By: ABP Desam | Updated at : 29 May 2023 04:21 PM (IST)
రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశంలో పరిస్థితి
కర్ణాటకలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. కొల్లేగల - టి.నరసీపూర్ ప్రధాన రహదారిపై కురుబూరు గ్రామం పింజర పోల్ వద్ద ప్రైవేట్ బస్సు, ఇన్నోవా కారు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో పది మంది మృతి చెందారు. సోమవారం (మే 29) మధ్యాహ్నం టి.నరసీపూర్ ప్రధాన రహదారిపై కురుబూరు గ్రామం తర్వాత ఓ ప్రైవేట్ బస్సును ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదంలో ఓ చిన్నారి సహా పది మంది చనిపోయారు.
మృతుల్లో పది మంది బళ్లారికి చెందిన వారని తెలిసింది. టి.నరసీపూర్ ప్రధాన రహదారిపై వెళ్తున్న ఇన్నోవా కారు డ్రైవర్ నియంత్రణ తప్పి ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును ఢీకొట్టినట్లు చెబుతున్నారు. టి.నరసీపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై టి.నరసీపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
సోనియా గాంధీకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రాహుల్ గాంధీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ని అరెస్ట్ చేసిన ఈడీ
ఉజ్జెయిన్ అత్యాచార కేసు నిందితుడి ఇల్లు కూల్చివేత, బుల్డోజర్తో ధ్వంసం - వీడియో
Gayatri Joshi: ఇటలీ రోడ్లపై కార్ రేస్ - ‘స్వదేశ్’ మూవీ నటికి తీవ్ర గాయాలు, ఇద్దరు మృతి
గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ పెంచిన కేంద్రం, కేబినెట్ సమావేశంలో నిర్ణయం
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?
Flipkart iPad Offer: కొత్త ట్యాబ్ కొనాలనుకుంటున్నారా? - రూ.20 వేలలోపే యాపిల్ ఐప్యాడ్!
Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్కు మరోసారి ఊరట !
Malkajgiri News: ఎమ్మెల్యే మైనంపల్లిని చర్లపల్లి జైలుకు పంపుతా - ఆయన ప్రత్యర్థి హెచ్చరికలు
/body>