అన్వేషించండి

Congress MP Pen Theft: ఎంపీ జేబులో పెన్ను మిస్సింగ్! కలం కోసం కంటతడి, ఎంపీని ఓదార్చిన సన్నిహితులు-ధర ఎంతో తెలుసా?

Chennai: గిండీలోని ఓ స్టార్ హోటల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఎంపీ విజయ్ వసంత్ హాజరయ్యారు. అదే సమయంలో ఎప్పుడూ చొక్కా జేబులో పెట్టుకునే పెన్ మాయమైందని తెలిసింది.

తన పెన్ పోయిందని తమిళనాడుకు చెందిన ఓ ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, అంత చిన్న పెన్ను ఖరీదు ఏకంగా రూ.1.5 లక్షలకు పైమాటే. అంతేకాక, ఆ పెన్ను చనిపోయిన తన తండ్రి గుర్తు అని తమిళనాడు కాంగ్రెస్ ​కు చెందిన కన్యాకుమారి ఎంపీ విజయ్​ వసంత్ తెలిపారు. ఈ మేరకు కేసు పెట్టారు. చెన్నైలో జరిగిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా స్వాగత సమావేశంలో తన పెన్ను చోరీకి గురైందని ఫిర్యాదు చేశారు. ఈ పెన్నును తన తండ్రి తనకు ఇచ్చారని, అది తనకు ఎంతో ప్రత్యేకమైనదని గుర్తు చేసుకున్నారు. అలాంటి పెన్ను పోవడం తనను ఆవేదనకు గురిచేసిందని చెప్పారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

‘‘మా నాన్నగారు గుర్తుగా ఉంచుకున్న 1.50 లక్షల రూపాయల పెన్ను మాయమైపోయింది’’ అని కాంగ్రెస్ ఎంపీ అన్నారు. కిరాణా దుకాణం నుంచి లోక్‌సభ సభ్యుడి వరకు అలుపెరగని కృషితో వసంతకుమార్ అన్నాచ్చి ఎదిగారు. ఆయన కుమారుడే విజయ్ వసంత్. తండ్రి చనిపోయాక కాంగ్రెస్ ఎంపీ విజయ్ వసంత్ తన తండ్రిని స్మరించుకుంటూ ఆ పెన్నుని సెంటిమెంట్‌గా ఉపయోగిస్తున్నారు. నాన్న (వసంతకుమార్) తన దగ్గర లేకపోయినా, అతను ఉపయోగించిన పెన్ను తన జేబులో ఉంచుకున్నప్పుడల్లా, తండ్రి తనతో ఉన్నాడని తనకు ఎప్పుడూ అనిపిస్తుండేదని అన్నారు.

Also Read: MLA Salary: పాపం, ఆ ఎమ్మెల్యేలకు అంత తక్కువ జీతాలా? తెలంగాణలో మాత్రం హైయెస్ట్ సాలరీలు!

చెన్నై గిండీలోని ఓ స్టార్ హోటల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఎంపీ విజయ్ వసంత్ హాజరయ్యారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. అదే సమయంలో ఎప్పుడూ చొక్కా జేబులో పెట్టుకునే పెన్ మాయమైందని తెలిసింది. దీంతో దిగ్భ్రాంతికి గురైన విజయ్ వసంత్ తన పార్టీ వాలంటీర్ల ద్వారా పెన్ను కోసం వెతికినా అది కనిపించలేదు. దీంతో గిండిలోని పోలీస్ స్టేషన్‌లో తన పెన్ను పోవడంపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా ప్రస్తుతం సదరు స్టార్ హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

పెన్ను పోవడంపై విజయ్ వసంత్ ఆవేదన చెందగా, ఆయన్ను సన్నిహితులు ఓదారుస్తున్నారు. ఇప్పుడు ఎంపీ విజయ్ వసంత్ కలం పోయిందన్న వార్త ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

Also Read: YSRCP MP Phone Theft: వైసీపీ ఎంపీ సెల్ ఫోన్ చోరీ! ఓ యువతికి కష్టాలు, చివరికి ఏమైందంటే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Why did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Embed widget