అన్వేషించండి

Stage Collapse: స్వాతంత్ర్య దినోత్సవాల్లో అపశృతి, సొమ్మసిల్లి పడిపోయిన మంత్రి, స్పీకర్

Stage Collapse: మధ్యప్రదేశ్ లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. ఆరోగ్య మంత్రి, స్పీకర్ సొమ్మసిల్లి పడిపోయారు.

Independence Day 2023: 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ మధ్యప్రదేశ్ లో అపశృతి చోటుచేసుకుంది. త్రివర్ణ పతాకం ఎగురవేసి వందనం చేసే క్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ ప్రభురామ్ చౌదరి స్పృహతప్పి వేదిక మీదే పడిపోయారు. ఇండిపెండెన్స్ డే వేడుకల సందర్భంగా హర్ గర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం నిర్వహించిన త్రివర్ణ పతాక ర్యాలీలో మంత్రి ప్రభురామ్ పాల్గొన్నారు. విద్యార్థులు, పోలీసులు, అధికారులతో సహా ప్రజలందరూ కలిసి భారీ ఎత్తున ఈ ర్యాలీలు నిర్వహించారు. ఈ త్రివర్ణ పతాక ర్యాలీ కార్యక్రమాలను ఆరోగ్య శాఖ మంత్రి ప్రభురామ్ చౌదరి స్వయంగా దగ్గరుండి చూసుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేశారు.

ఈ రోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లోనూ ప్రభురామ్ చౌదరి చాలా చురుకుగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వేదికపైకి వచ్చి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ జెండాకు గౌరవ వందనం చేస్తున్న క్రమంలో స్పృహతప్పి కింద పడిపోయారు. ఆయన పట్టుకోల్పోతుండటాన్ని ముందే గమనించిన పోలీసుల సిబ్బంది ఆయనను కాసేపు పట్టుకున్నారు. అంతలోనే మంత్రి పూర్తిగా స్పృహ కోల్పోయి కిందపడిపోయారు. వెంటనే ప్రభురామ్ చౌదరిని పోలీసు సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. మంత్రికి రక్తపోటు ఎక్కువగా ఉండి షుగర్ లెవల్స్ తగ్గి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి వైద్యుల సమక్షంలోనే ఉన్నారు. ప్రస్తుతం ప్రభురామ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

స్పృహ తప్పి పడిపోయిన అసెంబ్లీ స్పీకర్ 
అటు అసెంబ్లీ స్పీకర్ గిరీష్ గౌతమ్ కూడా స్పృహ తప్పి పడిపోయారు. జెండా ఎగుర వేసి గౌరవ వందనం చేసిన తర్వాత స్టేజి పై ఏర్పాటు చేసిన పోడియం వద్దకు వచ్చి మాట్లాడుతున్న క్రమంలోనే గిరీష్ గౌతమ్ స్పృహ తప్పి కింద పడి పోయారు. పక్కనే ఉన్న అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించి స్పీకర్ గిరీష్ గౌతమ్ ను పక్కన ఉన్న కుర్చీలో కూర్చోబెట్టారు. కొద్దిగా గాలి వచ్చేలా ఏర్పాటు చేశారు. అనంతరం అందుబాటులో ఉన్న వైద్యులను పిలిపించారు. వారు స్పీకర్ గిరీష్ గౌతమ్ ను పరీక్షించి తాత్కాలిక చికిత్సలో భాగంగా గ్లూకోజ్ ఎక్కించారు. ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ ను సంజయ్ గాంధీ ఆస్పత్రి రీవాకు తరలించారు. 

Also Read: Mallikarjun Kharge: ఎర్రకోట వేడుకకు మల్లికార్జున్ ఖర్గే గైర్హాజరు, ఖాళీ కుర్చీల ఫొటోలు పోస్టు చేసిన కాంగ్రెస్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget