MRSAM Missile Test: బాలాసోర్ నుంచి ఆర్మీ క్షిపణి పరీక్ష, విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించిన మిస్సైల్ - ప్రత్యేకత ఏంటంటే
ఒడిశాలోని బాలాసోర్ తీరం నుంచి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పరీక్షను నేడు విజయవంతంగా నిర్వహించింది. ఈ మేరకు DRDO అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

భారత రక్షణ అభివృద్ధి సంస్థ (DRDO) నేడు (మార్చి 27) క్షిపణి పరీక్షను విజయవంతంగా చేపట్టింది. ఒడిశాలోని బాలాసోర్ తీరం నుంచి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పరీక్షను నేడు విజయవంతంగా నిర్వహించింది. ఈ మేరకు DRDO అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘MRSAM - ఆర్మీ మిసైల్ సిస్టమ్ను ఉదయం 10.30 గంటలకు ఒడిశాలోని బాలాసోర్ నుంచి ప్రయోగించాం. ఈ క్షిపణి వ్యవస్థ ఆర్మీలో భాగం. ఈ పరీక్షలో అధికారులు నిర్దేశించిన సుదూర లక్ష్యాన్ని క్షిపణి విజయవంతంగా చేధించింది’’ అని డీఆర్డీవో అధికారులు ట్వీట్లో పేర్కొన్నారు.
India today successfully carried out the test firing of the Medium Range Surface to Air Missile air defence system off the coast of Balasore, Odisha: DRDO officials pic.twitter.com/xfqTy4vvKL
— ANI (@ANI) March 27, 2022





















