అన్వేషించండి

Suicides In India: దేశంలో గత ఏడాది రికార్థు స్థాయిలో సూసైడ్స్, గంటకు అంత మంది ఆత్మహత్య చేసుకుంటున్నారా !

NCRB Data: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం దేశంలో 2021వ సంవత్సరంలో ఆత్మహత్యలు పెరిగాయి. దేశవ్యాప్తంగా మొత్తం 1,64,033 సూసైడ్ కేసులు నమోదైనట్లు నివేదిక వెల్లడించింది.

కుటుంబ సమస్యలు, వృత్తిపరమైన ఒత్తిళ్లు, ఒంటరితనం, మానసిక రుగ్మతలు, దురలవాట్లకు బానిస కావడం, ఆర్థికపరమైన సమస్యలు. ఇలా కారణమేదైనా ఈరోజుల్లో చాలామంది వెతుక్కునే దారి ఆత్మహత్య చేసుకోవడం. తనువు చాలిస్తే సమస్యలు ఉండవన్న నమ్మకమే, ప్రాణం తీసుకుంటే ఏ సమస్యా ఉండదనే భావనో లేక క్షణికావేశమో తెలియదు కానీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొందరు. దేశంలో రోజుకు సగటున 450 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే గంటకు 18 మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇవన్నీ కాకి లెక్కలు కావు. క్రైమ్ రికార్డ్స్ ను తయారుచేసే సంస్థ ఎన్సీఆర్బీ ఇచ్చిన నివేదిక ఇది. సూసైడ్ కేసులు నమోదు చేసిన పోలీసుల నుంచి ఈ వివరాలు తీసుకున్నట్లు ఎన్సీఆర్బీ వివరించింది. 

పెరిగిన ఆత్మహత్యలు 
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) నివేదిక ప్రకారం దేశంలో 2021వ సంవత్సరంలో ఆత్మహత్యలు పెరిగాయి. దేశవ్యాప్తంగా మొత్తం 1,64,033 సూసైడ్ కేసులు నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. ఇందులో దాదాపు 1.19 లక్షల మంది పురుషులు, 45,026 మంది మహిళలు, 28 మంది ట్రాన్స్ జెండర్లు  ఉన్నారు.  2020తో పోలిస్తే 7.2 శాతం పెరుగుదల ఉంది. అదేవిధంగా ఆత్మహత్యల రేటు 6.2 శాతం పెరిగింది. 

సగం మంది ఈ 5 రాష్టాల్లోనే 
దేశంలో మహారాష్ట్రలో అత్యధికంగా 22,207 మంది ఆత్మహత్య చేసకున్నారు. ఆ తర్వాత తమిళనాడు (18,925), మధ్యప్రదేశ్ (14,965), పశ్చిమ బెంగాల్ (13,500), కర్ణాటక (13,056) వరుస స్థానాల్లో ఉన్నాయి. దేశం మొత్తం మీద 50.4 శాతం ఆత్మహత్యలు ఈ 5 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది. మిగిలిన 49.6 శాతం కేసులు 23 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదయ్యాయి. అయితే భారత్ లో అత్యధిక జనాభా కలిగిన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బలవన్మరణ కేసులు తక్కువగా నమోదయ్యాయి. దేశ జనాభాలో 16.9 శాతం జనాభా కలిగిన యూపీలో 3.6 శాతం మాత్రమే ఆత్మహత్య కేసులు వెలుగుచూశాయి. 

కేంద్రపాలిత ప్రాంతాల్లో 2021లో దిల్లీలో అత్యధిక ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 2,840 సూసైడ్ కేసులు రాగా.. పుదుచ్చేరిలో 504 కేసులు వచ్చాయి. 2021లో దేశంలోని 53 ప్రధాన నగరాల్లో 25,891 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది.

ఆత్మహత్య రేటుల్లో 4వ స్థానంలో తెలంగాణ 
2021 లో దేశ వ్యాప్తంగా ఆత్మహత్యల రేటు 12 శాతంగా ఉంది. అండమాన్, నికోబార్ దీవుల్లో అత్యధిక ఆత్మహత్య రేటు (39.7) నమోదైనట్లు ఎన్సీఆర్‌బీ రిపోర్ట్ స్పష్టం చేసింది. సిక్కిం (39.2), పుదుచ్చేరి (31.8), తెలంగాణ (26.9), కేరళ (26.9) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు హ్యాపీ న్యూస్ -హైడ్రాకు కొత్త బాధ్యతలు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు హ్యాపీ న్యూస్ -హైడ్రాకు కొత్త బాధ్యతలు  
Disqualification on Jagan: లీవ్ లెటర్ ఇస్తే జగన్‌పై అనర్హతా వేటు లేనట్లే - స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
లీవ్ లెటర్ ఇస్తే జగన్‌పై అనర్హతా వేటు లేనట్లే - స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Monalisa Viral Video: మోసం బాసూ... మోనాలీసా కాదు.
Monalisa Viral Video: మోసం బాసూ... మోనాలీసా కాదు.
Delhi BJP CM Parvesh Verma: జెయింట్ కిల్లర్‌కే ఢిల్లీ సీఎం పదవి- పర్వేశ్‌ వర్మ పేరు దాదాపు ఖరారు! 
జెయింట్ కిల్లర్‌కే ఢిల్లీ సీఎం పదవి- పర్వేశ్‌ వర్మ పేరు దాదాపు ఖరారు! 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Attack on Chilkur Balaji Temple Rangarajan | రామరాజ్యం స్థాపించటానికి వచ్చాం అంటూ దాడి | ABP DesamVishwak sen on Prudhviraj Controversy | 11 గొర్రెలు కాంట్రవర్సీపై విశ్వక్ సారీ | ABP DesamAllu Aravind on Ram Charan | రామ్ చరణ్ పై వ్యాఖ్యల వివాదం మీద అల్లు అరవింద్ | ABP DesamPresident Murmu in Maha kumbh 2025 | మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు హ్యాపీ న్యూస్ -హైడ్రాకు కొత్త బాధ్యతలు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు హ్యాపీ న్యూస్ -హైడ్రాకు కొత్త బాధ్యతలు  
Disqualification on Jagan: లీవ్ లెటర్ ఇస్తే జగన్‌పై అనర్హతా వేటు లేనట్లే - స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
లీవ్ లెటర్ ఇస్తే జగన్‌పై అనర్హతా వేటు లేనట్లే - స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Monalisa Viral Video: మోసం బాసూ... మోనాలీసా కాదు.
Monalisa Viral Video: మోసం బాసూ... మోనాలీసా కాదు.
Delhi BJP CM Parvesh Verma: జెయింట్ కిల్లర్‌కే ఢిల్లీ సీఎం పదవి- పర్వేశ్‌ వర్మ పేరు దాదాపు ఖరారు! 
జెయింట్ కిల్లర్‌కే ఢిల్లీ సీఎం పదవి- పర్వేశ్‌ వర్మ పేరు దాదాపు ఖరారు! 
Andhra Pradesh Liquor Rates:ఏపీలో పెరిగిన మద్యం ధరలు- రూ. 10 పెంచిన ఎక్సైజ్ శాఖ 
ఏపీలో పెరిగిన మద్యం ధరలు- రూ. 10 పెంచిన ఎక్సైజ్ శాఖ 
Tirumala News: శ్రీవారి  లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ కేసులో సీబీఐ సిట్ దూకుడు - సూత్రధారుల వేట ప్రారంభం !
శ్రీవారి లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ కేసులో సీబీఐ సిట్ దూకుడు - సూత్రధారుల వేట ప్రారంభం !
Chilkur Balaji Temple Chief Priest Rangarajan : రంగరాజన్‌కు రేవంత్ ఫోన్ - దాడి రాజకీయానికి ఫుల్‌స్టాప్ పెట్టిన సీఎం
రంగరాజన్‌కు రేవంత్ ఫోన్ - దాడి రాజకీయానికి ఫుల్‌స్టాప్ పెట్టిన సీఎం
Shock To Roja: వైసీపీలోకి నగరి ఎమ్మెల్యే సోదరుడు - రోజాకు చెక్ పెట్టడానికి పెద్దిరెడ్డి స్కెచ్ వేశారా ?
వైసీపీలోకి నగరి ఎమ్మెల్యే సోదరుడు - రోజాకు చెక్ పెట్టడానికి పెద్దిరెడ్డి స్కెచ్ వేశారా ?
Embed widget