అన్వేషించండి

Monsoon in India: దేశంలో 80 శాతానికి పైగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు, ఇక వానలే వానలు!

Monsoon in India: దేశంలో రుతుపవనాలు వేగంగా విస్తరించినట్లు అధికారులు తెలిపారు. సుమారు 62 ఏళ్ల తర్వాత ఇలా జరుగుతున్నట్లు వెల్లడించారు.

Monsoon in India: నిన్న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా రుతుపవనాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వేగంగా చేరుకున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది రుతుపవనాలు ఇప్పటి వరకు దేశంలోని 80 శాతానికి పైగా ప్రాంతాలను చేరుకున్నాయని భారత వాతవరణ శాఖ సీనియన్ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ కుమార్ వెల్లడించారు. రుతు పవనాలు ఆదివారం ఒకే రోజు ధిల్లీ, ముంబైకి చేరుకున్నాయి. 62 ఏళ్ల తర్వాత ఇలా జరుగుతోందని డాక్టర్ నరేష్ కుమార్ తెలిపారు. రుతుపవనాలు ముంబైకి సాధారణంగా జూన్ 11, అలాగే దిల్లీ జూన్ 27వ తేదీకి చేరుకుంటాయని తెలిపారు. అయితే దీనిని నేరుగా వాతావరణ మార్పులతో ముడి పెట్టలేమని ఆయన అన్నారు. దీనిని గుర్తించడానికి 30 నుంచి 40 సంవత్సరాల డేటా అవసరం అవుతుందని వాతావరణ శాస్త్రవేత్త చెప్పారు. 

కొత్త తరహాలో దేశానికి వచ్చిన రుతుపవనాలు

ఈ సంవత్సరం రుతు పవనాలు కొత్త తరహాలో దేశానికి వచ్చాయని డాక్టర్ నరేష్ కుమార్ అన్నారు. 'సాధారణంగా, రుతుపవనాలు అల్పపీడన జోన్ ద్వారా సక్రియం చేయబడతాయి. అల్పపీడన జోన్ వల్ల ఏర్పడి అధిక వేగవంతమైన గాలులు రుతుపవనాలు వేగంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరుకునేలా చేస్తాయి. ఇది వర్షపాతాన్ని కలిగిస్తుంది' అని ఆయన చెప్పారు. పశ్చిమానికి చేరుకున్న రుతుపవనాలను అరేబియా సముద్ర నుంచి బలంగా వీచే గాలులు నెట్టివేస్తాయని వివరించారు. రుతు పవనాలు మహారాష్ట్ర మీద ఉన్నప్పుడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో మరింతగా పెరిగినట్లు ఆయన చెప్పారు. దీని ఫలితంగా ముంబై సహా మహారాష్ట్రలో వర్షాలు కురిశాయన్నారు. అదే సమయంలో అల్పపీడన జోన్ ప్రభావంతో దిల్లీతో సహా వాయువ్య భారత్ వైపు గాలులు వీచాయని, రెండు ప్రాంతాలను ఒకేసారి కవర్ చేశాయని వివరించారు.

అస్సాంలో మరికొన్ని రోజులు వానలు

అస్సాంపై మేఘాలు కమ్ముకున్నాయని, అక్కడ మరికొన్ని రోజులు వర్షాలు కొనసాగుతాయని వివరించారు. రుద్ర ప్రయాగ్, ఉత్తరాఖండ్ లోని వివిధ ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని డాక్టర్ నరేష్ కుమార్ తెలిపారు. గత రెండు రోజులుగా వర్షాలు కురిసిన తర్వాత దేశంలోని అనేక నగరాలు భారీ వర్షాలు, వరదల ప్రభావాన్ని చూస్తాయని చెప్పారు. పంజాబ్, హర్యానాలో ఇవాళ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

Also Read: Weather Latest Update: రెండు రోజుల పాటు ఈ జిల్లాల ప్రజలు ఎక్కడకు వెళ్లినా గొడుగులు పట్టుకోవాల్సిందే

తెలంగాణలో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలుచోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా నమోదు కావచ్చు. కనిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆదివారం గరిష్ణ ఉష్ణోగ్రత 30.8 డిగ్రీలు  ఉంటే... కనిష్ఠ ఉష్ణోగ్రత 22.5 డిగ్రీలుగా ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, భూపల్‌పల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, కొత్తగూడెం ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bandi Sanjay : గోపీనాథ్ ఆస్తుల పంపకంలో రేవంత్, కేటీఆర్ మధ్య తేడాలు- బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
గోపీనాథ్ ఆస్తుల పంపకంలో రేవంత్, కేటీఆర్ మధ్య తేడాలు- బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
Jubilee Hills by-election : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ తనిఖీల కలకలం- కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వాదం
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ తనిఖీల కలకలం- కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వాదం
Telangana Latest News: తెలంగాణలో బీసీలను మరింత దగ్గరయ్యేలా కాంగ్రెస్ మరో మాస్టర్ ప్లాన్!
తెలంగాణలో బీసీలను మరింత దగ్గరయ్యేలా కాంగ్రెస్ మరో మాస్టర్ ప్లాన్!
Tirumala:  తిరుమల భక్తులకు అలర్ట్! ఇకపై ఈ టోకెన్ల జారీలో లక్కీ డిప్ ఉండదు!
తిరుమల భక్తులకు అలర్ట్! ఇకపై ఈ టోకెన్ల జారీలో లక్కీ డిప్ ఉండదు!
Advertisement

వీడియోలు

అల్లటప్పా ఆటగాడనుకున్నారా.. రీప్లేస్ చేయాలంటే బాబులు దిగిరావాల!
Australia vs India 4th T20I Match Highlights | నాలుగో టీ20 లో గెలిచిన టీమిండియా | ABP Desam
వన్టే పోయే.. టీ20 అయినా..! ఈ బ్యాటింగ్‌తో డౌటే..
ఆసియా కప్ దొంగ బీసీసీఐకి భయపడి ఐసీసీ మీటింగ్‌కి డుమ్మా
సూపర్ స్టార్ హర్షిత్ రానా..  టీమ్‌లో లేకపోవటం ఏంటి గంభీర్ సార్..?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay : గోపీనాథ్ ఆస్తుల పంపకంలో రేవంత్, కేటీఆర్ మధ్య తేడాలు- బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
గోపీనాథ్ ఆస్తుల పంపకంలో రేవంత్, కేటీఆర్ మధ్య తేడాలు- బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు 
Jubilee Hills by-election : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ తనిఖీల కలకలం- కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వాదం
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ తనిఖీల కలకలం- కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వాదం
Telangana Latest News: తెలంగాణలో బీసీలను మరింత దగ్గరయ్యేలా కాంగ్రెస్ మరో మాస్టర్ ప్లాన్!
తెలంగాణలో బీసీలను మరింత దగ్గరయ్యేలా కాంగ్రెస్ మరో మాస్టర్ ప్లాన్!
Tirumala:  తిరుమల భక్తులకు అలర్ట్! ఇకపై ఈ టోకెన్ల జారీలో లక్కీ డిప్ ఉండదు!
తిరుమల భక్తులకు అలర్ట్! ఇకపై ఈ టోకెన్ల జారీలో లక్కీ డిప్ ఉండదు!
Chikiri Chikiri Song : సిగ్నేచర్ షాట్ విత్ హుక్ స్టెప్ - మన పెద్దిగాడి 'చికిరి చికిరి' అదిరిపోయింది
సిగ్నేచర్ షాట్ విత్ హుక్ స్టెప్ - మన పెద్దిగాడి 'చికిరి చికిరి' అదిరిపోయింది
Delhi Indira Gandhi International Airport: ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఏం జరిగింది? రన్‌వే పై వందల మంది ప్రయాణికుల వెయిటింగ్!
ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఏం జరిగింది? రన్‌వే పై వందల మంది ప్రయాణికుల వెయిటింగ్!
Bandi Sanjay: హిందువును ముస్లిం టోపీ పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటా - బోరబండలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
హిందువును ముస్లిం టోపీ పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటా - బోరబండలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Narasapur Vande Bharat: నరసాపురం వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కి గ్రీన్ సిగ్నల్.. టైమింగ్స్ ఇవే..!
నరసాపురం వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కి గ్రీన్ సిగ్నల్.. టైమింగ్స్ ఇవే..!
Embed widget