేసులు మామూలుగా ఉండవు - రైల్వేశాఖ వార్నింగ్
No-confidence Motion : లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం, ప్రతిపక్షాలు సమాలోచనలు!
PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్ 30 వరకు ఛాన్స్
Umesh Pal Case Verdict : యూపీ మాఫియా డాన్ అతీక్ అహ్మద్కు జీవిత ఖైదు - ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో యూపీ కోర్టు తీర్పు
ఆధార్, బ్యాంక్ అకౌంట్ లింక్ చేయడంలో మిస్టేక్- వ్యక్తికి జైలు శిక్ష- ఇలాంటిది మీకూ జరగొచ్చు!
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!